Skip to main content

మే 2020 వ్యక్తులు

బజాజ్ ఆటో ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా అభినవ్ బింద్రా
Current Affairs
బజాజ్ ఆటో కంపెనీ అదనపు ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా నియమితులయ్యారు. 2020, మే 20 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని సంస్థ తెలిపింది. నానూ పమ్నాని మరణం తర్వాత ఇండిపెండెంట్ డెరైక్టర్ పదవి ఖాళీ ఉందని, ఈ నేపథ్యంలోనే బింద్రా నియమాకం జరిగిందని బజాజ్ ఆటో తన ఫైలింగులో పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ డెరైక్టర్లలో ఎవరితోనూ బింద్రాకు సంబంధం లేదని వెల్లడించింది.

నాసా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ చీఫ్ రాజీనామా
నాసా మానవ అంతరిక్ష విమానాల చీఫ్ డౌగ్ లోవెర్రో తన పదవికి రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అలాగే నాసా డిప్యూటీ అసొసియేట్ అడ్మినిస్ట్రేటర్, మాజీ వ్యోమగామి అయిన కెన్ బోవర్యాక్స్ ఆయన స్థానంలో తాత్కాలికంగా చీఫ్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని లోవెర్రో పేర్కొన్నారని వివరించింది. 2024 నాటికి వ్యోమగాములను చంద్రునిపైకి పంపాలన్న నాసా పరిశోధనలకు చీఫ్‌గా లవర్రో 2019, అక్టోబర్ నుండి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బజాజ్ ఆటో కంపెనీ అదనపు ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు: మే 21
ఎవరు: అభినవ్ బింద్రా

భారత హాకీ దిగ్గజం బల్బీర్ కన్నుమూత
భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్(96) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పంజాబ్‌లోని మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే 25న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి డెరైక్టర్ అభిజిత్ సింగ్ వెల్లడించారు.
అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు...
పంజాబ్‌లోని జలంధర్ జిల్లా హరిపూర్ ఖల్సా గ్రామంలో 1923, డిసెంబర్ 31న బల్బీర్ జన్మించాడు. ఒలింపిక్స్‌లలో భారత హాకీ జట్టు మూడు బంగారు పతకాలు(1948, 1952, 1956 ఒలింపిక్స్) సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ ఫైనల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా బల్బీర్ పేరిట ఉన్న రికార్డును ఇప్పటివరకు ఎవరు అధిగమించలేదు. 1952 ఒలింపిక్స్‌లో భారత్ 6-1తేడాతో నెదర్లాండ్‌‌సపై విజయం సాధించగా.. అందులో 5 గోల్స్ బల్బీర్ చేసినవే.
ఏకైక భారత అథ్లెట్...
ఆధునిక ఒలింపిక్ చరిత్రలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించిన 16 మంది దిగ్గజాలలో బల్బీర్ ఒకరు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా ఆయన గుర్తింపుపొందారు. బల్బీర్ తన కెరీర్‌లో 61 అంతర్జాతీయ క్యాప్స్‌తో పాటుగా.. 246 గోల్స్ సాధించాడు. 1975లో ప్రపంచ కప్ సాధించిన భారత హాకీ జట్టుకు కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహించారు. భారత హాకీకి బల్బీర్ చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే హాకీ ఇండియా.. 2015లో మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత హాకీ దిగ్గజం కన్నుమూత
ఎప్పుడు : మే 25
ఎవరు : బల్బీర్ సింగ్ సీనియర్(96)
ఎక్కడ : మొహాలీ, పంజాబ్
ఎందుకు : అనారోగ్యంతో

