Skip to main content

మే 01న అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం

ప్ర‌తి ఏడాది మే 01న అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం జ‌రుపుకుంటారు.
దీన్ని అంత‌ర్జాతీయ ‘కార్మిక దివాస్‘గా కూడా పిలుస్తారు. కార్మికులు సాధించిన విజ‌యాల‌కు గుర్తుగా ప్ర‌తి ఏడాది మే నెల మొద‌టి రోజున ‘కార్మిక దినోత్స‌వం’ లేదా ‘అంత‌ర్జాతీయా కార్మిక దినోత్స‌వం’ జ‌రుపుకుంటారు. దీన్ని మే డే అని కూడా పిలుస్తారు. చాలా దేశాల్లోని ప్ర‌భుత్వాలు ఈ రోజున సెల‌వు ప్ర‌క‌టిస్తారు. భార‌త‌దేశంలో కూడా సెల‌వుదిన‌మే. హిందీలో దీన్ని ‘కమ్గ‌ర్ దిన్’, క‌న్న‌డ‌లో ‘కార్మిక దిన‌చ‌ర‌నే’, తెలుగులో ‘కార్మిక దినోత్స‌వం’, మ‌రాఠీలో ‘క‌మ్గ‌ర్ దివాస్’, త‌మిళంలో ‘ఉజైపాలార్ దినం’, మ‌ళ‌యాళంలో ‘తోజిలాలి దినం’, బెంగాలీలో ‘ష్రోమిక్ డిబోష్’ అని పిలుస్తారు. అయితే ఉత్త‌ర‌ భార‌త‌దేశంలో కార్మిక దినోత్స‌వం ప్రాముఖ్య‌త‌ను కోల్పోయింది.

చ‌రిత్ర‌:
మే డే దినోత్స‌వం గురించి ఐరోపాలోని సోషలిస్ట్ పార్టీలు మొదటి అంతర్జాతీయ కాంగ్రెస్ జూలై 14, 1889న ఫ్రాన్స్‌ లోని పారిస్‌లో ప్ర‌క‌టించిన త‌ర్వాత 1890 మే 1న‌మొట్ట‌మొద‌టి మేడే వేడుక‌లు జ‌ర‌పుకున్నారు. అప్ప‌ట‌నుంచి ప్ర‌తి ఏడాది మే 1న అంత‌ర్జాతీయ కార్మికుల దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంటున్నాం.

పెట్టుబ‌డిదారి దోపిడి వ‌ర్గాల‌ అక్ర‌మాల‌కు శ్ర‌మ‌దోపిడికి గురైన కార్మికులు 1886 మే 1న అమెరికా దేశంలో చికాగో న‌గ‌రంలో కార్మికులు 18 గంట‌ల ప‌నివిధానాన్ని వ్య‌తిరేకిస్తు 8 గంట‌ల పని విధాన ప‌ద్ధ‌తిని ప్ర‌వేశ పెట్టాల‌ని కోరుతూ ఆనాడు చికాగో న‌గ‌రంలో కార్మికుల చేసిన ఉద్య‌మంలో అనేక‌మంది కార్మికులు అమ‌రులై త‌మ హ‌క్కును సాధించుకున్న‌వారి స్ఫూర్తికి గుర్తుగా జ‌రుపుకునేదే అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం.

మొట్ట‌మొద‌టిసారిగా భార‌త‌దేశంలోని మ‌ద్రాసు న‌గ‌రం కేంద్రంగా 1923వ సంవ‌త్స‌రం మే 1వ తేదిన లే బ‌ర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందూస్థాన్ ఆధ్వ‌ర్యంలో మే ఉత్స‌వాలు నిర్వ‌హించారు.
Published date : 01 May 2020 05:42PM

Photo Stories