High Court on TGPSC Group 1 Petition : గ్రూప్-1 మూల్యాంకనంపై పిటిషన్ కొట్టివేత.. రూ.20,000 జరిమాన విధించిన హైకోర్టు..

సాక్షి ఎడ్యుకేషన్: టీజీపీఎస్సీ గ్రూపు-1 పరీక్షలు గత ఏడాది నిర్వహించారు. అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని కొందరు అభ్యర్థులు తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి రూ.20,000 జరిమానా విధిస్తూ.. తీర్పునిచ్చింది రాష్ట్ర హైకోర్టు. తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేసిన పిటిషనర్లపై విచారణకు చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది.
మెమోకు.. వెబ్సైట్ నోట్కు తేడా..
టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష గతేడాది నిర్వహించారు. ఇందుకు సంబంధించిన మూల్యాంకనం, ఫలితాల వెల్లడి, విధానం సరికాదని, మరోసారి రీవాల్యుయేషన్ చేసి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేలా టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలంటూ కె.ముత్తయ్య, మరో 18 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
AIIMS Faculty Jobs: AIIMSలో 50 ఫ్యాకల్టీ పోస్టులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇలా..
ఫలితాల వెల్లడికి అనుసరించిన విధానం సరికాదని, అభ్యర్థులు నష్టపోతారని, వారి ఆవేదనను పట్టించుకోవాలని కోరారు. కమిషన్ జారీ చేసిన మార్కుల మెమోకు, వెబ్సైట్ నోట్కు తేడా ఉందన్నారు. కమిషన్ తరఫు న్యాయవాది పి.ఎస్.రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్ విచారణార్హం కాదన్నారు. పిటిషనర్లు తప్పుడు వివరాలతో ప్రమాణ పత్రాలు దాఖలు చేసి హైకోర్టు విచక్షణాధికారం కింద ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తున్నారన్నారు. దీనికి సంబంధించి వారికి మెమో దాఖలు చేసినట్లు తెలిపారు.
సవాలు చేయరా!
‘‘మార్కులు తగ్గాయని పిటిషనర్లు పేర్కొన్న అభ్యర్థి ఎం.రాహుల్కు మొత్తం 192.5 మార్కులు వచ్చాయి. పిటిషనర్ల ఆరోపణల ప్రకారం పేపర్-7లో 122 వచ్చినా.. వెబ్సైట్ నోట్ ప్రకారం 100 మాత్రమే ఉన్నాందున ఎక్కడో అక్రమాలు జరిగాయంటున్నారు.
AP Contract Employees : ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు.. మరో ఏడాదికి పొడగింపు..
నిజానికి, ఆ అభ్యర్థికి 392.5 మార్కులు వచ్చాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ, ఆ అభ్యర్థి పేరు పిటిషనర్లలో లేకపోవడం మరింత అన్యాయం. ఏ అభ్యర్థి తనకు వచ్చిన 392.5 మార్కుల నుంచి 192.5 మార్కులకు తగ్గితే సవాలు చేయకుండా ఉండరు. పిటిషనర్లు తప్పుడు మార్కుల జాబితా సృష్టించి కోర్టు ద్వారా ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నారు’’ అని వివరించారు.
రూ.20,000 జరిమానా..
ఈ వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు నకిలీ డాక్యుమెంట్ సృష్టించి తప్పుడు ప్రమాణ పత్రం దాఖలు చేశారని పేర్కొన్నారు. దలీప్సింగ్ వర్సెస్ ఉత్తర్ప్రదేశ్ తీర్పులో హైకోర్టులు విచక్షణాధికారాన్ని వినియోగించేముందు.. వాస్తవాలను తొక్కిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించిన కక్షిదారు ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని కేసు పూర్వాపరాలను విచారించకుండా కొట్టివేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. ఈ కేసులో అధికరణ 226 కింద పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం లభించదంటూ పిటిషన్ను జరిమానాతో కొట్టివేస్తున్నామన్నారు. తప్పుడు వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేసిన పిటిషనర్లపై తగిన చర్యలు చేపట్టాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ను ఆదేశిస్తూ.. రూ.20,000 జరిమానాను హైకోర్టు న్యాయమూర్తుల కోర్టు మాస్టర్స్, పర్సనల్ సెక్రటరీస్ అసోసియేషన్కు చెల్లించాలని పిటిషనర్లను ఆదేశించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- tgpsc group 1 results
- TG High Court
- candidates petition
- 20 thousand fine
- telangana group 1 exam results
- false information
- telangana high court judge
- TGPSC Group 1 revaluation
- candidates marks difference
- marks memo and website note
- high court petition
- State level exams
- TGPSC Group 1 Candidates Marks
- TGPSC Group 1 Candidates Marks Difference Petition
- Education News
- Sakshi Education News