మే 2019 రాష్ట్రీయం
Sakshi Education
ఏపీలో వైఎస్సార్సీపీ విజయం
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 11న జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ మేరకు మే 23న ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగగా వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తెలుగుదేశం(టీడీపీ) 23 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి గెలుపొందగా... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పంలో విజయం సాధించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి 88 స్థానాలు అవసరం.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు..
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు-2019లో విజయం
ఎప్పుడు: మే 23
ఎవరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)
ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన మే 23న తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు పంపించారు. దీన్ని గవర్నర్ నరసింహన్ వెంటనే ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చంద్రబాబును నరసింహన్ కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా
ఎప్పుడు: మే 23
ఎవరు: చంద్రబాబు నాయుడు
ఎందుకు: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనందుకు
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ శాసన సభ రద్దు
ఆంధ్రప్రదేశ్ 14వ శాసన సభ ను రద్దు చేస్తూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మే 25న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీ 15వ శాసనసభ ఏర్పాటు చేయాల్సి ఉన్నందున లాంఛనంగా 14వ అసెంబ్లీని రద్దు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ 14వ శాసన సభ రద్దు
ఎప్పుడు : మే 25
ఎవరు : గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్
ఎందుకు : ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా
ఏపీలో 80.31 శాతం పోలింగ్ నమోదు
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 80.31 శాతం పోలింగ్ నమోదయ్యిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మే 25న తెలిపారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 79.64 శాతం ఓట్లు నమోదు కాగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాత మొత్తం పోలింగ్ 80.31 శాతానికి చేరిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 67.47 శాతం పోలింగ్ నమోదయ్యింది. దేశ సగటుతో పోలిస్తే ఏపీలో 12.84 శాతం అదనంగా ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో 81.79 శాతం ఓటింగ్తో అస్సాం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2014లో ఏపీలో 78.41 శాతం ఓటింగ్ నమోదైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో 80.31 శాతం పోలింగ్ నమోదు
ఎప్పుడు : మే 25
ఎవరు : ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది
హైదరాబాద్లో సీడ్ టెస్టింగ్ సదస్సు
హైదరాబాద్లోని హైటెక్స్ ఆవరణలో అంతర్జాతీయ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఇస్టా) 32వ వార్షిక సదస్సును నిర్వహించనున్నారు. 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు జరగనున్న ఈ సదస్సులో 83 దేశాలకు చెందిన సుమారు 500 మంది ప్రతినిధులు, 150 మంది పరిశోధకులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొననున్నారు. కేంద్ర వ్యవసాయ, సహకార మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈ సదస్సులో విత్తన టెక్నాలజీ, నాణ్యతపై చర్చించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 70కి పైగా దేశాల్లోని విత్తన ప్రయోగశాలలతో సంబంధం కలిగిన ఇస్టాను 1924లో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా విత్తన ధృవీకరణ విధానంలో ఒకే విధమైన శాస్త్రీయ విధానం ఉండేలా ఇస్టా కృషి చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్లో సీడ్ టెస్టింగ్ సదస్సు
ఎప్పుడు : 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు
ఎవరు : కేంద్ర వ్యవసాయ, సహకార మంత్రిత్వ శాఖ, తెలంగాణ వ్యవసాయ శాఖ
బంగ్లాదేశ్ బృందం ఏపీ సచివాలయ సందర్శన
యూనిసెఫ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ అధికారుల బృందం మే 29న ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని సందర్శించింది. ఆ దేశ ప్రణాళికా విభాగం జాయింట్ సెక్రటరీ షంశూల్ ఆలమ్ నేతృత్వంలో ప్రణాళిక, ఆరోగ్యశాఖలకు చెందిన ఉన్నతాధికారుల బృందం అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించింది. రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులతో సమావేశమైన ఈ బృందం రాష్ట్రంలో వివిధ పథకాల అమలుకు ప్రభుత్వం సేకరించిన సమాచారం, రియల్టైంలో ప్రజలకు పథకాలు అందిస్తున్న తీరును గురించి తెలుసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సందర్శన
ఎప్పుడు : మే 29
ఎవరు : బంగ్లాదేశ్ అధికారుల బృందం
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ
హైదరాబాద్లో 2019 అక్టోబర్ 11, 12 తేదీల్లో ‘వరల్డ్ డిజైన్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక డిజైనింగ్ రంగంలో సృజనాత్మకత పెరుగుతుందని భావిస్తున్నారు. 31వ ద్వైవార్షిక వరల్డ్ డిజైన్ అసెంబ్లీని హైదరాబాద్లో నిర్వహిస్తామని 2018 జూలైలో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) అధ్యక్షులు లూయిసా బొషిటో ప్రకటించారు.
