Skip to main content

Dr Sreehari Rao: ఏపీ నూతన వైద్య మండలి చైర్మన్‌గా డాక్టర్‌ శ్రీహరిరావు

ఆంధ్రప్రదేశ్ నూతన వైద్య మండలి చైర్మన్‌గా డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మే 7వ తేదీన విజయవాడలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
Sreehari Rao becomes Chairman of AP Medical Council   Dr. Daggumati Srihari Rao taking charge as Chairman of Andhra Pradesh Medical Council

అలాగే.. వైస్-ఛైర్మన్‌గా పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల ప్రొఫెసర్ గోగినేని సుజాతతో పాటు, డాక్టర్ కె.వి.సుబ్బానాయుడు (పల్మనాలజీ, ఒంగోలు), డాక్టర్ స్వర్ణగీత (గైనకాలజీ, ప్రకాశం జిల్లా), ఎస్. కేశవరావు బాబు (ఐఎంఏ డయాబెటాలజీ వింగ్ ప్రెసిడెంట్, విజయవాడ), మరియు డాక్టర్ సి.మల్లీశ్వరి (భీమవరం) ఇటీవలే వైద్య మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. వైద్య విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలు అందించే విధానాన్ని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్‌లో యూనివర్సిటీ, కాలేజీ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ పురస్కారాలను అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Ramakrishna Rao: తెలంగాణ నూతన సీఎస్‌గా రామకృష్ణారావు

Published date : 08 May 2025 12:34PM

Photo Stories