Skip to main content

ఏపీలో ‘ఎంసెట్ దరఖాస్తుకు ఆధార్ తప్పనిసరి’

బాలాజీచెరువు (కాకినాడ): ఎంసెట్ అభ్యర్థులు తమ దరఖాస్తులో తప్పనిసరిగా ఆధార్ నమోదు చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు శుక్రవారం తెలిపారు.
ఏప్రిల్ 29న జరిగే ఈ పరీక్షకు రాష్ట్రంలో 22 రీజనల్ సెంటర్లు, హైదరాబాద్‌లో మూడు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి కొత్తగా రాజమండ్రిలో రీజనల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్షకు దాదాపు రెండు లక్షల డెబ్భై వేల మంది హాజరవుతారన్న అంచనాతో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సాయిబాబు చెప్పారు.
Published date : 30 Jan 2016 02:23PM

Photo Stories