Skip to main content

జూన్ 4న మళ్లీ ఈసెట్-2017

సాక్షి, హైదరాబాద్: ఈసెట్-2017 పరీక్షలో తప్పుల సర్దుబాటుకు జేఎన్ టీయూ ఉపక్రమించింది.
సాంకేతిక లోపాలతో పలు కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు విద్యార్థులు జేఎన్‌టీయూకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల పరిశీలనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ దీనిపై అధ్యయనం చేసి మరోసారి పరీక్ష నిర్వహించాలని సూచించింది. దీంతో ఫిర్యాదు చేసిన అభ్యర్థులకు జూన్ 4న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా అభ్యర్థులు తమ దరఖాస్తు ప్రతులను టీఎస్‌ఈసెట్-2017 వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఈ నెల 30లోగా వాటిని ఈసెట్ కన్వీనర్ కార్యాలయంలో సమర్పించాలని లేదా ఆయా దరఖాస్తు ఫారాల స్కాన్ కాపీలను tsecet2017@ jntuh.ac.inకు మెయిల్ చేయాలని సూచించింది. జూన్ 4న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ గోవర్ధన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Published date : 26 May 2017 03:44PM

Photo Stories