Skip to main content

మే 17 లేదా 18న ఎంసెట్ ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 ఫలితాలు మే 17 లేదా 18 తేదీల్లో విడుదల చేయడానికి ఉన్నత విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ఫలితాలను మే మొదటి వారంలోనే విడుదల చేయాలని ముందుగా భావించినా ఏపీ, తెలంగాణ ఇంటర్ మార్కులు రావడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆలస్యం అయి్యంది. అభ్యర్థులకు ఎంసెట్‌లో వచ్చిన మార్కులను 75 శాతంగా తీసుకొని వాటికి ఇంటర్ మార్కులను 25 శాతంగా కలిపి ర్యాంకులను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఏపీ ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్‌ల్లో ఇవ్వడంతో వాటిని మార్కుల రూపంలో ఇవ్వాలని ఎంసెట్ కన్వీనర్ బోర్డుకు లేఖ రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీనిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి అధికారులు తీసుకువెళ్లగా అతని ఆదేశాలతో మార్కులు ఇచ్చేందుకు ఏపీ ఇంటర్ బోర్డు అంగీకరించి మార్కులను ఎంసెట్ కన్వీనర్‌కు అందించింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలలో తీవ్ర గందరగోళం ఏర్పడడంతో వాటిని మళ్లీ సరిచేయించడానికి అక్కడి ప్రభుత్వం రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇది పూర్తయ్యాకనే అక్కడి ఇంటర్ విద్యార్థుల మార్కులు వచ్చేందుకు అవకాశముండటంతో ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలలో జాప్యం అనివార్యమయి్యంది. ఎంసెట్ పరీక్ష రాసిన 2.67 లక్షల మంది విద్యార్థుల్లో 40 వేల మందికి పైగా తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. వీరి మార్కులను కూడా తెలంగాణ ఇంటర్ బోర్డు ఆదివారమే ఏపీ ఎంసెట్ కమిటీకి అందించింది. రెండు ఇంటర్ బోర్డుల నుంచి విద్యార్థుల మార్కులు అందడంతో ఎంసెట్ ఫలితాల విడుదలకు ఎంసెట్ నిర్వహణ చైర్మన్, కాకినాడ జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రరాజు, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు చర్యలు చేపట్టారు. ఫలితాలను మే 17న విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నామని, ఆ రోజుకు అవకాశం లేకపోతే 18న విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబు తెలిపారు. ఈ ఫలితాలను విడుదల చేసే సమయం, వేదికను త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు.
Published date : 14 May 2019 02:43PM

Photo Stories