జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం
Sakshi Education
ప్రతి ఏడాది జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం జరుపుకుంటారు.

ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ) ఆధ్వర్యంలో 2001 సంవత్సరం నుండి జూన్ 1వ తేదిని, ప్రపంచ పాల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రజల్లో పాల వినియోగం పట్ల అవగాహనను పెంచుతూ, పాలు మరియు పాల ఉత్పత్తులకు ప్రచారాన్ని కల్పించడం కోసం ప్రపంచ పాల దినోత్సవంను జరుపుతున్నారు.
భారతదేశ పాడి పరిశ్రమ నవంబర్ 26 తేదిని జాతీయ పాలదినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించింది. భారతదేశ శ్వేత (క్షీర) విప్లవ పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ వర్ఘీస్ కురియన్ 93వ జయంతిని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు ఈ నిర్ణయాన్ని భారతదేశ డైరీ రంగానికి చెందిన ప్రధాన సంస్థలు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్.డి.డి.బి), ఇండియన్ డైరీ అసోసియేషన్ (ఐడిఏ), అముల్ పాలను మార్కెటింగ్ చేసే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జిసిఎంఎంఎఫ్)లతో కూడిన 22 రాష్ట్ర స్థాయి మిల్క్ ఫెడరేషనన్లు అంగీకరించాయి.
అముల్ కంపెనీ ఈ దినోత్సవం సందర్భంగా బడులలో కార్యక్రమాలు, యువతతో భాగస్వామ్యం, పాలను తాగే పోటీలు, అనాధ శరణాలయాలలో కార్యక్రమాలు, వ్యాసరచన/చిత్రలేఖనం/క్విజ్ పోటీలు వంటి కార్యక్రమాలను చేపట్టారు.
డాక్టర్ వర్ఘీస్ కురియన్ జన్మదినోత్సవాన్ని జాతీయ పాల దినోత్సవంగా జరుపుకోవాలని భారతదేశ పాడి పరిశ్రమ సంఘం (ఇండియన్ డైరీ అసోసియేషన్-IDA) తొలుత భావించింది.
డాక్టర్ వర్ఘీస్ కురియన్
భారతదేశ మిల్క్ మాన్ గా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ వర్ఘీస్ కురియన్, ప్రపంచంలో అతిపెద్ద వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమమైన ఆపరేషన్ ఫ్లడ్ను రూపొందించారు. ఆపరేషన్ ఫ్లడ్, భారతదేశాన్ని తక్కువ పాల ఉత్పత్తిని కలిగిన దేశ స్థాయి నుండి ప్రపంచ అగ్రశ్రేణి పాల ఉత్పత్తిదారు దేశంగా మార్చివేసింది. వర్ఘీస్ కురియన్ రైతుల నిర్వహణలో అముల్, జిసిఎంఎంఎఫ్, ఐఆర్ఎంఏ, ఎన్.డి.డి.బి వంటి 30 సంస్థలను స్థాపించారు.
ఆయన 1963లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసేసే అవార్డును అందుకున్నారు, ఆయన 1989లో అమెరికాలోని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అందించే వరల్డ్ ఫుడ్ ప్రైజును గెల్చుకున్నారు. ఆయన 1965లో భారతదేశ ప్రభుత్వం అందించే పద్మశ్రీ, 1966లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు.
భారతదేశ పాడి పరిశ్రమ నవంబర్ 26 తేదిని జాతీయ పాలదినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించింది. భారతదేశ శ్వేత (క్షీర) విప్లవ పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ వర్ఘీస్ కురియన్ 93వ జయంతిని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు ఈ నిర్ణయాన్ని భారతదేశ డైరీ రంగానికి చెందిన ప్రధాన సంస్థలు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్.డి.డి.బి), ఇండియన్ డైరీ అసోసియేషన్ (ఐడిఏ), అముల్ పాలను మార్కెటింగ్ చేసే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జిసిఎంఎంఎఫ్)లతో కూడిన 22 రాష్ట్ర స్థాయి మిల్క్ ఫెడరేషనన్లు అంగీకరించాయి.
అముల్ కంపెనీ ఈ దినోత్సవం సందర్భంగా బడులలో కార్యక్రమాలు, యువతతో భాగస్వామ్యం, పాలను తాగే పోటీలు, అనాధ శరణాలయాలలో కార్యక్రమాలు, వ్యాసరచన/చిత్రలేఖనం/క్విజ్ పోటీలు వంటి కార్యక్రమాలను చేపట్టారు.
డాక్టర్ వర్ఘీస్ కురియన్ జన్మదినోత్సవాన్ని జాతీయ పాల దినోత్సవంగా జరుపుకోవాలని భారతదేశ పాడి పరిశ్రమ సంఘం (ఇండియన్ డైరీ అసోసియేషన్-IDA) తొలుత భావించింది.
డాక్టర్ వర్ఘీస్ కురియన్
భారతదేశ మిల్క్ మాన్ గా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ వర్ఘీస్ కురియన్, ప్రపంచంలో అతిపెద్ద వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమమైన ఆపరేషన్ ఫ్లడ్ను రూపొందించారు. ఆపరేషన్ ఫ్లడ్, భారతదేశాన్ని తక్కువ పాల ఉత్పత్తిని కలిగిన దేశ స్థాయి నుండి ప్రపంచ అగ్రశ్రేణి పాల ఉత్పత్తిదారు దేశంగా మార్చివేసింది. వర్ఘీస్ కురియన్ రైతుల నిర్వహణలో అముల్, జిసిఎంఎంఎఫ్, ఐఆర్ఎంఏ, ఎన్.డి.డి.బి వంటి 30 సంస్థలను స్థాపించారు.
ఆయన 1963లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసేసే అవార్డును అందుకున్నారు, ఆయన 1989లో అమెరికాలోని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అందించే వరల్డ్ ఫుడ్ ప్రైజును గెల్చుకున్నారు. ఆయన 1965లో భారతదేశ ప్రభుత్వం అందించే పద్మశ్రీ, 1966లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు.
Published date : 26 May 2020 06:02PM