Skip to main content

జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 బ్రేకింగ్ న్యూస్‌ :నేడు జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 ర్యాంకులు విడుదల చేయనున్న ఎన్‌టీఏ

JEE Main 2025 Session 2 exam key release announcement  Deadline for submitting objections to JEE Main preliminary key ends  JEE Main 2025 ranks and category-wise cutoff scores announcement

జేఈఈ మెయిన్  2025 సెషన్‌ 2 లను గురువారం జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) విడుదల చేయనుంది.  తుది విడత పరీక్షల  ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాల సమర్పణ గడువు  ముగిసింది. అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి తుది ‘కీ’తోపాటు ర్యాంకులను వెల్లడిస్తారు. కేటగిరీల వారీగా కటాఫ్‌ స్కోర్‌ నిర్ణయించి...దేశ వ్యాప్తంగా 12 లక్షలు, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది ఈ పరీక్ష రాశారు. మొత్తం 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.  అర్హత సాధించిన వారు మాత్రమే మే 18వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హులు.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

* జేఈఈ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.ac.in/ ను ఓపెన్ చేయాలి.

* జేఈఈ మెయిన్స్ ఫలితాలు 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.

* అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను (అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్) నమోదు చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

* సబ్మిట్‌పై క్లిక్ చేస్తే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

* ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 17 Apr 2025 11:14AM

Photo Stories