Skip to main content

జాతీయ క్రీడా పురస్కారాలు-2020

2020 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆగస్టు 21న ప్రకటించింది. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29(ద్యాన్‌చంద్ 115వ జయంతి)న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. సాధారణంగా ప్రతి సంవత్సరం దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న అవార్డులను అందజేస్తారు.

వర్చువల్‌గా అవార్డుల స్వీకరణ...
కరోనా వైరస్ విజృంభణ కారణంగా 2020 ఏడాది క్రీడా పురస్కారాలను రాష్ట్రపతి కోవింద్ వర్చువల్ (ఆన్‌లైన్) పద్ధతిలో ప్రదానం చేశారు. దీనికి దేశంలోని 11 భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలు వేదికలుగా నిలిచాయి. రాష్ట్రపతి భవన్‌తో అనుసంధానమైన సాయ్ కేంద్రాలు అత్యంత సురక్షిత వాతావరణంలో వేడుకల్ని నిర్వహించాయి. మొత్తం 74 (5 ఖేల్‌రత్న, 27 అర్జున, 13 ద్రోణాచార్య, 15 ధ్యాన్‌చంద్ ) మంది 2020 ఏడాది జాతీయ అవార్డులను గెలుచుకోగా ఆగస్టు 29న 60 మంది ఈ పురస్కారాలను స్వీకరించారు.

బెంగళూరు నుంచి మనికా...
ఖేల్‌రత్నకు ఎంపికై న మహిళా హాకీ ప్లేయర్ రాణి రాంపాల్, పారాలింపియన్ తంగవేలు సాయ్ పుణే కేంద్రం నుంచి... టీటీ ప్లేయర్ మనికా బాత్రా బెంగళూరు నుంచి ఈ అవార్డులను అందుకున్నారు. దుబాయ్‌లో ఉండటంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కరోనా సోకడంతో వినేశ్ ఫొగాట్, ఏపీ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ తమ అవార్డులను అందుకోలేదు. 44 ఏళ్ల క్రీడా అవార్డుల చరిత్రలో కరోనా కారణంగా తొలిసారి ఆన్‌లైన్ ద్వారా అవార్డుల వేడుకలు నిర్వహించారు. ప్రతి యేటా ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో అవార్డుల అందజేత కార్యక్రమం నిర్వహించేవారు.

ఏపీ నుంచి ఇద్దరికి...
2020 ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి జాతీయ క్రీడా పురస్కారాలు లభించాయి. యువ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్‌కు ‘అర్జున’, మాజీ బాక్సర్ నగిశెట్టి ఉషకు ‘ద్యాన్‌చంద్’ జీవితకాల సాఫల్య పురస్కారం లభించాయి.

పెరిగిన ప్రైజ్‌మనీ..
జాతీయ క్రీడా అవార్డుల ప్రైజ్‌మనీ భారీగా పెంచినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. 2020 ఏడాది నుంచే దీనిని అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. నూతన విధానం ప్రకారం ఖేల్‌రత్న పురస్కారానికి రూ. 25 లక్షల ప్రైజ్‌మనీగా చెల్లించనున్నారు. గతంలో ఇది రూ. 7.5 లక్షలుగా ఉంది.

అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డుల ప్రైజ్‌మనీలో కూడా మార్పులు చేశారు. గతేడాది వరకు ఈ అవార్డులకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లిస్తుండగా... 2020 ఏడాది నుంచి అర్జున, ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం గ్రహీతలకు రూ. 15 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ద్రోణాచార్య (రెగ్యులర్), ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలు రూ. 10 లక్షల చొప్పున అందుకోనున్నారు. చివరిసారిగా 2008లో ప్రైజ్‌మనీలో మార్పులు జరిగాయి.

రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న (5):
2020 ఏడాదికిగాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ను ఒకేసారి అత్యధికంగా ఐదుగురు ఎంపికయ్యారు. గతంలో 2016లో ఒకేసారి అత్యధికంగా నలుగురికి ‘ఖేల్‌రత్న’ అవార్డును ఇచ్చారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన స్మారకార్థం 1991లో ‘ఖేల్‌రత్న’ అవార్డును ప్రవేశపెట్టారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

రోహిత్ శర్మ

క్రికెట్

2

వినేశ్ ఫొగాట్

మహిళల రెజ్లింగ్

3

రాణి రాంపాల్

మహిళల హాకీ

4

మనికబత్రా

మహిళల టేబుల్ టెన్నిస్

5

మరియప్పన్ తంగవేలు

పారా అథ్లెటిక్స్


అర్జున అవార్డు (27):