పాక్ మాజీ క్రికెటర్ ఉమర్‌కు కరోనా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ తౌఫిక్ ఉమర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. మే 23న అస్వస్థతకు గురి ఉండటంతో ఉమర్ కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాడు. పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చిందని... అయితే తనలో కరోనా లక్షణాలు తీవ్రంగా ఏమీ లేవని... ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని ఉమర్ వివరించాడు. 38 ఏళ్ల ఉమర్ పాకిస్తాన్ తరఫున 44 టెస్టులు ఆడి 2,963 పరుగులు... 12 వన్డేలు ఆడి 504 పరుగులు సాధించాడు. కోవిడ్-19 బారిన పడ్డ నాలుగో క్రికెటర్ ఉమర్. గతంలో మాజిద్ హక్ (స్కాట్లాండ్), జఫర్ సర్ఫరాజ్ (పాకిస్తాన్), సోలో ఎన్‌క్వెని (దక్షిణాఫ్రికా)లకు కరోనా సోకింది.
కేంద్రం అనుమతిస్తేనే ఐపీఎల్
2020, ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్ భవిష్యత్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలులేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాక... కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కరోనా బారినపడ్డ పాక్ మాజీ క్రికెటర్
ఎప్పుడు : మే 23
ఎవరు : తౌఫిక్ ఉమర్

భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మరోసారి వార్తల్లోకెక్కారు. న్యూస్‌హబ్ అనే టీవీ చానెల్‌కు ఆమె మే 25న ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనే రాజధానిలో భూకంపం సంభవించింది. అయినా సరే, ఏమాత్రం ఆందోళన చెందకుండా ఇంటర్వ్యూ కొనసాగించారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న జెసిండా ‘మాకు ఇక్కడ స్వల్ప భూకంపం వచ్చింది. నా వెనుక కొన్ని వస్తువులు కదులుతున్నట్లుగా ఉంది. నా తలపైన లైట్లేవీ వేలాడటం లేదు. ఈ భవనం కూడా సురక్షితంగానే ఉన్నట్లుంది. మేం క్షేమంగానే ఉన్నాం. ఇదిగో ఇప్పుడు ప్రకంపనలు ఆగిపోయాయి..’అని ఇంటర్వ్యూ చేస్తున్న రియాన్ బ్రిడ్జితో అన్నారు. మే 25న సంభవించిన ఈ భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని
ఎప్పుడు : మే 25
ఎవరు : న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్
ఎక్కడ : న్యూజిలాండ్

మోదీ పనితీరుకు అత్యధిక ప్రజాదరణ
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కనబరిచిన పని తీరు ఆయనకు ప్రజాదరణను మరింత పెంచింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన సర్వే, పరిశోధన సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ తెలిపింది. కరోనా కట్టడిపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నేతలు వ్యవహరించిన తీరుపై మార్నింగ్ కన్సల్ట్ సర్వే నిర్వహించింది. దేశాధినేతల పనితీరు విషయంలో ప్రజల ఆమోదం ఎలా ఉంది? వారి ఆదరణ పెరిగిందా? తగ్గిందా? 2020,మార్చి 17న పరిస్థితి ఎలా ఉంది? మే 19 నాటికి ఎంత మార్పు వచ్చింది? అన్న అంశాలను ఆ సంస్థ బేరీజు వేసింది.
మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం.. వివిధ దేశాధినేతలతో పోలిస్తే.. ప్రధాని మోదీ పనితీరుకు ఎక్కువ ప్రజామోదం లభించింది. 82 శాతంతో ఆయన మిగతా దేశాధినేతల కన్నా ముందున్నారు. మార్చి 17న అది 74 శాతం ఉండగా.. మే 19 నాటికి 82 శాతానికి చేరింది. మోదీ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ (66శాతం) ఉన్నారు.
Current Affairs

నాబార్డ్ చైర్మన్‌గా డాక్టర్ చింతల బాధ్యతల స్వీకరణ
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ చింతల గోవిందరాజులు మే 27న బెంగళూరులో పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చైర్మన్ డాక్టర్ హర్ష్ కుమార్ భన్వాలా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు రాజమండ్రికే చెందిన డాక్టర్ పీవీఎస్ సూర్యకుమార్ కూడా డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎంపికయ్యారు. డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్‌గా సూర్య కుమార్‌తో పాటు మరో డీఎండీ కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు చెందిన చింతల గోవింద రాజులు బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌ఐ)లో పీజీ పూర్తి చేశారు. 1985లో క్యాంపస్ సెలక్షన్స్ లో నాబార్డ్-బీ గ్రేడ్ ఆఫీసర్‌గా ఎంపికై న ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు: మే
ఎవరు: డాక్టర్ చింతల గోవిందరాజులు
ఎక్కడ: బెంగళూరు


