Skip to main content

Budget 2025 Exconomic Survey Live Updates in Telugu: జిడిపి వృద్ధి 6.3-6.8%గా అంచనా

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే 2024-25ను ప్రవేశపెట్టారు. ఇందులో **భారత జిడిపి (GDP) వృద్ధి రేటు 6.3-6.8%**గా ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో కూడా భారతదేశం శక్తివంతమైన ఆర్థిక సహనాన్ని, ధృడమైన ఆర్థిక నియంత్రణను, నిరంతర వృద్ధి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నదని నివేదిక వెల్లడించింది.
Union Budget 2025 Exconomic Survey Live Updates in Telugu

భారత ఆర్థిక వ్యవస్థపై కీలకాంశాలు:

జిడిపి వృద్ధి అంచనా: FY26లో 6.3-6.8% వృద్ధిని సాధించనున్నట్లు అంచనా.
ఆర్థిక మాంద్యం ప్రభావం: FY25లో జిడిపి వృద్ధి 6.4%కి తగ్గనున్నట్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) అంచనా వేసింది.

FY25లో భారతదేశ ఆర్థిక వృద్ధి నాలుగు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి చేరుకోనుండగా, యూనియన్ బడ్జెట్ 2025-26లో ప్రభుత్వం ఎలాంటి విధానాలను ప్రవేశపెట్టబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఆర్థిక సర్వే ప్రాముఖ్యతలు ఇవే..

భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై గమనిక: ఇది గత సంవత్సరంలో జరిగిన బడ్జెట్ ప్రభావాలను విశ్లేషించి, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాలను వివరించడమే కాకుండా, ప్రాథమిక, ద్వితీయ, సేవా రంగాలు వంటి మూడు ముఖ్యమైన రంగాల్లో ప్రగతి గురించి వివరాలు అందిస్తుంది.

భవిష్యత్తు అంచనాలు: ఆర్థిక సర్వే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవచ్చో కూడా అంచనా వేస్తుంది. దీనిలో భవిష్యత్తులోని ఆర్థిక ధోరణులు, ద్రవ్యోల్బణం, ప్రపంచ వాణిజ్యం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం: ఇది వివిధ సామాజిక భాగాలపై ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలియజేస్తుంది, అలాగే ఏ రంగాలకు ఎక్కువ శ్రద్ధ అవసరమో, ఏ రంగంలో అభివృద్ధి కావలసిన దిశ ఏమిటో కూడా సూచిస్తుంది.

Union Budget 2025: యూనియన్ బడ్జెట్ 2025 నుంచి కీలక అంచనాలు ఇవే..

ఆర్థిక సర్వే ఎప్పుడూ ప్రవేశపెడతారు?
ప్రతి సంవత్సరం ఆర్థిక సర్వే జనవరి 31వ‌ పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఇది సాధారణంగా బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఉంటుంది. ఈ ఏడాది కూడా బడ్జెట్ ముందు ఆర్థిక సర్వే సమర్పించబడుతుంది.

ఆర్థిక సర్వే ఎవరు తయారు చేస్తారు?
దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఆర్థిక సర్వేను పేర్కొంటారు. ఈ సర్వే తయారీకి ఆర్థిక వ్యవహారాల శాఖ కింద పనిచేసే ఆర్థిక విభాగం బాధ్యత వహిస్తుంది. ఈ ప్రక్రియకు అధిపతి ప్రధాన ఆర్థిక సలహాదారు. ఈ ఏడాది ఈ బాధ్యత వి.అనంత నాగేశ్వరన్ భుజాలపై ఉంటుంది. ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాన ఆర్థిక సలహాదారు ఆ దస్తావేజును పత్రికలకు అందజేస్తారు. 

ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడా ఇదే..
ఆర్థిక సర్వేలో ప్రస్తుత ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును చెబుతారు. ఆర్థిక బలోపేతానికి రానున్న కాలంలో చేయాల్సిన చర్యలను పేర్కొంటారు. కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను మాత్రమే వివ‌రిస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 31 Jan 2025 02:58PM

Photo Stories