Skip to main content

Supreme Court: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్

భారతదేశ సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు.
 Justice BR Gavai as Next Chief Justice of India

ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 29వ తేదీ అధికారికంగా ఆమోదం తెలిపారు. జస్టిస్ గవాయ్ మే 14వ తేదీ అధికారికంగా సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13వ తేదీ పదవీ వివ‌ర‌మ‌ణ చేయ‌నున్నారు. 

జస్టిస్ గవాయ్ మహారాష్ట్రకు చెందిన వారు. ఆయన 2003లో మహారాష్ట్ర హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమించబడి, తన న్యాయ సేవను కొనసాగించారు. ఆయన 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

అత్యంత అనుభవం కలిగిన న్యాయమూర్తులలో ఒకరైన గవాయ్, న్యాయవ్యవస్థలో సమగ్రత, సామాజిక న్యాయం పై దృష్టి పెట్టే వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న గవాయ్, రానున్న ఆరు నెలల పాటు ఈ పదవిలో కొనసాగి, నవంబర్ 2025లో పదవీ విరమణ చేయనున్నారు.

Ramakrishna Rao: తెలంగాణ నూతన సీఎస్‌గా రామకృష్ణారావు

Published date : 30 Apr 2025 11:38AM

Photo Stories