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా 1957లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ సొసైటీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్ (ఐసీఎస్ఐడీ) ఏర్పాటైంది. తొలుత 12 వృత్తి నైపుణ్యం కలిగిన డిజైన్ అసోసియేషన్లతో ఏర్పాటైన ఐసీఎస్ఐడీ 2015 అక్టోబర్లో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్గా నామాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా 140 డిజైన్ అసోసియేషన్లు డబ్ల్యూడీఓలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో సృజనాత్మకతను ప్రోత్సహించడం, నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించేలా పారిశ్రామిక నమూనాలు తయారు చేయడం తదితరాలు లక్ష్యంగా వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి రెండేళ్లకోసారి వరల్డ్ డిజైన్ క్యాపిటల్ పేరిట ఒక్కో నగరాన్ని ఎంపిక చేసి సదస్సులు నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ డిజైన్ అసెంబ్లీ
ఎప్పుడు : 2019 అక్టోబర్ 11, 12 తేదీల్లో
ఎక్కడ : హైదరాబాద్
అంతర్జాతీయ ప్రదర్శనకు ఫణిగిరి శిల్పం
అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించనున్న ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియమ్స్ ఆఫ్ ఆర్ట్ (ది మెట్)’150వ వార్షికోత్సవంలో ఫణిగిరి శిల్పాన్ని ప్రదర్శించనున్నారు. న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో 2020లో నిర్వహించనున్న ఈ వేడుకలో ‘ట్రీ అండ్ సర్పెంట్’పేరుతో బుద్ధుడి ఇతివృత్తంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వివిధ మ్యూజియాల్లో ఉన్న బుద్ధుడికి సంబంధించిన అరుదైన కళాఖండాలను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఫణిగిరి శిల్పాన్ని ఎంపికచేసింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించిన ఈ శిల్పాన్ని ఇక్ష్వాకుల కాలంలో రూపొందించారు. నాలుగు అడుగుల ఎత్తున్న ఈ సున్నపురాయి శిల్పాన్ని ఫణిగిరి బౌద్ధ స్థూపం పరిసరాల్లో 2001లో కనుగొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ ప్రదర్శనకు ఫణిగిరి శిల్పం
ఎప్పుడు : మే 17
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
హైదరాబాద్లో అరుదైన రాబందు
హైదరాబాద్లోని ఆసిఫ్నగర్లో మే 17న దేశంలోనే అరుదైన రాబందు జాతికి చెందినదిగా (వైట్ బ్యాక్డ్ వల్చర్) భావిస్తున్న రాబందు పిల్ల దొరికిందని అటవీ అధికారులు తెలిపారు. ఈ పక్షిని ప్రస్తుతం నెహ్రూ జూలాజికల్ పార్కులోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మనదేశంలో అంతరించే ప్రమాదంలో ఈ రాబందు జాతి ఉందని వివరించారు. దాదాపు ఇరవై ఏళ్ల కిందట హైదరాబాద్లోని వనస్థలిపురంలో కనిపించిన ఈ జాతి రాబందు.. తర్వాత కాలంలో కనిపించకుండా పోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అరుదైన రాబందు (వైట్ బ్యాక్డ్ వల్చర్) గుర్తింపు
ఎప్పుడు : మే 17
ఎక్కడ : హైదరాబాద్
ముక్తేశ్వర ఆలయాభివృద్ధికి 100 కోట్లు
గోదావరి తీరాన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి వెంటనే రూ.100 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని, కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా మే 19న కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు
ఎప్పుడు : మే 19
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
ఏపీ గిరిజన శాఖ మంత్రి శ్రావణ్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ గిరిజన, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మే 9న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శ్రావణ్ రాజీనామాను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆమోదించారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిడారి సర్వేశ్వరరావు 2014 అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికయ్యారు. అయితే 2018లో సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేశారు. దీంతో ఆయన కుమారుడు శ్రావణ్ను 2018, నవంబర్ 11న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఆరు నెలల్లోగా ఏదో సభకు అంటే అసెంబ్లీకి లేదా మండలి సభ్యునిగా ఎన్నికవ్వాలి. అయితే కిడారి శ్రావణ్కుమార్ ఏ చట్టసభకు ఎన్నిక కాలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ గిరిజన, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజీనామ
ఎప్పుడు : మే 9
ఎవరు : కిడారి శ్రావణ్ కుమార్
ఎందుకు : పదవి చే పట్టిన ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కానందుకు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు..
