Skip to main content

Farmer Registry: రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు.. నమోదు చేసుకోండిలా..

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కొత్తగా రూపొందించిన 'ఫార్మర్ రిజిస్ట్రీ(Farmer Registry)' ప్రాజెక్టు తెలంగాణలో మే 6 తేదీ నుంచి ప్రారంభం కానుంది.
Unique Farmer ID Cards for Telangana Farmers   Digital registration process for farmers with Unique Farmer ID  Central government’s Farmer Registry scheme

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి రైతుకు ఆధార్ తరహాలో 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు సంఖ్య (Unique Farmer ID) కేటాయించనున్నారు. దీని ద్వారా రైతుల వివరాలను ఒకే చోట డిజిటల్‌గా భద్రపరిచి, పథకాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చనే లక్ష్యంతో ఇది రూపుదిద్దుకుంది.

వ్యవసాయశాఖ కార్యాలయాల్లో..
ప్రారంభ దశలో రైతులు తమ వివరాలను మండల వ్యవసాయ అధికారుల (MAO) లేదా వ్యవసాయ విస్తరణాధికారుల (AEO) కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. త్వరలో ఈ సేవలు మీ సేవ కేంద్రాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రాజెక్టు సజావుగా అమలవ్వాలన్న ఉద్దేశంతో సంబంధిత అధికారులకు తగిన శిక్షణ ఇవ్వబడింది. 

ఎందుకు అవసరమయ్యింది ఈ ప్రాజెక్ట్?
ప్రస్తుతం కేంద్రానికి రాష్ట్రాల నుంచి భూముల స్థూల గణాంకాలు, పంటల వివరాలు మాత్రమే అందుతున్నాయి. వ్యక్తిగతంగా రైతుల వారీగా సమాచారం లేకపోవడం వల్ల పథకాలు సరైన లబ్ధిదారులకు చేరడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. పీఎం కిసాన్, పంటల బీమా, సబ్సిడీలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పథకాలను సమర్ధంగా అమలు చేయాలంటే ఖచ్చితమైన రైతుల డేటా అవసరమని కేంద్రం గుర్తించింది. ఈ లోపాలను దృష్టిలో ఉంచుకుని, ఈ యూనిక్ ID ద్వారా వ్యవసాయ శాఖ డిజిటలీకరణ లక్ష్యంగా ప్రాజెక్టు రూపొందించబడింది.

Ration Card: రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారా.. లేదా..? చెక్ చేసుకోండిలా..

నమోదుకు అవసరమైన పత్రాలు 

  • పట్టాదారు పాస్‌పుస్తకం (భూయాజమాన్య వివరాలతో)
  • ఆధార్ కార్డ్
  • మొబైల్ నంబర్

ఈ వివరాలను అధికారుల ద్వారా నమోదు చేసిన తరువాత, రైతులకు ఓటీపీ (OTP) వస్తుంది. దాన్ని ధృవీకరించిన తరువాతే విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించబడుతుంది.

కేంద్ర పథకాలతో అనుసంధానం
ఈ యూనిక్ ID ద్వారా రైతులను కేంద్ర పథకాలతో అనుసంధానం చేస్తారు. ముఖ్యంగా పీఎం కిసాన్ (PM-KISAN) పథకానికి సంబంధించి తదుపరి విడత నిధుల విడుదలకు ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ప్రామాణికంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఇది పథకాల అమలులో పారదర్శకతను పెంచుతుంది.

ఇప్పటికే 19 రాష్ట్రాల్లో అమలు
ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని ఈ రిజిస్ట్రీ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేశాయి. కొన్ని కారణాల వల్ల తెలంగాణలో ఆలస్యం అయినా, ఇప్పుడే ‘అగ్రిస్టాక్‌ తెలంగాణ ఫార్మర్‌ రిజిస్ట్రీ’ పేరిట అధికారికంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.

పథకాల అనుసంధానం, ప్రాముఖ్యత
ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ వ్యవసాయ పథకాలకు అనుసంధానం చేస్తారు. ముఖ్యంగా, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం యొక్క తదుపరి విడత నిధులను విడుదల చేయడానికి ఈ గుర్తింపు సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. 

Indiramma House: ఇందిరమ్మ ఇళ్లు.. ఇకపై ప్రతి సోమవారం అకౌంట్లోకి డబ్బులు

Published date : 05 May 2025 11:47AM

Photo Stories