APRJC, APRDC 2025 Entrance Exam: ఏపీ గురుకులాల్లో ప్రవేశాలకు రేపే ఎంట్రన్స్ టెస్ట్.. వివరాలివే!

నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 25వ తేదీన ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్–2025 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు సెట్ పల్నాడు జిల్లా కో–ఆర్డినేటర్ ఎన్.సరోజిని మంగళవారం తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు 944మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్టు తెలిపారు.
వీరికి శంకరభారతీపురం జడ్పీ హైస్కూల్, హిందూ స్కూల్, సెయింట్ మేరీస్ హైస్కూల్, మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. పరీక్ష 25వ తేదీ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షకు 7 పరీక్షా కేంద్రాలలో 1,706మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
శంకరభారతీపురం జడ్పీ హైస్కూల్, హిందూ స్కూల్, సెయింట్ మేరీస్ హైస్కూల్, మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, మున్సిపల్ బాలికోన్నత పాఠశాల, ఆక్స్ఫర్డ్ హైస్కూల్, శ్రీకృష్ణ చైతన్య హైస్కూల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Gurukulam Entrance Exam 2025
- AP Residential School Entrance Exam 2025
- APRJC Entrance Test 2025
- Gurukula School Admission 2025
- AP Gurukulam CET 2025
- Gurukulam School Admission Test
- Government Residential School Admission
- Gurukulam Exam Date 2025
- APRJC 2025 Notification
- Gurukulam 5th Class Admission 2025