వనపర్తిలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు !
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బాసరలోని రాజీవ్గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) తరహా విద్యా సంస్థను వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసే అంశంపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తమ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది.

ఆర్జీయూకేటీ ఏర్పాటుకు దాదాపు రూ.750 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. అది సాధ్యం కాకపోతే వనపర్తిలోని పాలిటెక్నిక్ కాలేజీని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీగా మార్పు చేయాలని కమిటీ సూచించినట్లు తెలిసింది.
Published date : 06 Jul 2018 02:08PM