Skip to main content

PD Singh: స్టాండర్డ్ చార్టర్డ్ ఇండియా సీఈఓగా పీడీ సింగ్

స్టాండర్డ్ చార్టర్డ్ ఇండియా సీఈఓగా ప్ర‌బ్‌దేవ్‌ సింగ్ నియ‌మితుల‌య్యారు.
Standard Chartered Appoints PD Singh as CEO for India

స్టాండర్డ్ చార్టర్డ్ ఇండియా సంస్థ.. పీడీ సింగ్‌ను తన తదుపరి ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO)గా నియమించింది. ఈ నియామకం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

  • జారిన్ దరువాలా స్థానంలో పీడీ సింగ్ బాధ్యతలు స్వీకరించ‌నున్నారు. దరువాలా మార్చి 31వ తేదీ పదవీ విరమణ చేయనున్నారు.
  • సింగ్‌కు బ్యాంకింగ్‌లో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్ భారతదేశ సీఈఓగా పనిచేసినప్పుడు, బ్యాంక్ యొక్క కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
  • జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌కు ముందు సింగ్ హెచ్ఎస్‌బీసీలో కార్పొరేట్, వాణిజ్య బ్యాంకింగ్ విభాగాలలో నాయకత్వ స్థానాల్లో పనిచేశారు. అక్కడ ఆయన దశాబ్దం కాలం పాటు పనిచేశారు.
  • స్టాండర్డ్ చార్టర్డ్ భారతదేశంలో 165 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఒక పురాతన బ్యాంకు. ప్రస్తుతం దీనికి దేశవ్యాప్తంగా 100 శాఖలు ఉన్నాయి.

High Court of Telangana: హైకోర్టులో ముగ్గురు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా

Published date : 19 Feb 2025 09:18AM

Photo Stories