ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. మే 21వ తేదీ నుంచి మొదటి దశ ప్రవేశాలను చేపట్టనున్నట్లు పేర్కొంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు గురుకుల, కేజీబీవీ, మోడల్ స్కూల్ తదితర పాఠశాలలన్నింటికి ఈ ప్రవేశాలు వర్తిస్తాయని తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తుల జారీతోపాటు మొదటి దశ ప్రవేశాలను మే 21వ తేదీ నుంచి ప్రారంభించాలని స్పష్టం చేసింది. తరగతులను జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని, జూలై 1 నాటికి మొదటి దశ ప్రవేశాలను పూర్తి చేయాలని సూచించింది. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లను కేటాయించాలని పేర్కొంది. పదో తరగతిలో విద్యార్థులు సాధించిన జీపీఏ ప్రకారం సీట్లను కేటాయించాలని తెలిపింది. తమ బోర్డు వెబ్సైట్లో పేర్కొన్న గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల్లో మాత్రమే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చాలని స్పష్టం చేసింది.
Published date : 11 May 2019 02:40PM