మే 6 నుంచే ఇంటర్ జవాబు పత్రాల వాల్యూయేషన్ ప్రారంభం: సీఎం కేసీఆర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల వాల్యూయేషన్ను మే 6వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మే 5వ తేదీన తెలిపారు.

ఇంకా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...విద్యాశాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ, కార్యదర్శి తదితరులు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన మాడ్యూల్ను తయారు చేస్తారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం కొంత ఆలస్యంగా జూన్ నెలాఖరు లేదా జూలైలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.
Published date : 06 May 2020 03:29PM