ఇరాక్ నూతన ప్రధానమంత్రిగా ముస్తఫా ఖాదిమి
Current Affairs
ఇరాక్ నూతన ప్రధానమంత్రిగా ఆ దేశ ఇంటెలిజెన్స్ మాజీ అధ్యక్షుడు, మాజీ జర్నలిస్ట్ ముస్తఫా అల్-ఖాదిమిని మే 7న ఆ దేశ పార్లమెంటు ఎన్నుకుంది. అమెరికా దేశ మద్ధతుదారు అయిన ముస్తఫా ఖాదిమి గతంలో ఇరాక్ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఇరాక్ దేశ భద్రత, స్థిరత్వం, వికాసానికి తాను పనిచేస్తానని ఇరాక్ కొత్త ప్రధాని ముస్తఫా ఖాదిమి ట్వీట్ చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్‌పై పోరాటానికే తాను ప్రాధాన్యమిస్తామని ప్రకటించారు. వేలాది మంది ఇరాకీలు తమకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ గతంలో ఇరాక్ పాలకులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడంతో మాజీ ప్రధాని అబ్దుల్ మహదీ 2019, నవంబరులో తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి:ఇరాక్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నిక
ఎప్పుడు: మే 7
ఎవరు: ముస్తఫా అల్-ఖాదిమి

కోమాలోకి ఛత్తీస్‌గఢ్ మొదటి ముఖ్యమంత్రి అజిత్
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి (79) మే 10న కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని, వెంటిలేటర్‌పై ఉన్నారని వైద్యులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన మొదటి ముఖ్యమంత్రి (2000 నుంచి 2003 వరకు)గా పనిచేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి జేసీసీ(జే) అనే పార్టీని సొంతంగా ఏర్పాటుచేశారు. ప్రస్తుతం అయన మార్వాహి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోవైపు మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.

మాజీ మంత్రి జువ్వాడి కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు (92) కన్నుమూశారు. అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన మే 10న తుదిశ్వాస విడిచారు. 1999, 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గారం నుంచి ఎమ్మేల్యేగా జువ్వాడి గెలుపొందారు. వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2007-09 వరకు దేవాదాయ, స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కొనసాగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:కోమాలోకి ఛత్తీస్‌గఢ్ మొదటి ముఖ్యమంత్రి
ఎప్పుడు: మే 10
ఎవరు: అజిత్ జోగి
ఎందుకు: తీవ్ర అనారోగ్యంతో

పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఆనంద్
పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ (పరిపాలనాధికారి)గా ఒ.ఆనంద్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రస్తుతం పోలవరం స్పెషల్ ఆఫీసర్‌గా ఉండగా ఆ పదవిని రద్దు చేసి తాజా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మే 10న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లించడం, పునరావాస కాలనీల నిర్మాణం, కాలనీలకు నిర్వాసితులను తరలించడం తదితర పనులు చేస్తున్న వివిధ విభాగాలను సమన్వయం చేయడం, ఉత్పన్నమయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి ప్రక్రియను ఆన్‌ంద్ పూర్తి చేస్తారు. పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ విభాగాలు, సహాయ పునరావాస విభాగాలు, పునరావాస కాలనీల పనులు చేస్తున్న వివిధ ఇంజనీరింగ్ విభాగాలు అడ్మినిస్ట్రేటర్ పరిధిలోనే పనిచేస్తాయి. మరోవైపు స్పెషల్ కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఇ.మురళిని సాధారణ పరిపాలన విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియామకం
ఎప్పుడు: మే 10
ఎవరు: ఒ.ఆనంద్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మే 11న మహారాష్ట్ర విధాన మండలి (ఎంఎల్‌సీ)కి నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది స్థానాల కోసం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి అయిదుగురు, బీజేపీకి చెందిన నలుగురు ఇలా మొత్తంగా తొమ్మిది మంది బరిలో నిలిచారు. దీంతో విధాన మండలి ఎన్నికలు దాదాపు ఏకగ్రీవమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు మే 27వ తేదీ లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అనివార్యంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఉద్ధవ్ తన నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. తనకు రూ. 143 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో తెలిపారు.
మ్యాక్స్ బుపా సీఈఓగా కృష్ణన్ రామచంద్రన్
ఆరోగ్య బీమా కంపెనీ మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కు ఎండీ, సీఈఓగా కష్ణన్ రామచంద్రన్ నియమితులయ్యారు. భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన ఆరోగ్య బీమా సంస్థగా మ్యాక్స్ బుపాను కృష్ణన్ తీర్చిదిద్దగలరన్న ధీమాను కంపెనీ చైర్మన్ సీబీ భవే వ్యక్తం చేశారు. కష్ణన్‌కు
ఆరోగ్య బీమా, ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాల పరిశ్రమలో 23 ఏళ్ల విస్తారమైన అనుభవం ఉందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:మహారాష్ట్ర విధాన మండలి (ఎంఎల్‌సీ)కి నామినేషన్ దాఖలు
ఎప్పుడు: మే 11
ఎవరు: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే

జపాన్ బ్యాంక్ తొలి మహిళా డెరైక్టర్ గా టోకికో
సుమారు 138 ఏళ్ల తర్వాత జపాన్ సెంట్రల్ బ్యాంక్ కు తొలి మహిళా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గా టోకికో షిమిజు నియమితులయ్యారు. టోకికో 1987 నుంచి బ్యాంక్ ఆఫ్ జపాన్‌లో బ్యాంకు ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేగాక ఫైనాన్షియల్ మార్కెట్స్, విదేశీ మారక కార్యకలాపాలను కూడా ఆమె చూసుకునేవారు. అనంతరం 2016 నుంచి 2018 మధ్య లండన్ ప్రధాన ప్రతినిధిగా ఐరోపాకు జనరల్ మేనేజర్‌గా వ్యవహరించారు. జపాన్ సెంట్రల్ బ్యాంక్‌లో మహిళ ఉద్యోగులు 47శాతం ఉండగా.. సీనియర్ మేనేజిరియల్ పోస్టులలో కేవలం 13శాతం, న్యాయ వ్యవహారాలు, చెల్లింపు వ్యవస్థలు, బ్యాంక్ నోట్లతో వ్యవహరించే నిపుణుల స్థానాల్లో కేవలం 20శాతం మాత్రమే మహిళా ఉద్యోగులు ఉన్నారు. జపాన్ జనాభాలో మహిళలు 51 శాతం ఉండగా.. 2018 ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. ప్రపంచ ఆర్థిక ఫోరం తాజా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో 153 దేశాలలో జపాన్ 121వ స్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జపాన్ సెంట్రల్ బ్యాంక్ కు తొలి మహిళా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గా నియామకం
ఎప్పుడు: మే 11
ఎవరు: టోకికో షిమిజు