అసెంబ్లీ (175) | |
పార్టీ | గెలుపు |
వైసీపీ | 151 |
తెలుగుదేశం | 23 |
జనసేన+ | 1 |
భాజపా | 0 |
కాంగ్రెస్ | 0 |
ఇతరులు | 0 |
లోక్సభ (25) | |
పార్టీ | గెలుపు |
వైసీపీ | 22 |
తెలుగుదేశం | 3 |
జనసేన+ | 0 |
భాజపా | 0 |
కాంగ్రెస్ | 0 |
ఇతరులు | 0 |
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు-2019లో విజయం
ఎప్పుడు: మే 23
ఎవరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)
ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన మే 23న తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు పంపించారు. దీన్ని గవర్నర్ నరసింహన్ వెంటనే ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చంద్రబాబును నరసింహన్ కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా
ఎప్పుడు: మే 23
ఎవరు: చంద్రబాబు నాయుడు
ఎందుకు: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనందుకు
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ శాసన సభ రద్దు
ఆంధ్రప్రదేశ్ 14వ శాసన సభ ను రద్దు చేస్తూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మే 25న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీ 15వ శాసనసభ ఏర్పాటు చేయాల్సి ఉన్నందున లాంఛనంగా 14వ అసెంబ్లీని రద్దు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ 14వ శాసన సభ రద్దు
ఎప్పుడు : మే 25
ఎవరు : గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్
ఎందుకు : ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా
ఏపీలో 80.31 శాతం పోలింగ్ నమోదు
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 80.31 శాతం పోలింగ్ నమోదయ్యిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మే 25న తెలిపారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 79.64 శాతం ఓట్లు నమోదు కాగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాత మొత్తం పోలింగ్ 80.31 శాతానికి చేరిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 67.47 శాతం పోలింగ్ నమోదయ్యింది. దేశ సగటుతో పోలిస్తే ఏపీలో 12.84 శాతం అదనంగా ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో 81.79 శాతం ఓటింగ్తో అస్సాం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2014లో ఏపీలో 78.41 శాతం ఓటింగ్ నమోదైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో 80.31 శాతం పోలింగ్ నమోదు
ఎప్పుడు : మే 25
ఎవరు : ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది
హైదరాబాద్లో సీడ్ టెస్టింగ్ సదస్సు
హైదరాబాద్లోని హైటెక్స్ ఆవరణలో అంతర్జాతీయ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఇస్టా) 32వ వార్షిక సదస్సును నిర్వహించనున్నారు. 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు జరగనున్న ఈ సదస్సులో 83 దేశాలకు చెందిన సుమారు 500 మంది ప్రతినిధులు, 150 మంది పరిశోధకులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొననున్నారు. కేంద్ర వ్యవసాయ, సహకార మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈ సదస్సులో విత్తన టెక్నాలజీ, నాణ్యతపై చర్చించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 70కి పైగా దేశాల్లోని విత్తన ప్రయోగశాలలతో సంబంధం కలిగిన ఇస్టాను 1924లో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా విత్తన ధృవీకరణ విధానంలో ఒకే విధమైన శాస్త్రీయ విధానం ఉండేలా ఇస్టా కృషి చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్లో సీడ్ టెస్టింగ్ సదస్సు
ఎప్పుడు : 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు
ఎవరు : కేంద్ర వ్యవసాయ, సహకార మంత్రిత్వ శాఖ, తెలంగాణ వ్యవసాయ శాఖ
బంగ్లాదేశ్ బృందం ఏపీ సచివాలయ సందర్శన
యూనిసెఫ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ అధికారుల బృందం మే 29న ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని సందర్శించింది. ఆ దేశ ప్రణాళికా విభాగం జాయింట్ సెక్రటరీ షంశూల్ ఆలమ్ నేతృత్వంలో ప్రణాళిక, ఆరోగ్యశాఖలకు చెందిన ఉన్నతాధికారుల బృందం అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించింది. రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులతో సమావేశమైన ఈ బృందం రాష్ట్రంలో వివిధ పథకాల అమలుకు ప్రభుత్వం సేకరించిన సమాచారం, రియల్టైంలో ప్రజలకు పథకాలు అందిస్తున్న తీరును గురించి తెలుసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సందర్శన
