Skip to main content

World Economic Forum thanks CM Jagan : సీఎం జగన్‌కు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం కృతజ్ఞతలు

అమరావతి: ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ 2022 వార్షిక సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని చూపిన చొరవపై వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం మంగళవారం కృతజ్ఞతలు తెలిపింది. ‘చరిత్రలో మలువు, ప్రభుత్వ విధానాలు, వ్యాపార వ్యూహాలు’ అనే ఇతివృత్తంపై నిర్వ హించిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్న సంగతి తెలిసిందే.

దశాబ్దాలుగా అత్యంత సవాల్‌గా ఉన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యాల్లో సమావేశం జరిగిందని, ప్రపంచా నికి ఈ క్లిష్ట సమయాన దావోస్‌లో వ్యూహాత్మక సంభాషణల్లో మీ (సీఎం జగన్‌) సహకారం చాలా ముఖ్యమైనదని ఫోరం అధ్యక్షుడు బోర్జ్‌ బ్రెండే జగన్‌కు రాసిన లేఖలో పేర్కొ న్నారు. వార్షిక సమావేశంలో బలమైన స్వరంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిం చినందుకు సీఎం జగన్‌కు ఫోరం ధన్యవాదాలు తెలి పింది. దావోస్‌లో మీ (సీఎం జగన్‌) అను భవం ఫలవంతమైందని లేఖలో పేర్కొన్నారు. 

Published date : 01 Jun 2022 03:29PM

Photo Stories