కరోనాతో సుమో రెజ్లర్ షోబుషి మృతి
కరోనా మహమ్మారి కారణంగా జపాన్ యువ సుమో రెజ్లర్ తనువు చాలించాడు. భారీకాయం తో ప్రేక్షకుల్ని అలరించే పురాతన క్రీడ అయిన సుమో రెజ్లింగ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న 28 ఏళ్ల షోబుషి... నెలరోజుల పాటు కరోనాతో పోరాడి మే 13న కన్నుమూశాడు. టోక్యోలోని ‘టకడగవా సుమో స్టేబుల్’కు చెందిన షోబుషి వైరస్ దాడి కారణంగా శరీరంలోని అవయవాలు పనిచేయడం మానేయడంతో మృత్యువాత పడ్డాడు. 2007లో షోబుషి ప్రొఫెషనల్ సుమో పోటీల్లో పాల్గొన్నాడు. కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్‌‌సలో అతను 11వ స్థానంలో నిలిచాడు. జపాన్‌లో పెద్ద సంఖ్యలో సుమో రెజ్లర్లు, మాస్టర్లు కరోనా బారిన పడిన నేపథ్యంలో 2020, మే నెలలో జరగాల్సిన ‘బాషో’ టోర్నీలు రద్దయ్యాయి. 2011లో ఫిక్సింగ్ ఉదంతం తర్వాత టోర్నీలు రద్దు కావడం ఇదే మొదటిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి:జపాన్ సుమో రెజ్లర్ మృతి
ఎప్పుడు: మే 13
ఎవరు: షోబుషి(28)
ఎందుకు: కరోనా మహమ్మారి కారణంగా

రష్యా ప్రధాని మిషుస్టిన్‌కు కరోనా వైరస్
Current Affairs
రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ కరోనా బారిన పడ్డారు. పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందనీ, స్వీయ నిర్బంధంలో ఉంటానని ఏప్రిల్ 30న ప్రకటించారు. కీలక అంశాల్లో అందుబాటులో ఉంటానని, ఈ మేరకు అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం ఇచ్చానని వెల్లడించారు. రష్యాలో సాధారణంగా ఆర్థికపరమైన నిర్ణయాలను ప్రధానమంత్రి తీసుకుంటూ అధ్యక్షుడికి జవాబుదారీగా ఉంటారు. మిషుస్తిన్ 2020, ఏడాది జనవరిలోనే రష్యా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు రష్యాలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటగా 1073 మంది మృత్యువాతపడ్డారు. ఏప్రిల్ 1న మూడు వేలుగా ఉన్న కేసుల సంఖ్య మే1 నాటికి లక్ష చేరడం ఆందోళన కలిగిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రష్యా ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్
ఎప్పుడు: ఏప్రిల్ 30
ఎవరు: మిఖాయిల్ మిషుస్టిన్

భారత ఫుట్‌బాల్ దిగ్గజం గోస్వామి ఇక లేరు
భారత విఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు చునీ గోస్వామి కన్నుమూశారు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 82 ఏళ్ల మాజీ సారథి కోల్‌కతాలో ఏప్రిల్ 30న తుదిశ్వాస విడిచారు. బెంగాల్ ప్రెసిడెన్సీలోని కిశోర్‌గంజ్(ప్రస్తుతం బంగ్లాదేశ్)లో 1938, జనవరి 15న గోస్వామి జన్మించాడు. గోస్వామి సారథ్యంలోని జాతీయ ఫుట్‌బాల్ జట్టు 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 1964 ఆసియా కప్‌లో రజతం గెలిచింది. 1956 నుంచి 1964 మధ్య కాలంలో 50 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 13 గోల్స్ చేసిన గోస్వామి 1960 రోమ్ ఒలింపిక్స్‌లో దేశం తరపున ప్రాతినిథ్యం వహించాడు. 1962లో అతను ఆసియా ఉత్తమ స్టైక్రర్ అవార్డు అందుకున్నాడు. భారత ప్రభుత్వం ఆయన్ను అర్జున అవార్డు (1963), పద్మశ్రీ (1983) పురస్కారాలతో గౌరవించింది. 1968లో ఆటకు వీడ్కోలు పలికేంత వరకూ అతను కేవలం మోహన్ బగాన్ క్లబ్ తరపున మాత్రమే ఆడాడు.
గోస్వామి మేటి ఫుట్‌బాలరే కాదు... క్రికెటర్ కూడా! బెంగాల్ తరపున 1962 నుంచి 1973 మధ్యలో 46 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడాడు. 1971-72 సీజన్‌లో చునీ బెంగాల్ రంజీ జట్టుకు సారథ్యం వహించగా... జట్టు ఫైనల్లోకి చేరింది. తుదిపోరులో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో తృప్తిపడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత విఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు కన్నుమూత
ఎప్పుడు: ఏప్రిల్ 30
ఎవరు: చునీ గోస్వామి
ఎక్కడ: కోల్‌కతా
ఎందుకు: అనారోగ్య సమస్యలతో

ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్‌గా జాక్వెలీన్ హ్యూగ్స్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) కొత్త డెరైక్టర్ జనరల్‌గా డాక్టర్ జాక్వెలిన్ డీ అరోస్ హ్యూగ్స్ ఏప్రిల్ 30న బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్‌కు చెందిన హ్యూగ్‌‌స మైక్రో బయాలజీ, వైరాలజీల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1990లలో కోకో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసేందుకు ఆఫ్రికాలోని ఘనా దేశానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి నైజీరియాలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అగ్రికల్చర్‌లో కొంతకాలం పనిచేశారు.
తైవాన్‌లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్‌గా పనిచేసిన హ్యూగ్‌‌స, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోనూ అదే హోదాలో పనిచేశారు. తాజాగా రైస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇక్రిశాట్‌కు మారారు. ప్రయాణాలపై నిషేధమున్న నేపథ్యంలో హ్యూగ్‌‌స ఫిలిప్పీన్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్రిశాట్ బాధ్యతలు చేపట్టడమే కాకుండా.. తన ప్రాథమ్యాల గురించి వివరించారు. కరోనా విషయంలో ఇక్రిశాట్ ఎక్కడ అవసరమైతే అక్కడ సాయం అందించాలని హ్యూగ్‌‌స స్పష్టంచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇక్రిశాట్ కొత్త డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు: ఏప్రిల్ 30
ఎవరు: డాక్టర్ జాక్వెలిన్ డీ అరోస్ హ్యూగ్‌‌స

పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్‌కు కరోనా
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ కై జర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఏప్రిల్ 30న నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖురేషీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. ఇదిలావుండగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కరోనా భయం వెంటాడుతోంది. కరోనా పాజిటివ్‌గా తేలిన అసద్.. రెండు రోజుల క్రితం ఇమ్రాన్ కలవడం దీనికి కారణం. దీంతో ముందస్తు జాగ్రత్తంగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పాకిస్తాన్‌లో 16,353 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా బారిన పడ్డ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్
ఎప్పుడు: ఏప్రిల్ 30
ఎవరు: అసద్ కై జర్

ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్ మే 1న బాధ్యతలను స్వీకరించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న నేపథ్యంలో తరుణ్ బజాజ్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఇంతక్రితం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన అతను చక్రవర్తి స్థానంలో తరుణ్ బజాజ్ నియమితులయ్యారు. ఆర్థిక శాఖతో ఆయనకు పూర్వ అనుభవం ఉంది. 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన బజాజ్, 2015లో ప్రధాని కార్యాలయంలో చేరడానికి ముందు ఆర్థిక వ్యవహారాల శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.
హెచ్‌ఎంఎస్‌ఐ చీఫ్‌గా అత్సుషి ఒగాటా
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రెసిడెంట్, సీఈవో, ఎండీగా అత్సుషి ఒగాటాను మాతృ సంస్థ హోండా మోటార్ కంపెనీ నియమించింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న మినోరు కటు తిరిగి హోండా మోటార్ కంపెనీలో ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్ పదవి చేపట్టనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు: మే 1
ఎవరు: తరుణ్ బజాజ్

ఏపీ హైకోర్టులో ముగ్గురు జడ్జిల నియామకం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు బొప్పూడి కష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారిలు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మే 1న ఆమోదముద్ర వేస్తూ నియామక ఉత్తర్వులిచ్చారు. దీంతో వీరి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి మే 2న ప్రమాణం చేయించారు. ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీ హైకోర్టులో ముగ్గురు జడ్జిల ప్రమాణం
ఎప్పుడు: మే 2
ఎవరు: న్యాయవాదులు బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారి

