ఇంటర్ ద్వితీయ భాషా పుస్తకాలు మార్పు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ద్వితీయ భాష ఉర్దూ, సంస్కృతం, హిందీ, అరబిక్ పుస్తకాలను మార్పు చేసింది.

ఈ మేరకు సిలబస్ను, మార్పు చేసిన పుస్తకాలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి మే 27న ఆయన చాంబర్లో విడుదల చేశారు. ప్రతి ఐదేళ్లకోసారి పాఠ్య పుస్తకాల సిలబస్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 2014-15లో మార్పు చేసిన ద్వితీయ భాషా పుస్తకాలను తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు మార్పు చేసింది. వాటిని తెలుగు అకాడమీ ముద్రించింది. 2019-20 విద్యా సంవత్సరంలో మార్పు చేసిన ఈ కొత్త పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పుస్తకాలను మార్పు చేయగా, వాటిని ఉర్దూలోకి అనువదించింది.
Published date : 28 May 2019 05:39PM