Skip to main content

మే 29న జేఈఈ అడ్వాన్‌‌సడ్ రెస్పాన్‌‌స షీట్లు

సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్‌‌సడ్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల రెస్పాన్‌‌స షీట్లను మే 29న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు ఐఐటీ రూర్కీ ఏర్పాట్లు చేసింది. మే 27న జరిగిన జేఈఈ అడ్వాన్‌‌సడ్ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ పరీక్షల్లో గణితం, ఫిజిక్స్‌లో ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు రావడంతో విద్యార్థులు కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొన్నింటికి ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నట్లు ఐఐటీ నిఫుణుడు ఉమాశంకర్ తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పోల్చితే కెమిస్ట్రీ సులభంగా ఉందన్నారు. పేపర్-1 కంటే పేపర్-2లో ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు చెప్పారు. 62 మార్కులకు సంబంధించిన ప్రశ్నలకు ఒకటి కంటే రెండు సమాధానాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రశ్నల తీరుతో జనరల్ కటాఫ్ 30 శాతం కంటే ఎక్కువ ఉండే అకాశం ఉందన్నారు. అలాగే ఓబీసీలో 25 శాతం కంటే ఎక్కువ, ఎస్సీలో 12 శాతం కంటే ఎక్కువ, ఎస్టీల్లో 12 శాతం కంటే ఎక్కువ కటాఫ్ ఉండొచ్చని పేర్కొన్నారు.
Published date : 28 May 2019 05:40PM

Photo Stories