మిధాని నూతన సీఎండీగా సంజయ్ కుమార్ ఝా
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ రంగ సంస్థ మిశ్ర ధాతూ నిగమ్ (మిధాని) నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా డాక్టర్ సంజయ్ కుమార్ ఝా మే 1న పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన మిధానిలోనే ఉత్పత్తి, మార్కెటింగ్ విభాగపు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. లోహశాస్త్ర ఇంజనీరింగ్‌లో బీఎస్సీ (1988) తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో చేరిన అనంతరం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్న న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్‌లో చేరారు. అణు ఇంధనాల తయారీ విషయంలో పలు సాంకేతిక సృజనలు చేశారు. అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించే పీఎస్‌ఎల్వీ రాకెట్‌కు అవసరమైన కీలక విడి భాగాలను కూడా తయారు చేశారు. న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్‌లో అందించిన సేవలకు పలు అవార్డులు పొందారు. 2006లో కేంద్ర అణు శక్తి విభాగం సంజయ్ కుమార్‌ను ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డుతో సత్కరించింది. ఇదే విభాగం నుంచి ఐదుసార్లు గ్రూపు అవార్డులు కూడా పొందిన ఆయన 2016లో మిధానిలో చేరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మిశ్ర ధాతూ నిగమ్ (మిధాని) నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు: మే 1
ఎవరు: డాక్టర్ సంజయ్ కుమార్ ఝా

కరోనాతో లోక్‌పాల్ సభ్యుడు త్రిపాఠీ కన్నుమూత
లోక్‌పాల్ సభ్యుడు జస్టిస్(రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) కరోనా వైరస్ సోకి చనిపోయారు. కోవిడ్‌తో చికిత్స పొందుతూ ఎయిమ్స్‌లో మే 2న కన్నుమూశారని అధికారులు తెలిపారు. 1957 నవంబర్ 12న జన్మించిన త్రిపాఠి.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎకనమిక్స్ చదివారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 1981లో పట్నా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. బిహార్ అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా పని చేసిన ఏకే త్రిపాఠి.. పాట్నా హైకోర్ట్ అడిషనల్ జడ్జిగానూ సేవలు అందించారు. 2018లో జులైలో ఛత్తీస్‌గఢ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అవినీతి వ్యతిరేక స్వతంత్ర సంస్థ అయిన ‘లోక్‌పాల్’లోని నలుగురు జ్యుడీషియల్ సభ్యుల్లో ఒకరిగా.. 2019 మార్చి 23న నియమితులయ్యారు.

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బొల్లంపల్లి విజయ్‌సేన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో మే 2న జరిగిన కార్యక్రమంలో ఆయన చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తితో కలిపి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది. మరో పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజయసేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఆయన తండ్రి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు.

ప్రముఖ కన్నడ సాహితీవేత్త నిస్సార్ కన్నుమూత
ప్రముఖ కన్నడ సాహితీవేత్త, నిత్యోత్సవ కవిగా పేరొందిన కె.ఎస్ నిస్సార్ అహ్మద్ (84) కన్నుమూశారు. వయోభారంతోపాటు కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని నివాసంలో మే 3న తుదిశ్వాస విడిచారు. అధ్యాపకుడిగా వత్తిని ఆరంభించిన నిస్సార్ 1978లో ‘నిత్యోత్సవ’ పేరిట తొలి పాటల క్యాసెట్‌ను విడుదల చేశారు. సాహిత్యం ద్వారా పలు జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. కర్ణాటక సాహిత్య అకాడమీ, కెంపేగౌడ పురస్కారం, రాజ్యోత్సవ పురస్కారం, అరసు వంటి పురస్కారాలు పొందారు. పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన నిసార్ అహ్మద్ 73వ కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడిగా వ్యవహరించారు.

సైయంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఫెలిస్
టెక్నాలజీ సర్వీసెస్, సొల్యూషన్స్ కంపెనీ సైయంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ జనరల్ కౌన్సిల్‌గా ఫెలిస్ గ్రే కెంప్ నియమితులయ్యారు. కార్పొరేట్ లావాదేవీల్లో ఆమె వ్యూహాత్మక మార్గదర్శకత్వం వహిస్తారని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ కమర్షియల్ లా విభాగంలో ఆమెకు అపార అనుభవం ఉంది. ఫెలిస్ ఇప్పటి వరకు ఆమె స్థాపించిన యూనికార్‌న్స్ ఎల్‌ఎల్‌సీ చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా పనిచేశారు.

హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూ హతం
ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్రవాది, ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూ (32) చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే మే6న హతమయ్యాడు. కశ్మీర్లోని అతడి సొంత గ్రామంలోనే నైకూను మట్టుబెట్టడం గమనార్హం. మే 5 నుంచి సాగిన ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. అందులో ఒకటి దక్షిణ కశ్మీర్‌లోని షార్షవల్లి కాగా, రెండోది అవంతిపొరలోని బీగ్ పొర. రెండు చోట్లా ఇద్దరు చొప్పున ఉగ్రవాదులు మరణించారు. అవంతిపొర ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నైకూను మట్టుబెట్టారు.
మొదట్లో లెక్కల టీచర్‌గా..
మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ హతం
ఎప్పుడు: మే 6
ఎవరు: రియాజ్ నైకూ (32)
ఎక్కడ: అవంతిపొర ప్రాంతం, జమ్మూ కశ్మీర్

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపక్ గుప్తా పదవీ విరమణ
మూడేళ్లకు పైగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ దీపక్ గుప్తా మే 6న పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జస్టిస్ దీపక్ గుప్తా పలు కీలక తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మైనర్ భార్యతో శంగారం, ఆమె అనుమతి ఉన్నా.. రేప్ కిందకే వస్తుందని ఇచ్చిన తీర్పు, జైళ్ల సంస్కరణల తీర్పు, వాయు కాలుష్యంపై ఇచ్చిన తీర్పు మొదలైనవి వాటిలో ఉన్నాయి. పదవీ విరమణ సందర్భంగా జస్టిస్ గుప్తా మాట్లాడుతూ.. లాయర్‌గా, జడ్జిగా 42 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయవ్యవస్థ సమగ్రతకు నష్టం వాటిల్లకుండా చూడాలని వ్యాఖ్యానించారు. ఉష్ట్రపక్షిలా తల దాపెట్టుకుని, న్యాయవ్యవస్థలో అంతా బావుందని అనుకోవడం సరికాదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సుప్రీంకోర్టు జడ్జి పదవీ విరమణ
ఎప్పుడు: మే 6
ఎవరు: జస్టిస్ దీపక్ గుప్తా

పాకిస్తాన్ వాయుసేనలో తొలి హిందూ పైలట్
దాయాది దేశం పాకిస్తాన్ వాయుసేన (పీఏఎఫ్)లో తొలిసారి ఒక హిందూ యువకుడు జనరల్ డ్యూటీ పైలట్ ఆఫీసర్‌గా నియమితులయ్యాడు. సింధ్ ప్రావిన్స్ లోని థార్పార్కర్ జిల్లాకి చెందిన రాహుల్ దేవ్ అనే యువకుడిని డ్యూటీ పైలట్ ఆఫీసర్‌గా నియమించినట్లు పీఏఎఫ్ తెలిపింది. వెనకబడిన ప్రాంతమైన ఈ జిల్లాలో హిందువులు అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. పాక్ సైన్యం, పౌర సేవల రంగాల్లో ఇప్పటికే మైనారిటీ వర్గాలకు చెందినవారు పలువురు ఉద్యోగులుగా ఉన్నారు. పాకిస్తాన్ చరిత్రలోనే తొలిసారిగా పీఏఎఫ్‌లో ఓ హిందూ యువకుడు జనరల్ డ్యూటీ పైలట్ అధికారిగా నియమితులయ్యారని పాక్ అధికారిక రేడియో మే 6న ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పాకిస్తాన్ వాయుసేనలో తొలి హిందూ పైలట్
ఎప్పుడు: మే 6
ఎవరు: రాహుల్ దేవ్
Published date : 23 May 2020 01:02PM

Photo Stories