Skip to main content

మే 04 అంత‌ర్జాతీయ అగ్నిమాప‌క దినోత్స‌వం

ప్ర‌తి ఏడాది మే 04న అంత‌ర్జాతీయ అగ్నిమాప‌క దినోత్స‌వం జ‌రుపుకుంటారు.
అగ్నిమాప‌క సిబ్బంది ప్ర‌జ‌ల ఆస్తి ర‌క్ష‌ణ‌ కోసం త‌మ జీవితాల‌ను అంకితం చేసే అత్యంత ధైర్యవంతులు. ప్ర‌మాదం అంచుల‌ వైపుకి నిర్భయంగా నిబ‌డి ప్రాణ, ఆస్తి న‌ష్టం జ‌రగ‌కుండా చూస్తారు. మంట‌లు ఆర్పే విధానంలో చ‌క్క‌టి త‌ర్ఫీదు పొందుతారు. ఒక్కో సమ‌యంలో 24 గంట‌లు విధులు నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. స‌మాజం కోసం అగ్నిమాప‌క సిబ్బంది చేసే త్యాగ‌ల‌ను గుర్తించి, వారిని గౌర‌వించ‌డం కోసం ప్ర‌తి ఏడాది అగ్నిమాప‌క దినోత్స‌వం జ‌రుపుకుంటున్నాం.

చ‌రిత్ర‌:
1999లో ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో లింట‌న్ వద్ద జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో 5గురు అగ్నిమాప‌క సిబ్బంది మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌లో గాలి దిశ‌లో అక‌స్మాత్తుగా మార్పు రావ‌డంతో ఈ దుర్ఘ‌ట‌న సంభ‌వించింది. ఆ ఘ‌ట‌న నుంచి అగ్నిమాప‌క దినోత్స‌వం పుట్టుకొచ్చింది. అగ్నిమాప‌క సిబ్బంది త్యాగాల‌ను, విజ‌యాల‌ను, ధైర్య‌సాహసాల గుర్తించ‌డ‌మే కాక వారి గౌర‌వార్థం మే 04న ప్ర‌పంచవ్యాప్తంగా అంత‌ర్జాతీయ అగ్నిమాప‌క దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు.
Published date : 04 May 2020 05:34PM

Photo Stories