టీఎస్ ఎంసెట్ కు 94.5% మంది హాజరు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్-2019 ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే 6వ తేదీతో ప్రశాంతంగా ముగిశాయి. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షను నిర్వహించినప్పటికీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతోపాటు మాక్ టెస్ట్లను కూడా నిర్వహించారు.

దీనికితోడు ఆన్లైన్లో, ఎంసెట్ వెబ్సైట్లో మోడల్ పేపర్లను కూడా అందుబాటులో ఉంచడంతో విద్యార్థులు ముందుగానే సిద్ధం కావడానికి అవకాశం దొరికింది. చివరి నిమిషంలో పరీక్ష కేంద్రానికి వచ్చి విద్యార్థులు ఇబ్బందులుపడే సమస్యలు ఉత్పన్నం కాకుండాపరీక్ష కేంద్రాలను గంటన్నర ముందే తెరిచి ఉంచారు. పరీక్ష రాసే సమయంలో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. మే 8, 9 తేదిల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో ఎంసెట్ జరగనుంది.
92.3 శాతం ఎంసెట్కు హాజరు...
టీఎస్ ఎంసెట్-2019 ఇంజనీరింగ్ విభాగం పరీక్షను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 18 టెస్ట్ జోన్లు, 94 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,42,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 4, 5, 6 తేదీల్లో మొత్తం 5 విభాగాలుగా పరీక్ష నిర్వహించారు. 1,42,226 మంది విద్యార్ధులకుగాను 1,31,209 మంది హాజరయ్యారు. మొత్తంగా 92.3% మంది ఎంసెట్కు హాజరయ్యారు. తెలంగాణలో 1,22,246 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,15,492 మంది విద్యార్థులు ఎంసెట్కు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారి సంఖ్య 94.5 శాతంగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో 19,970 మంది విద్యార్థులకుగాను 15,717 మంది హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారి సంఖ్య 78.8 శాతంగా నమోదైంది.
చివరి రోజు పరీక్షకు 92.2 శాతం హాజరు...
మే 6వ తేదీన జరిగిన 5వ సెషన్ పరీక్షను తెలంగాణలో 83 కేంద్రాల్లో నిర్వహించగా 24,378 మంది విద్యార్ధులకుగాను 23,054 మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 4,041 మందికిగాను 3,145 మంది హాజరయ్యారు. మొత్తంమీద చివరిరోజు పరీక్షకు 92.2 శాతం మంది హాజరయ్యారు.
92.3 శాతం ఎంసెట్కు హాజరు...
టీఎస్ ఎంసెట్-2019 ఇంజనీరింగ్ విభాగం పరీక్షను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 18 టెస్ట్ జోన్లు, 94 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,42,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 4, 5, 6 తేదీల్లో మొత్తం 5 విభాగాలుగా పరీక్ష నిర్వహించారు. 1,42,226 మంది విద్యార్ధులకుగాను 1,31,209 మంది హాజరయ్యారు. మొత్తంగా 92.3% మంది ఎంసెట్కు హాజరయ్యారు. తెలంగాణలో 1,22,246 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,15,492 మంది విద్యార్థులు ఎంసెట్కు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారి సంఖ్య 94.5 శాతంగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో 19,970 మంది విద్యార్థులకుగాను 15,717 మంది హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారి సంఖ్య 78.8 శాతంగా నమోదైంది.
చివరి రోజు పరీక్షకు 92.2 శాతం హాజరు...
మే 6వ తేదీన జరిగిన 5వ సెషన్ పరీక్షను తెలంగాణలో 83 కేంద్రాల్లో నిర్వహించగా 24,378 మంది విద్యార్ధులకుగాను 23,054 మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 4,041 మందికిగాను 3,145 మంది హాజరయ్యారు. మొత్తంమీద చివరిరోజు పరీక్షకు 92.2 శాతం మంది హాజరయ్యారు.
Published date : 07 May 2019 02:39PM