మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం
Sakshi Education
ప్రతి ఏడాది మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటారు.

భారతదేశ సాంకేతిక పురోగతికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశ సైన్యం రాజస్థాన్లోని ప్రోఖ్రాన్ టెస్ట్ రేంజ్ వద్ద శక్తి -1 అణు క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షకి దివగంత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నాయకత్వం వహించారు. దీనిని ఆపరేషన్ శక్తి లేదా ప్రోఖ్రాన్ -2 అని పిలిచారు. రెండు రోజుల తర్వాత ఆపరేషన్ శక్తిలో భాగంగా భారతదేశం రెండు అణ్వాయుధాలను విజయవంతంగా పరీక్షించింది. శక్తి, ప్రోఖ్రాన్, న్యూక్లియర్ టెస్ట్ , స్మైలింగ్ బుద్ద అనే మొదటి అణు పరీక్ష 1974లో జరిగాయి. రెండో అణుపరీక్షను 1998 మే లో భారత సైన్యం ప్రోఖ్రాన్ టెస్ట్ రేంజ్ వద్ద ఐదు వరుస న్యూక్లియర్ బాంబుల పరంపరను విజయంవంతంగా పరీక్షించింది.
దీంతో అప్పటి ప్రధాని అటల్ బిహరీ వాజ్పేయి భారతదేశాన్ని అణు రాష్ట్రంగా ప్రకటించడమే కాక మే 11ను జాతీయ సాంకేతిక దినంగా ప్రకటించారు.
న్యూక్లియర్ క్లబ్లో చేరిన ఆరవ దేశంగా, అణ్వయుధాల వ్యాప్తి నిరోధక(ఎన్పీటీ)లో పాల్గొనని మొదటి దేశంగా నిలిచింది. 1999 నుండి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు(టీడీబీ) ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది టీడీబీ ఒక కొత్త థీమ్ ని ఎంచుకుంటోంది. ఈ దినోత్సవం నిత్యజీవితంలో సైన్స్ యెక్క ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
దీంతో అప్పటి ప్రధాని అటల్ బిహరీ వాజ్పేయి భారతదేశాన్ని అణు రాష్ట్రంగా ప్రకటించడమే కాక మే 11ను జాతీయ సాంకేతిక దినంగా ప్రకటించారు.
న్యూక్లియర్ క్లబ్లో చేరిన ఆరవ దేశంగా, అణ్వయుధాల వ్యాప్తి నిరోధక(ఎన్పీటీ)లో పాల్గొనని మొదటి దేశంగా నిలిచింది. 1999 నుండి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు(టీడీబీ) ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది టీడీబీ ఒక కొత్త థీమ్ ని ఎంచుకుంటోంది. ఈ దినోత్సవం నిత్యజీవితంలో సైన్స్ యెక్క ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
Published date : 08 May 2020 05:18PM