Skip to main content

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్...ఉచితంగా గేట్ కోచింగ్

సాక్షి, అమరావతి: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (కాకినాడ, అనంతపురం) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) కోచింగ్ ఇవ్వనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్ని యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి
  • విద్యార్థులు లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని విద్యా విభాగాలు ఆన్‌లైన్, డిజిటల్ వేదికల ద్వారా అనేక విద్యాసంబంధిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
  • తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూ (అనంతపురం) జేఎన్‌టీయూ(కాకినాడ) యోగి వేమన విశ్వవిద్యాలయం (కడప) ఆధ్వర్యంలో గేట్‌కు ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనున్నారు.
  • రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,4వ సంవత్సరాల విద్యార్థులకు అనుభవజ్ఞులు, నిపుణులతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
  • గేట్ పరీక్షలకు సంబంధించిన ప్రతి సబ్జెక్టును 12 సెషన్లలో 12 రోజుల పాటు బోధిస్తారు. ఒక్కో సెషన్ రెండు గంటల సేపు ఉంటుంది.
  • రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున, ఇద్దరు చొప్పున వేర్వేరు ఫ్యాకల్టీ బోధిస్తారు.

ఆన్‌లైన్ శిక్షణలో ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:
మే 2, 2020
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మే 7, 2020
తరగతులు ప్రారంభం: మే 11, 2020

వెబ్‌సైట్లు:
www.jntua.ac.in/gate-online-classes/registration
www.jntua.ac.in/gate-online-classes/list-of-faculty

కో- ఆర్డినేటర్లు :
1. డాక్టర్ ఎస్.వి. సత్యనారాయణ, డెరైక్టర్ అకడమిక్ అండ్ ప్లానింగ్ జేఎన్‌టీయూ.
మొబైల్: 9849509167
2. డాక్టర్ వి.శ్రీనివాసులు, డెరైక్టర్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ సెంటర్, జేఎన్‌టీయూకే.
మొబైల్: 9701278555
Published date : 02 May 2020 02:41PM

Photo Stories