Skip to main content

Telangana: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు?

R Shoba IFS

తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌.శోభ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ హోదాలో ఆమె రెండేళ్లపాటు కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల అటవీశాఖల్లో ఇలాంటి నియామకం ఇదే తొలిసారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

మూడవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది?

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) చైర్మన్‌గా హస్ముఖ్‌ ఆధియా తిరిగి నామినేట్‌ అయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బీఓబీ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా తిరిగి నియమించాలన్న ఆర్థిక సేవల శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్‌ వ్యవహారాల కేంద్ర కమిటీ ఆమోదముద్ర వేసింది. దీనితో ఆయన పదవీకాలం 2022, మార్చి 1వ తేదీ నుంచి మరో రెండేళ్లు కొనసాగుతుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తర్వాత మూడవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా బీఓబీ ఉంది.

చ‌ద‌వండి: రాష్ట్ర నూతన పీసీసీఎఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమితులైన అధికారి?
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు    : ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఆర్‌.శోభ
ఎందుకు : తాజాగా తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) హోదాలో పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 Mar 2022 06:47PM

Photo Stories