Skip to main content

మే 24న కామన్వెల్త్ దినోత్సవం

ప్రతి ఏడాది మే 24న కామన్వెల్త్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ కామన్వెల్త్ దినోత్సవాన్ని ఇంతకు ముందు ‘ఎంపైర్ డే’ అని పిలిచేవారు.
చ‌రిత్ర‌:
ఇప్పటి రాయల్ కామన్వెల్త్ సొసైటి అయిన నాటి రాయల్ కలోనియల్ నిన్స్టిత్యూట్ కెనడియన్ శాఖ ‘ఎంపైర్ డే ‘జరపాలన్న సూచన చేసింది. ఈ ప్రతిపాధనను 1898 లో కెనడియన్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సమావేశములో ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా అమోదించారు . ఇలా ‘ఎంపైర్ డే ‘ ఓ జాతీయ కార్యక్రమమైనది .ఈ రోజున ఆ దేశంలోని రాజ్యాధినేతల కీర్తిని, ఘనతను , త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలు ఇస్తారు , జాతీయ పతాకం ఎగురవేస్తారు . అన్నిస్కూళ్ళు , ప్రభుత్వ ,ప్రైవేట్ కార్యాలయాలు , గతించిన రాజ్య , దేశాధినేతల గుర్తుచేసుకోవడమే కాక , జాతీయ గీతాలను ఆలపిస్తారు . ఇది ఒకరకమైన దేశభక్తి కార్యక్రమము . కెనడియన్ స్కూలు పిల్లలు నిర్వహించే ‘ఎంపైర్ డే’ కార్యక్రమాలు మిగతావారిని ప్రభావితం చేశాయి. ఏటా ఈ ఎంపైర్ డే ను ఒక్క స్కూలు పిల్లలే కాక అందరూ జరుపుకోవాలని ప్రతిపాదించారు .

యునైటెడ్ కింగ్ డమ్ లో ‘ లార్డ్ మీథ్ ‘ ఎంపైర్ డే ప్రచారం కోసం స్వంతంగా డబ్బులు ఖర్చు పెట్టేవాడు. ఆయన కృషి ఫలించింది . తొలి ప్రపంచయుద్ధం కాలములో బ్రిటన్ లో ‘ఎంపైర్ డే’ కు అధికారిక గుర్తింపు లభించింది . 1916 మే 24 వ తేదీన తొలిసారిగా ‘ఎంపైర్ డే’ ను దేశవ్యాప్తం గా జరుపుకున్నారు . 70 వేల స్కూళ్ళు , స్టాక్ ఎక్షేంజ్ వంటి సంస్థలు జెండా వందనము చేసి జాతీయ గీతంను ఆలపించారు . 1921 జనవరిలో ‘ఎంపైర్ డే ‘ ఉద్యమాన్ని వీలైనంతగా ముందుకు తీసుకువెళ్ళాలని భావించిన ‘ మీథ్ రాయల్ కలోనియల్ ఇన్స్టిట్యూట్ ను లాంచ‌నంగా అహ్వానించారు . ఇన్స్టిట్యూట్ సభ్యులతో ఏర్పాటుచేసిన కమిటీ, మీథ్ బృందము కలిసి సంథ భవనాన్ని ఉద్యమ కేంద్రముగా చే శారు . 1927 నుంచి 1929 వ‌ర‌కు ఉద్యమ తొలి అద్యక్షుడుగా మీథ్ కొనసాగాడు . 1901 లో మరణించిన క్వీన్ విక్టోరియా జన్మదినం అయిన మే 24 వ తేదీన ఏటా ‘ఎంపైర్ డే’ ని నిర్వహించాలని నిర్ణయించారు .

ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ వలస పాలనలోని పలు దేశాలు స్వాతంత్య్రం పొందటం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆయా దేశాలకు బ్రిట‌న్‌కు మధ్య.. ఆయా దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనేందుకు ఒక రాజ్యాంగ బద్ధమైన నిర్వచనం అవసరమైంది. అలా 1931లో ’బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్’ ఏర్పడింది. 1949లో ఈ పేరు నుంచి ‘బ్రిటిష్’ పదాన్ని తొలగించారు. బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి అయిన‌ దేశాల కూటమిగా అది మారింది. అయితే.. బ్రిటన్ రాచరిక కుటుంబం ఈ కామన్వెల్త్ అధినేతగా కొనసాగుతోంది.ఈ కూటమిలో చేరటమనేది ఆయా దేశాల ఇష్టాయిష్టాల మేరకే జరుగుతుంది. ఇప్పటివరకూ 53 దేశాలు ఇందులో సభ్యులుగా చేరాయి. చివరిగా చేరిన మొజాంబిక్, రువాండాలకు బ్రిటిష్ వలస రాజ్యంతో ఎలాంటి సంబంధం లేదు.

1949 లో ఆధునిక కామన్వెల్త్ ఆవిర్భవించాక ఆస్ట్రేలియా, బ్రిటన్ , సిలోన్ , భారత్ , న్యూజిలాండ్ , పాకిస్తాన్ , దక్షిణాఫ్రికా , కెనడా దేశాధిపతులు లండన్ లో సమావేశమై ఎంపైర్ డే గురించి చర్చించారు . ఫలితంగా అప్పటిదాకా కొనసాగిన ఎంపైర్ డే 1958 నుండి బ్రిటిష్ కామన్వెల్త్ డే గా మారినది . తరువాత 1966 లో కామన్వెల్త్ డే గా రూపాంతరం చెందినది . పాత పోకడలు , చరిత్రతో నిమిత్తము లేకుండా సరికొత్త కామన్వెల్త్ డే నిర్వహించాలని నిర్ణయించారు . ప్రస్తుతము కామన్వెల్త్ దేశాలన్నింటిలొనూ విభిన్న మార్గాలలో కామన్వెల్త్ డే ను నిర్వహిస్తున్నారు .
Published date : 20 May 2020 04:25PM

Photo Stories