ఎప్పుడు : మే 29
ఎవరు : బంగ్లాదేశ్ అధికారుల బృందం
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ

ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా 1957లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ సొసైటీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్ (ఐసీఎస్ఐడీ) ఏర్పాటైంది. తొలుత 12 వృత్తి నైపుణ్యం కలిగిన డిజైన్ అసోసియేషన్లతో ఏర్పాటైన ఐసీఎస్ఐడీ 2015 అక్టోబర్లో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్గా నామాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా 140 డిజైన్ అసోసియేషన్లు డబ్ల్యూడీఓలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో సృజనాత్మకతను ప్రోత్సహించడం, నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించేలా పారిశ్రామిక నమూనాలు తయారు చేయడం తదితరాలు లక్ష్యంగా వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి రెండేళ్లకోసారి వరల్డ్ డిజైన్ క్యాపిటల్ పేరిట ఒక్కో నగరాన్ని ఎంపిక చేసి సదస్సులు నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ డిజైన్ అసెంబ్లీ
ఎప్పుడు : 2019 అక్టోబర్ 11, 12 తేదీల్లో
ఎక్కడ : హైదరాబాద్
అంతర్జాతీయ ప్రదర్శనకు ఫణిగిరి శిల్పం
అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించనున్న ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియమ్స్ ఆఫ్ ఆర్ట్ (ది మెట్)’150వ వార్షికోత్సవంలో ఫణిగిరి శిల్పాన్ని ప్రదర్శించనున్నారు. న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో 2020లో నిర్వహించనున్న ఈ వేడుకలో ‘ట్రీ అండ్ సర్పెంట్’పేరుతో బుద్ధుడి ఇతివృత్తంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వివిధ మ్యూజియాల్లో ఉన్న బుద్ధుడికి సంబంధించిన అరుదైన కళాఖండాలను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఫణిగిరి శిల్పాన్ని ఎంపికచేసింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో లభించిన ఈ శిల్పాన్ని ఇక్ష్వాకుల కాలంలో రూపొందించారు. నాలుగు అడుగుల ఎత్తున్న ఈ సున్నపురాయి శిల్పాన్ని ఫణిగిరి బౌద్ధ స్థూపం పరిసరాల్లో 2001లో కనుగొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ ప్రదర్శనకు ఫణిగిరి శిల్పం
ఎప్పుడు : మే 17
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
హైదరాబాద్లో అరుదైన రాబందు
హైదరాబాద్లోని ఆసిఫ్నగర్లో మే 17న దేశంలోనే అరుదైన రాబందు జాతికి చెందినదిగా (వైట్ బ్యాక్డ్ వల్చర్) భావిస్తున్న రాబందు పిల్ల దొరికిందని అటవీ అధికారులు తెలిపారు. ఈ పక్షిని ప్రస్తుతం నెహ్రూ జూలాజికల్ పార్కులోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మనదేశంలో అంతరించే ప్రమాదంలో ఈ రాబందు జాతి ఉందని వివరించారు. దాదాపు ఇరవై ఏళ్ల కిందట హైదరాబాద్లోని వనస్థలిపురంలో కనిపించిన ఈ జాతి రాబందు.. తర్వాత కాలంలో కనిపించకుండా పోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అరుదైన రాబందు (వైట్ బ్యాక్డ్ వల్చర్) గుర్తింపు
ఎప్పుడు : మే 17
ఎక్కడ : హైదరాబాద్
ముక్తేశ్వర ఆలయాభివృద్ధికి 100 కోట్లు
గోదావరి తీరాన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి వెంటనే రూ.100 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని, కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా మే 19న కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు
ఎప్పుడు : మే 19
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
ఏపీ గిరిజన శాఖ మంత్రి శ్రావణ్ రాజీనామా

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ గిరిజన, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజీనామ
ఎప్పుడు : మే 9
ఎవరు : కిడారి శ్రావణ్ కుమార్
ఎందుకు : పదవి చే పట్టిన ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కానందుకు
Published date : 31 May 2019 03:29PM