Skip to main content

TGPSC Group 1 Issue : గ్రూప్‌-1 తెలుగు మీడియం అభ్య‌ర్థుల‌కు మార్కులను ...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల Papers Correctionలో అవకతవకలు జ‌రిగాయి అని చాలా మంది అభ్యర్థులు పిటిషన్ల దాఖలుచేసిన విష‌యం తెల్సిందే.
ts high court orders on tspsc group 1 telugu medium students paper evaluation

అయితే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది.

మరో సారి మూల్యాంకనం చేసేలా...
TGPSC గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ... పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరో సారి మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. 
కొంతమంది అభ్యర్థులు Group-1 మెయిన్స్‌ ఫలితాలపై అనుమానాలు కోర్టుకు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనం జరిగిందని వివరించారు.  తెలుగు మీడియంలో జవాబులు రాసిన వాళ్లకు మార్కులు ఏవిధంగా కేటాయించారని టీజీపీఎస్సీని న్యాయస్థానం ప్రశ్నించగా.. ఆయా సబ్జెక్టుల నిపుణులు మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారని తెలిపారు. 

న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ..
ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా తమిళంలోనే మాట్లాడతారని, ఇక్కడమాత్రం ఆంగ్లంలో మాట్లాడిన వారికే ఎక్కువ మర్యాద ఇస్తారని అన్నారు. ఇది నా స్వీయ అనుభవం కూడా. తెలుగులో గ్రూప్‌-1 పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. దీనికి కారణమేమిటో స్పష్టత ఇవ్వాలి. గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనంలో అనుసరించే ప్రాతిపదిక, మార్కుల కేటాయింపు విధానంపై వివరణ ఇవ్వాలి అని TGPSCని ఆదేశించారు.

Published date : 02 May 2025 08:17AM

Photo Stories