Skip to main content

100% ప్లేస్‌మెంట్స్ సాధించేందుకు కృషి

నూజివీడు: వందశాతం ప్లేస్‌మెంట్స్ సాధించేందుకు కృషి చేస్తున్నామని నూజివీడు ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు అన్నారు. జూలై 9న కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.
గత విద్యా సంవత్సరంలో 58.2 శాతం ప్లేస్‌మెంట్స్ సాధించినట్లు వెల్లడించారు.ఇందులో 51కంపెనీలు పాల్గొన్నాయని చెప్పారు. మొత్తం 569మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వీరిలో 334మందికి ప్లేస్‌మెంట్స్ వచ్చాయన్నారు. అలాగే 190 మందికి 169 మంది లాంగ్‌టర్మ్ ఇంటర్న్‌షిప్‌కు వెళ్లారని, వారంతా ఆయా కంపెనీల్లోనే ఉద్యోగాలు సాధించారన్నారు. ఓఎన్‌జీసీ రూ.16.6 లక్షల ప్యాకేజీతో ఒక విద్యార్థిని ఎంపిక చేసినట్టు తెలిపారు. టెక్సాస్ ఇనుస్ట్రుమెంట్స్ కంపెనీ రూ.10 లక్షల ప్యాకేజీతో నలుగురు విద్యార్థులను, సినోప్‌సిస్ కంపెనీ రూ.9.5 లక్షల ప్యాకేజీతో ఐదుగురు విద్యార్థులను, థాట్‌వర్క్స్ కంపెనీ రూ.7.8 లక్షల ప్యాకేజీతో ఒకరిని, మాథ్‌వర్క్స్ కంపెనీ రూ.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల ప్యాకేజీతో 11మంది విద్యార్థులను ఎంపిక చేశాయని చెప్పారు. అలాగే విద్యార్థులకు ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా కండూరియా ఆన్‌లైన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని, నిపుణుల ప్రసంగాలతో కూడిన వీడియోలను ప్రదర్శిస్తున్నటుట తెలిపారు. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వెంకదాసు పేర్కొన్నారు.
Published date : 10 Jul 2018 02:59PM

Photo Stories