Skip to main content

CWG 2022 : బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్ కు రజతం

కామన్వెల్త్‌ క్రీడల్లో ఆగస్టు 3న భారత్‌ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి.
CWG 2022, Badminton: India win mixed team silver after
CWG 2022, Badminton: India win mixed team silver after

జూడోలో రజతం... వెయిట్‌లిఫ్టింగ్, స్క్వాష్‌లలో కాంస్యాలు దక్కగా... ఇతర క్రీడాంశాల్లో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా ఈసారి ఫైనల్లో 1–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట 18–21, 15–21తో టెంగ్‌ ఫాంగ్‌ చియా–వుయ్‌ యిక్‌ సో ద్వయం చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 22–20, 21–17తో జిన్‌ వె గోపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో 14వ ర్యాంకర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 19–21, 21–6, 16–21తో ప్రపంచ 42వ ర్యాంకర్‌ జె యోంగ్‌ ఎన్జీ చేతిలో ఓడిపోయాడు. నాలుగో మ్యాచ్‌లో థినా మురళీథరన్‌–కూంగ్‌ లె పియర్లీ ద్వయం 21–18, 21–17తో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంటను ఓడించి మలేసియాకు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది. కాంస్య పతక పోరులో సింగపూర్‌ 3–0తో ఇంగ్లండ్‌ను ఓడించింది.

Also read: Quiz of The Day (August 03, 2022): భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది?

పురుషుల స్క్వాష్ లో భారత ఆటగాడు సౌరవ్‌ ఘోషాల్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో స్క్వాష్‌ సింగిల్స్‌లో విభాగంలో కాంస్యం రూపంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ 15వ ర్యాంకర్‌ సౌరవ్‌ 11–6, 11–1, 11–4 తేడాతో మాజీ నంబర్‌వన్‌ జేమ్స్‌ విల్రస్టాప్‌ (ఇంగ్లండ్‌)ను చిత్తు చేశాడు. 2018 క్రీడల్లో దీపిక పల్లికల్‌తో కలిసి సౌరవ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో రజతం గెలుచుకున్నాడు.  

Also read: Quiz of The Day (August 04, 2022): దేశంలో తుపానులకు గురయ్యే ప్రాంతం ఎంత శాతం?

వెయిట్‌లిఫ్టింగ్‌ 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్‌ స్నాచ్‌లో వరుసగా మూడు ప్రయత్నాల్లో ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ 157, 161, 163 కేజీల బరువునెత్తాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో కూడా వరుసగా 185, 189 కేజీల తర్వాత 192 కేజీలతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తం (163+192)355 కేజీలతో ప్రీత్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఈ విభాగంలో జూనియర్‌ పెరిక్లెక్స్‌ (కామెరూన్‌; 361 కేజీలు) స్వర్ణం సాధించగా, జాక్‌ ఒపెలాజ్‌ (సమోవా; 358 కేజీలు) రజతం గెలుచుకున్నాడు. అయితే మహిళల 87+ కేజీల కేటగిరీలో పూర్ణిమ పాండేకు నిరాశే ఎదురైంది. మూడు ప్రయత్నాలు కూడా పూర్తి చేయలేకపోయిన ఆమె ఆరో స్థానంతో ముగించింది. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 04 Aug 2022 05:42PM

Photo Stories