Skip to main content

ఇంటర్ మూల్యాంకనానికి లెక్చరర్లను పంపించండి

సాక్షి, హైదరాబాద్: మే 12 నుంచి నిర్వహించే ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనానికి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో సహకరించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కోరారు.
మే 7న ప్రైవేటు, 8వ తేదీన కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్యాలు సహకరిస్తే సకాలంలో ఫలితాలను విడుదల చేయడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యాలు తమ లెక్చరర్లను ఎక్కువ సంఖ్యలో మూల్యాంకన విధులకు పంపించాలని కోరారు. మూల్యాంకన విధులకు దూర ప్రాంతాల నుంచి వచ్చే లెక్చరర్లు ఉండేందుకు హాస్టళ్లను ఇవ్వాలని, విధులకు వచ్చి ఇళ్లకు వెళ్లే లెక్చరర్ల రవాణా కోసం కాలేజీ వాహనాలను ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రైవేటు యాజమాన్యాల సంఘం ప్రతినిధి గౌరు సతీష్, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు ప్రభుత్వ, కాంట్రాక్టు లెక్చరర్లు అధిక సంఖ్యలో మూల్యాంకన విధుల్లో పాల్గొనాలని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ కృష్ణకుమార్ కోరారు.
Published date : 09 May 2020 02:52PM

Photo Stories