Skip to main content

బ్రేకింగ్ న్యూస్‌:రేపు జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 ఫలితాలు విడుదల?

బ్రేకింగ్ న్యూస్‌:రేపు జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 ఫలితాలు విడుదల?
బ్రేకింగ్ న్యూస్‌:రేపు జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 ఫలితాలు విడుదల?

జేఈఈ మెయిన్  2025 సెషన్‌ 2  ఫలితాలను ఏప్రిల్ 19న జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) విడుదల చేయనుంది. తుది విడత పరీక్షల ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాల సమర్పణ గడువు ముగిసింది. ఈరోజు 2 PM ఫైనల్ కీ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో రేపు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.

దేశ వ్యాప్తంగా 12 లక్షలు, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది ఈ పరీక్ష రాశారు. మొత్తం 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.  అర్హత సాధించిన వారు మాత్రమే మే 18వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హులు.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

  • జేఈఈ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.ac.in/ ను ఓపెన్ చేయాలి.
  • జేఈఈ మెయిన్స్ ఫలితాలు 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను (అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్) నమోదు చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • సబ్మిట్‌పై క్లిక్ చేస్తే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మే 2 వరకు దరఖాస్తులకు అవకాశం..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.04.2025.
  •  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.05.2025.
  •  ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.05.2025.
  •  అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్: 11.05.2025 నుంచి 18.05.2025 వరకు
  •  జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షతేది: 18.05.2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 18 Apr 2025 03:42PM
PDF

Photo Stories