Skip to main content

National Games: జాతీయ క్రీడల్లో సత్యజ్యోతి, సురభికి కాంస్య పతకాలు

జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ లిఫ్టర్‌ టి.సత్యజ్యోతి, తెలంగాణ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ తమ ప్రతిభతో కాంస్య పతకాలు సాధించారు.
Surabhi and Jyothi Win Bronze Medals at National Games

సత్యజ్యోతి (ఆంధ్రప్రదేశ్):

  • మహిళల 87 కేజీల విభాగంలో స్నాచ్‌లో 92 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 109 కేజీలు లిఫ్ట్ చేసి, మొత్తం 201 కేజీల టోటల్‌తో సత్యజ్యోతి కాంస్య పతకం సాధించింది.
  • ఈ విభాగంలో పంజాబ్‌ అమ్మాయి మెహక్‌శర్మ 247 కేజీల టోటల్‌తో మూడు జాతీయ రికార్డులను బద్దలు కొట్టి, స్వర్ణ పతకం గెలిచింది.
  • పూర్ణిమ (యూపీ) 216 కేజీతో రజత పతకం సాధించింది.

రాపోలు సురభి భరద్వాజ్ (తెలంగాణ):

  • 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో 448.8 పాయింట్లతో సురభి మూడో స్థానంలో నిలిచింది.
  • సిప్త్‌ కౌర్ (పంజాబ్) 461.2 పాయింట్లతో స్వర్ణం, అంజుమ్‌ మౌద్గిల్ (పంజాబ్) 458.7 పాయింట్లతో రజతం సాధించారు.

ఇతర ముఖ్య సంఘటనలు..

  • జొనాథన్‌ ఆంథోనీ (కర్ణాటక) 15 ఏళ్ల వయసులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 240.7 పాయింట్లతో స్వర్ణం సాధించాడు.
  • శరబ్‌జ్యోత్ (పారిస్‌ ఒలింపిక్స్‌ పతక విజేత) నాల్గవ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
  • స్విమ్మింగ్‌లో దినిది: ఆమె 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో స్వర్ణ పతకం గెలిచింది, అలాగే 4×100 మీటర్ల మిక్స్‌డ్‌ ఫ్రీస్టయిల్లో కూడా స్వర్ణం సాధించింది.
  • శ్రీహరి 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 4×100 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో స్వర్ణాలు గెలుచుకున్నాడు, పతకాల సంఖ్యను ఎనిమిది వరకు పెంచుకున్నాడు.

U19 T20 World Cup: వరుసగా రెండోసారి అండర్‌–19 మహిళల టీ20 ప్రపంచకప్ సాధించిన భారత్‌

Published date : 05 Feb 2025 08:53AM

Photo Stories