జిల్లా టాపర్లకు ‘విఐటీ’లో ఉచిత విద్య
Sakshi Education
అమరావతి: ఇంటర్మీడియట్ ఎంపీసీలో జిల్లా టాపర్లుగా రాణించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు వీఐటీ-ఏపీ క్యాంపస్లలో 100 శాతం ఫీజు రాయితీ కల్పిస్తున్నట్లు వీఐటీ-ఏపీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ చెప్పారు.

ప్రతి జిల్లా నుండి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి చొప్పున మొత్తం 26 మందికి ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. వెల్లూరు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రారంభమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి, వెల్లూరు, చెన్నై, భోపాల్ క్యాంపస్లలో వివిధ బ్రాంచ్లకు ఆన్లైన్ కౌన్సెలింగ్ జరుపుతున్నామని, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో టాపర్లకు వంద శాతం ఫీజు రాయితీ, వీఐటీ ప్రవేశ పరీక్షలో 1 నుండి 50 లోపు ర్యాంకు సాధించిన వారికి 75%, 51 నుండి 100 లోపు ర్యాంకు వచ్చిన వారికి 50%, 101 నుండి 1,000 లోపు ర్యాంకు వచ్చిన వారికి 25% ఫీజులో రాయితీ ఉంటుందని చెప్పారు. వీఐటీ-ఏపీలో అడ్మిషన్ తీసుకున్న ఎస్ఏ సాయి సుముఖ్ (ర్యాంకు 39)కు ఆయన సీట్ అలాట్మెంట్ లెటర్ను అందజేసారు.
Published date : 10 May 2019 04:33PM