Skip to main content

మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏ టా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు.
పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది.
1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో ఏప్రిల్ 7, 1988నధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను ఏప్రిల్ 7వ తేదీన 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 40వ వార్షికోత్సవం కావడంతో ఏప్రిల్ 7వ తేదీని ఎంచుకున్నారు. ఆ తర్వాతలో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది.

చరిత్ర:
క్రీస్తుపూర్వం 1400 ఏళ్ల నాడే పొగాకు వాడకం మొదలైంది. ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లోని స్థానిక తెగల వారు పొగాకును దేవుని కానుకగా పరిగణించేవారు. వేడుకల్లో పొగతాగేవారు. పొగాకు చుట్టల నుంచి వెలువడే ధూమమేఘాల ద్వారా తమ ప్రార్థనలు భగవంతుని చేరుకుంటాయని వారు నమ్మేవారు. యూరోపియన్లు అమెరికాలో అడుగుపెట్టడం ప్రారంభమయ్యాక క్రీస్తుశకం 16వ శతాబ్దం నాటికి పొగాకు క్రమంగా యూరోపియన్దేశాలకు, ఆ తర్వాత శరవేగంగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. బ్రిటిష్వారి ద్వారా పొగాకు భారతదేశానికి చేరుకుంది. పొగాకు పరిచయం కావడానికి ముందు భారతదేశంలో ఎక్కువగా గంజాయితోనే పొగతాగేవారు. ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో పొగాకును ఔషధంగా పరిగణించేవారు. సిగరెట్ల కంపెనీలు వైద్యులతో వ్యాపార ప్రకటనలు ప్రచారం చేసుకునేవి. 20వశతాబ్దిలో సగానికి సగం కాలం ఇలాగే గడిచింది. పొగాకు వల్ల క్యాన్సర్వంటి అనర్థాలు తలెత్తుతున్నట్లు గుర్తించిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు పొగాకు వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి. పలు ప్రభుత్వాలు కూడా పొగాకు వాడకంపై ఆంక్షలు అమలులోకి తెచ్చాయి. పొగాకు వల్ల కలిగే నష్టాలు: పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్అబ్స్ట్రక్టివ్ఫల్మనరీ డిసీజ్లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పీల్చేవారికీ కూడా ప్రమాదమే. పొగాకు వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయడంకోసం అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారతదేశంలో పొగతాగే వారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది.
Published date : 25 May 2020 06:02PM

Photo Stories