Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్'లో.. ఇద్దరు మహిళా అధికారుల కీలక పాత్ర

ఈ దాడిలో పాకిస్తాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి పూర్తిగా నాశనం చేశారు. ఈ దాడిలో సుమారు 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.
ఇద్దరు మహిళా అధికారుల పాత్ర
ఈ ఆపరేషన్ గురించి దేశ ప్రజలకు సమాచారం అందించేందుకు భారత సైన్యం ఇద్దరు మహిళా అధికారులను మీడియా ముందు ప్రవేశపెట్టింది. వారిలో ఒకరు లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి (భారత సైన్యం), మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (భారత వైమానిక దళం). ఈ ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి ఆపరేషన్ విజయవంతంగా ఎలా జరిగిందో, పాక్ ఉగ్ర స్థావరాలు ఎలా ధ్వంసమయ్యాయో వివరించారు.
స్ఫూర్తిదాయక నాయకత్వం.. కల్నల్ సోఫియా ఖురేషి
కల్నల్ సోఫియా ఖురేషి భారత సైన్యంలో సీనియర్ స్థాయి మహిళా అధికారిణిగా సేవలందిస్తున్నారు. 2016లో పూణేలో జరిగిన అంతర్జాతీయ సైనిక విన్యాసం 'ఎక్సర్సైజ్ ఫోర్స్ 18'లో భారత్ తరఫున నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిణిగా ఆమె చరిత్రలో నిలిచారు. ఆ విన్యాసంలో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఆమె ఏకైక మహిళా కమాండర్ కావడం విశేషం. గుజరాత్కి చెందిన సోఫియా ఒక సైనిక కుటుంబంలో పుట్టి పెరిగారు.
Indian Army: దాడి గురించి ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసిన వీడియో వైరల్!
ఈసారి ఆమె ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఉగ్ర నిర్మాణాలపై విపులంగా వివరించారు. పాక్ మరియు పిఓకేలో మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, ఆయుధ నిల్వలు కొనసాగుతున్నాయని ఆమె గుర్తుచేశారు. భారత సైన్యం చేసిన ఈ చర్య అమాయక పౌరుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడికి తగిన బదులుగా నిలిచిందని పేర్కొన్నారు.
దాడి సమయం
కల్నల్ సోఫియా ఖురేషి ప్రకారం, ఈ దాడులు తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 గంటల మధ్యలో జరిగాయి. భారత్, పాక్ సైనిక శిబిరాలను టార్గెట్ చేయకుండా, కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని ఆమె స్పష్టం చేశారు. మొత్తం 21 స్థావరాలను గుర్తించినప్పటికీ, తొలి దశలో తొమ్మిది కీలక శిబిరాలపై దాడులు చేశారు.
ఆకాశంలో ఆదిశక్తి.. వ్యోమికా సింగ్
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళానికి చెందిన అనుభవజ్ఞులైన హెలికాప్టర్ పైలట్. చిన్నప్పటి నుంచే ఆమెకు వైమానిక దళంలో చేరాలన్న కోరిక ఉండేది. ఆమె ఇప్పటివరకు 2,500 గంటలకుపైగా విమాన ప్రయాణ అనుభవం కలిగి ఉన్నారు. ఆమె చీతా, చేతక్ హెలికాప్టర్లను ప్రయోగాత్మకంగా నడిపారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ వంటి అత్యంత క్లిష్ట భౌగోళిక ప్రాంతాల్లో సేవలందించారు.
నవంబర్ 2020లో ఆమె అరుణాచల్ ప్రదేశ్లో ప్రమాదకర పర్వత ప్రాంత రెస్క్యూ మిషన్లో నాయకత్వం వహించి పలు ప్రాణాలను కాపాడిన ఘనత ఆమెకు ఉంది. అలాంటి అనుభవం ఈసారి ఆపరేషన్ సింధూర్లో కూడా కీలకంగా పనిచేసింది.
Civil Defence Mock Drill: భారత్లో మాక్ డ్రిల్.. ఈ డ్రిల్లో చేసేది ఏమిటంటే..?