Telangana EAPCET 2025 LIVE Updates : నేటి నుంచి తెలంగాణ ఎప్సెట్ 2025 పరీక్షలు .... నిమిషం నిబంధన అమలు చేయనున్నారు.
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్ సెట్(TG EAPCET 2025) పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29, 30వ తేదీల్లో జరిగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ కోసం 112 సెంటర్లు ఏర్పాటు చేశారు. మే 2 నుంచి 4 వరకు జరిగే ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం 124 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎప్ సెట్ ఎగ్జామ్స్ ప్రతిరోజూ 2 సెషన్లలో నిర్వహించనున్నారు.
Telangana EAPCET 2025 LIVE Updates : నేటి నుంచి తెలంగాణ ఎప్సెట్ 2025 పరీక్షలు .... నిమిషం నిబంధన అమలు చేయనున్నారు.
తెలంగాణ ఎప్ సెట్ 2025 పరిక్షలకు అమల్లో నిమిషం నిబంధన
టీజీ ఎప్ సెట్ ఎగ్జామ్కు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. మార్నింగ్ సెషన్ ఎగ్జామ్కు ఉదయం 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్ వారికి 1.30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ తప్పనిసరి ఉండడంతో అభ్యర్థుల వేలిముద్రలను తీసుకుంటారు. చేతులపై మెహందీ, టాటూ, ఇంక్ మొదలైన డిజైన్లు ఉండకూడదు.
తెలంగాణ ఎప్ సెట్ 2025 పరిక్షలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు:
హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి) తీసుకెళ్లాలి.
పరీక్షా కేంద్రానికి కనీసం 1 గంట ముందుగా చేరాలి.
బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఉపయోగించాలి (స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఇవ్వడం జరుగుతుంది).
ఏవైనా చీట్స్, మొబైల్, డిజిటల్ గ్యాడ్జెట్లు తీసుకురావడం నిషిద్ధం.
ప్రశాంతంగా, జాగ్రత్తగా ప్రశ్నలు చదవడం ఎంతో ముఖ్యం.