2020 ఏడాదికి మొత్తం 27 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

సాత్విక్ సాయిరాజ్

బ్యాడ్మింటన్

2

చిరాగ్ శెట్టి

బ్యాడ్మింటన్

3

ఇషాంత్ శర్మ

క్రికెట్

4

దీప్తి శర్మ

క్రికెట్

5

మనీశ్ కౌశిక్

బాక్సింగ్

6

లవ్లీనా బొర్గోహైన్

బాక్సింగ్

7

మను భాకర్

షూటింగ్

8

సౌరభ్ చౌధరీ

షూటింగ్

9

దివ్య కాక్రన్

రెజ్లింగ్

10

రాహుల్ అవారే

రెజ్లింగ్

11

ఆకాశ్‌దీప్ సింగ్

హాకీ

12

దీపిక

హాకీ

13

దివిజ్ శరణ్

టెన్నిస్

14

అతాను దాస్

ఆర్చరీ

15

ద్యుతీ చంద్

అథ్లెటిక్స్

16

విశేష్ భృగువంశీ

బాస్కెట్‌బాల్

17

అజయ్ అనంత్ సావంత్

ఈక్వేస్టియ్రన్

18

సందేశ్ జింగాన్

ఫుట్‌బాల్

19

అదితి అశోక్

గోల్ఫ్

20

దీపక్ హుడా

కబడ్డీ

21

సారిక కాలే

ఖో-ఖో

22

దత్తు బబన్ భొఖనాల్

రోయింగ్

23

మధురిక పాట్కర్

టేబుల్ టెన్నిస్

24

శివ కేశవన్

వింటర్ స్పోర్ట్స్

25

సుయశ్ నారాయణ్ జాదవ్పారా

స్విమ్మింగ్

26

సందీప్

పారా అథ్లెటిక్స్

27

మనీశ్ నర్వాల్

పారా షూటింగ్


ద్రో
ణాచార్య అవార్డు (లైఫ్ టైమ్ కేటగిరీ-8):

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

ధర్మేంద్ర తివారీ

ఆర్చరీ

2

పురుషోత్తమ్ రాయ్

అథ్లెటిక్స్

3

శివ్ సింగ్

బాక్సింగ్

4

రమేశ్ పథానియా

హాకీ

5

కృషన్ కుమార్ హుడా

కబడ్డీ

6

విజయ్ బాలచంద్ర మునీశ్వర్

పవర్‌లిఫ్టింగ్

7

నరేశ్ కుమార్

టెన్నిస్

8

ఓంప్రకాశ్ దహియా

రెజ్లింగ్


ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ-5):

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

జూడ్ ఫెలిక్స్

సెబాస్టియన్ హాకీ

2

జస్పాల్ రాణా

షూటింగ్

3

కుల్‌దీప్ కుమార్ హండూ

ఉషు

4

యోగేశ్ మాలవియా

మల్లఖంబ్

5

గౌరవ్ ఖన్నా

పారా బ్యాడ్మింటన్


ద్యాన్‌చంద్
(లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్) అవార్డు (15):
గతంలో ‘ధ్యాన్ చంద్’ అవార్డును ఒకేసారి అత్యధికంగా ఐదుగురికి ఇచ్చారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

నగిశెట్టి ఉష

బాక్సింగ్

2

లఖా సింగ్

బాక్సింగ్

3

కుల్‌దీప్ సింగ్ భుల్లర్

అథ్లెటిక్స్

4

జిన్సీ ఫిలిప్స్

అథ్లెటిక్స్

5

ప్రదీప్ శ్రీకృష్ణ గాంధే

బ్యాడ్మింటన్

6

తృప్తి ముర్గుండే

బ్యాడ్మింటన్

7

అజిత్ సింగ్

హాకీ

8

మన్ ప్రీత్ సింగ్

కబడ్డీ

9

మంజీత్ సింగ్

రోయింగ్

10

సచిన్ నాగ్

స్విమ్మింగ్

11

నందన్ బాల్

టెన్నిస్

12

నేత్రపాల్ హుడా

రెజ్లింగ్

13

సుఖ్వీందర్ సింగ్ సంధూ

ఫుట్‌బాల్

14

రంజిత్ కుమార్

పారా అథ్లెటిక్స్

15

సత్యప్రకాశ్ తివారీ

పారా బ్యాడ్మింటన్


టెన్సింగ్ నార్కే జాతీయ అడ్వెంచర్ అవార్డులు
-2019

సంఖ్య

పేరు

విభాగం

1

అనితా దేవి

ల్యాండ్ అడ్వెంచర్

2

కల్నల్ సర్ఫ్‌రాజ్ సింగ్

ల్యాండ్ అడ్వెంచర్

3

టాకా తముత్

ల్యాండ్ అడ్వెంచర్

4

నరేందర్ సింగ్

ల్యాండ్ అడ్వెంచర్

5

కెవ ల్ హిరెన్ కక్కా

ల్యాండ్ అడ్వెంచర్

6

సేతేంద్ర సింగ్

వాటర్ అడ్వెంచర్

7

గజానంద్ యాదవ

ఎయిర్ అడ్వెంచర్

8

దివంగత మాగన్ బిస్సా

లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్


మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయం): పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్).

రాష్టీయ్ర ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్:

  • ఐడెంటిఫికేషన్ అండ్ నుర్ట్యూరింగ్ ఆఫ్ బడ్డింగ్ అండ్ యంగ్ టాలెంట్: 1. లక్ష్య ఇన్‌స్టిట్యూట్ 2. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్
  • ఎన్‌కరేజ్‌మెంట్ టు స్పోర్ట్స్ థ్రూ కార్పొరేట్ సోషియల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ)
  • ఎంప్లాయిమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ మెజర్స్: ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్
  • స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనెజ్‌మెంట్(ఐఐఎస్‌ఎమ్)
Published date : 04 Sep 2020 12:01PM

Photo Stories