ఏపీ ఎంసెట్-2019 ఫలితాలపై సందిగ్ధం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలపై సందిగ్థం నెలకొంది. తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలను స్కాన్డ కాపీలతో సహా మే 27వతేదీన ఒకేసారి విడుదల చేయాలని హైకోర్టు సూచించడంతో అక్కడి ఫలితాలు వాయిదా పడ్డాయి.

ఈ ప్రభావం ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలపై పడుతోంది. మే 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి 15న ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో అక్కడ ఇంటర్మీడియెట్ ఫలితాల ప్రకటన మే 27వ తేదీకి వాయిదా పడింది. దీంతో మే 18వ తేదీన ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలా? వద్దా? అనే సందిగ్థం ఉన్నత విద్యామండలిలో నెలకొంది.
మార్కుల్లో మార్పులుంటే ఎలా?
ఏపీ ఎంసెట్కు దాదాపు 40వేల మంది తెలంగాణ విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్ ర్యాంకుల్లోనూ వీరు అగ్రస్థానాల్లో నిలుస్తున్నారు. తెలంగాణ ఇంటర్ మార్కుల డేటాను నాలుగు రోజుల క్రితమే అక్కడి అధికారులు ఏపీ ఎంసెట్ కన్వీనర్కు అందించారు. ఆ మార్కుల ఆధారంగా అధికారులు ఏపీ ఎంసెట్ ర్యాంకులను రూపొందించి విడుదలకు సిద్ధం చేసి ఉంచారు. మే 15 తెలంగాణ ఫలితాలు వెల్లడై ఉంటే యధాతథంగా 18న ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలని భావించారు. అయితే అక్కడి ఫలితాలు వాయిదా పడటంతో ఏం చేయాలన్న దానిపై అధికారులు సందిగ్థంలో ఉన్నారు. హైకోర్టు తీర్పుతో ముడిపడి ఉన్నందున న్యాయపరమైన సమస్యలు వస్తాయన్న అనుమానాలు అధికారుల్లో ఉన్నాయి. మరోవైపు తెలంగాణ అధికారులు ఇచ్చిన ప్రస్తుత డేటా ఆధారంగా ర్యాంకులు ప్రకటించాక తదుపరి అక్కడ అధికారికంగా మే 27న విడుదల చేసే మార్కుల్లో మార్పులుంటే ఏం చేయాలన్న దానిపైనా తర్జనభర్జన పడుతున్నారు. తొలుత ప్రకటించిన మార్కుల ఆధారంగా ఇచ్చే ర్యాంకుల్లో తరువాత మార్పులు చేస్తే విద్యార్థులు మనస్తాపం చెందే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ ఫలితాలను మే 18న కాకుండా తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలను మే 27న అధికారికంగా ప్రకటించాకే విడుదల చేయాలన్న వాదన కూడా ఉంది.
కొత్త సమస్య కాదు..
మరికొందరు అధికారులు మాత్రం ఎంసెట్ ఫలితాలను ముందు విడుదల చేసినా ఇతర ఫలితాలను అనుసరించి వేర్వేరుగా ర్యాంకులను ప్రకటించిన ఆనవాయితీ ఉందని పేర్కొంటున్నారు. సీబీఎస్ఈ ఫలితాలు, ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ ఫలితాలు, ఇతర రాష్ట్రాల ఇంటర్ ఫలితాలు వేర్వేరు తేదీల్లో వెలువడుతుంటాయని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు అనుకున్న విధంగా 18న విడుదల చేసి తరువాత తెలంగాణ ఇంటర్ మార్కుల్లో వచ్చే మార్పులను అనుసరించి ఏపీ ఎంసెట్ ర్యాంకులను మళ్లీ ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఈ అంశాలను మే 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దృషికి తెచ్చి ఆయన సూచనల మేరకు ముందుకు వెళ్లాలని మండలి అధికారులు భావిస్తున్నారు.
మార్కుల్లో మార్పులుంటే ఎలా?
ఏపీ ఎంసెట్కు దాదాపు 40వేల మంది తెలంగాణ విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్ ర్యాంకుల్లోనూ వీరు అగ్రస్థానాల్లో నిలుస్తున్నారు. తెలంగాణ ఇంటర్ మార్కుల డేటాను నాలుగు రోజుల క్రితమే అక్కడి అధికారులు ఏపీ ఎంసెట్ కన్వీనర్కు అందించారు. ఆ మార్కుల ఆధారంగా అధికారులు ఏపీ ఎంసెట్ ర్యాంకులను రూపొందించి విడుదలకు సిద్ధం చేసి ఉంచారు. మే 15 తెలంగాణ ఫలితాలు వెల్లడై ఉంటే యధాతథంగా 18న ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలని భావించారు. అయితే అక్కడి ఫలితాలు వాయిదా పడటంతో ఏం చేయాలన్న దానిపై అధికారులు సందిగ్థంలో ఉన్నారు. హైకోర్టు తీర్పుతో ముడిపడి ఉన్నందున న్యాయపరమైన సమస్యలు వస్తాయన్న అనుమానాలు అధికారుల్లో ఉన్నాయి. మరోవైపు తెలంగాణ అధికారులు ఇచ్చిన ప్రస్తుత డేటా ఆధారంగా ర్యాంకులు ప్రకటించాక తదుపరి అక్కడ అధికారికంగా మే 27న విడుదల చేసే మార్కుల్లో మార్పులుంటే ఏం చేయాలన్న దానిపైనా తర్జనభర్జన పడుతున్నారు. తొలుత ప్రకటించిన మార్కుల ఆధారంగా ఇచ్చే ర్యాంకుల్లో తరువాత మార్పులు చేస్తే విద్యార్థులు మనస్తాపం చెందే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ ఫలితాలను మే 18న కాకుండా తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలను మే 27న అధికారికంగా ప్రకటించాకే విడుదల చేయాలన్న వాదన కూడా ఉంది.
కొత్త సమస్య కాదు..
మరికొందరు అధికారులు మాత్రం ఎంసెట్ ఫలితాలను ముందు విడుదల చేసినా ఇతర ఫలితాలను అనుసరించి వేర్వేరుగా ర్యాంకులను ప్రకటించిన ఆనవాయితీ ఉందని పేర్కొంటున్నారు. సీబీఎస్ఈ ఫలితాలు, ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ ఫలితాలు, ఇతర రాష్ట్రాల ఇంటర్ ఫలితాలు వేర్వేరు తేదీల్లో వెలువడుతుంటాయని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు అనుకున్న విధంగా 18న విడుదల చేసి తరువాత తెలంగాణ ఇంటర్ మార్కుల్లో వచ్చే మార్పులను అనుసరించి ఏపీ ఎంసెట్ ర్యాంకులను మళ్లీ ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఈ అంశాలను మే 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దృషికి తెచ్చి ఆయన సూచనల మేరకు ముందుకు వెళ్లాలని మండలి అధికారులు భావిస్తున్నారు.
Published date : 16 May 2019 06:24PM