Skip to main content

Baba Shivanand: పద్మశ్రీ అవార్డు గ్రహీత.. 128 ఏళ్ల బాబా శివానంద్‌ కన్నుమూత

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్‌ కన్నుమూశారు.
Padma Shri awardee Baba Shivanand passes away

ఆయన వయసు 128 ఏళ్లు అని ఆయన శిష్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాబా, ఏప్రిల్ 30న వారణాసిలోని ఓ ఆసుపత్రిలో చేరినప్పటికీ, మే 3వ తేదీన తుదిశ్వాస విడిచారు.
 
1896 ఆగస్ట్ 8న, నేటి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లో జన్మించిన బాబా శివానంద్, ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అనంతరం గురువు ఓంకార్‌నాథ్ ఆశ్రయంలో ఆయన ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశించారు. అక్కడ నుంచే ఆయన జీవితం యోగ, త్యాగ మార్గంలో అడుగులు వేసింది.

బాబా శివానంద్‌ జీవితంలోని ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన ఒంటిపూట భోజనం, మూడింటికే మేల్కొని యోగ సాధన, తపోబలంతో కూడిన నియమిత జీవనశైలి. ఆయన్ను చూసినవారెవరైనా ఆశ్చర్యపోయేవారు, ఆయన ఆరోగ్యం, ఉల్లాసం, మనశ్శాంతి ఆయన నిత్య సాధనకు ప్రతిబింబంగా ఉండేవి.

ఆధ్యాత్మికత, యోగసంబంధ సేవలందించినందుకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో బాబా శివానంద్‌కు పద్మశ్రీ పురస్కారంను అందజేసింది. 125 ఏళ్లు దాటిన వయసులో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంటూ, పాదాభివందనం చేసి దేశవ్యాప్తంగా గౌరవం పొందారు.

Vanajeevi Ramaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత.. వనజీవి రామయ్య కన్నుమూత

Published date : 05 May 2025 03:57PM

Photo Stories