వెబ్సైట్లో జేఈఈ హాల్టికెట్లు
Sakshi Education
రూర్కీ: జేఈఈ అడ్వాన్స్ డ్-2019 పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర్కీ సోమవారం విడుదల చేసింది.

అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను అందుబాటులో ఉంచింది. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు, ఫోన్ నంబరు, ఈ-మెయిల్ వివరాలు సమర్పించి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించి రెండు విడతలుగా నిర్వహించిన మెయిన్ పరీక్షలో మెరుగైన స్కోరు సాధించిన వారిలో 2.45 లక్షల మందిని అడ్వాన్స్ డ్ పరీక్షకు అనుమతిస్తారు. ఈ ఏడాది మే 27న జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 4న ఆన్సర్ కీని ప్రకటించి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 14న ఫలితాలను ప్రకటిస్తారు.
Published date : 21 May 2019 05:02PM