Skip to main content

క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఇంజనీరింగ్‌ చేసిన వారికి క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పెద్దసంఖ్యలో లభించాయి.
ముఖ్యంగా ప్రముఖ విద్యా సంస్థల్లో చదివినవారికి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. దేశంలో ఏఐసీటీఈ అనుబంధ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2018–19 సంవత్సరంలో 1.03 లక్షల మంది చదవగా, అందులో 46.09 శాతం మంది క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు పొందినట్లు కేంద్రం తెలిపింది. అలాగే ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అదే ఏడాది 7.01 లక్షల మంది చదవగా, 53.52 శాతం మంది ఉద్యోగాలు పొంది నట్లు పేర్కొంది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలు కాకుండా ఇతర పద్ధతుల్లోనూ ఉద్యోగావకాశాలు వస్తున్నా యని వివరించింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే ఉద్యోగాలు పొందినవారి శాతం గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది.

చ‌ద‌వండి: మీకు తెలుసా..! ఉద్యోగాల భర్తీలో స్థానికత గుర్తింపు చిక్కులకు ఈ విధంగా చెక్..

చ‌ద‌వండి: అక్టోబర్ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం: యూజీసీ

చ‌ద‌వండి: ప్రశాంతంగా ముగిసిన టీఎస్ పాలిసెట్– 2021 పరీక్ష

వడబోత తర్వాతే నియామకాలు
స్వదేశీ, విదేశీ కంపెనీలు నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లను వెతికి పట్టుకొని ఉద్యోగాలు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఇచ్చే ర్యాంకుల ఆధారంగా కంపెనీలు కాలేజీలను ఎంపిక చేసుకుని క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇంటర్వ్యూలు నిర్వహించేప్పుడు కంపెనీలు వివిధ దశలుగా వడబోత కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఆ తర్వాతే ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిభ కనబర్చే వారికే అవకాశాలు దక్కుతున్నాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి చెప్పారు. ఏ దశలో వెనుకబడినా అభ్యర్థులకు అవకాశాలు కల్పించడం లేదని ఆయన తెలిపారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలతోపాటు తమ కంపెనీల వద్దకే కాలేజీ విద్యార్థులను పిలిపించుకొని, ఉద్యోగాల కోసం వారిని వివిధ పద్ధతుల్లో పరీక్షిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో చదువులపై శ్రద్ధ పెట్టకుండా కేవలం ఫీజులు, రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము కోసమే పనిచేసే కొన్ని కాలేజీల్లో చదివిన విద్యార్థుల పరిస్థితి మాత్రం నిరాశాజనకంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కరోనా కాలంలో ఉద్యోగావకాశాలు తగ్గినట్లు వారు తెలిపారు. కరోనా సమయంలో చివరి రెండేళ్లు చదివిన విద్యార్థులు క్లాసులు లేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోలేకపోయారని అంటున్నారు. ఈ పరిస్థితి వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బ తీసిందని వివరిస్తున్నారు.

దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్‌ కాలేజీల్లో చదివిన ఇంజనీరింగ్‌ విద్యార్థుల సంఖ్య, క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పొందినవారి శాతం

ఏడాది

ప్రభుత్వ కాలేజీల్లో

క్యాంపస్‌ సెలెక్షన్‌

ప్రైవేట్‌ కాలేజీల్లో

క్యాంపస్‌ సెలెక్షన్‌

2016–17

1,02,454

33.02

7,68,158

45.43

2017–18

1,06,231

32.17

7,05,533

36.80

2018–19

1,03,483

46.09

7,01,302

53.52

Published date : 06 Aug 2021 03:09PM

Photo Stories