TGPSC Group 1 Issue : గ్రూప్-1 తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులను ...?

అయితే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది.
మరో సారి మూల్యాంకనం చేసేలా...
TGPSC గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ... పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరో సారి మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ..
కొంతమంది అభ్యర్థులు Group-1 మెయిన్స్ ఫలితాలపై అనుమానాలు కోర్టుకు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనం జరిగిందని వివరించారు. తెలుగు మీడియంలో జవాబులు రాసిన వాళ్లకు మార్కులు ఏవిధంగా కేటాయించారని టీజీపీఎస్సీని న్యాయస్థానం ప్రశ్నించగా.. ఆయా సబ్జెక్టుల నిపుణులు మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారని తెలిపారు.
న్యాయమూర్తి జస్టిస్ నామవరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ..
ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నామవరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా తమిళంలోనే మాట్లాడతారని, ఇక్కడమాత్రం ఆంగ్లంలో మాట్లాడిన వారికే ఎక్కువ మర్యాద ఇస్తారని అన్నారు. ఇది నా స్వీయ అనుభవం కూడా. తెలుగులో గ్రూప్-1 పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. దీనికి కారణమేమిటో స్పష్టత ఇవ్వాలి. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అనుసరించే ప్రాతిపదిక, మార్కుల కేటాయింపు విధానంపై వివరణ ఇవ్వాలి అని TGPSCని ఆదేశించారు.
Tags
- tspsc group 1 issue
- ts high court orders on tspsc group 1 telugu medium students
- ts high court orders on tspsc group 1 paper evaluation issue
- ts high court orders on tspsc group 1 mains
- ts high court orders on tspsc group 1 mains news in telugu
- ts high court orders on tspsc group 1 news in telugu
- telangana group 1 issue news
- telangana group 1 issue news telugu
- Telangana High Court
- telangana group 1 mains result issue
- telangana group 1 jobs
- telangana group 1 mains exam result issue
- telangana group 1 mains paper revaluation petition filed
- Telangana Group 1 Mains Controversy Over Telugu Medium
- telangana group 1 mains
- telangana group 1 mains news in telugu