AP DEECET 2025 నోటిఫికేషన్ విడుదల.. డీఈఎల్ఈడీ కోర్సు ప్రవేశానికి దరఖాస్తు ప్రారంభం!
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, 2025–26 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సులో ప్రవేశాల కోసం AP DEECET 2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రెండు సంవత్సరాల ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సులో చేరవచ్చు.

ముఖ్యమైన సమాచారం:
అర్హత: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత.
వయసు: 01.09.2025 నాటికి కనీసం 17 ఏళ్లు నిండాలి. గరిష్ట వయో పరిమితి లేదు.
ఎంపిక విధానం: DEECET ర్యాంకు మరియు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
పరీక్ష విధానం:
- మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష.
- Part-A: 60 ప్రశ్నలు – 60 మార్కులు
- Part-B: 40 ప్రశ్నలు – 40 మార్కులు
- పరీక్ష వ్యవధి: 2 గంటల 30 నిమిషాలు
దరఖాస్తు విధానం: దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.
చివరి తేదీ: 08.05.2025
హాల్ టిక్కెట్ డౌన్లోడ్ తేదీ: 20.05.2025
పరీక్ష తేదీలు: 02.06.2025, 03.06.2025
ఆధికారిక వెబ్సైట్: https://apdeecet.apcfss.in
>> Journalism Admissions: జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే!
![]() ![]() |
![]() ![]() |
Published date : 24 Apr 2025 05:41PM