Skip to main content

Mann Ki Baat: ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
PM Narendra Modi Shares Tips To Combat Obesity In Mann Ki Baat

అంతరిక్షం నుంచి క్రీడల దాకా పలు అంశాలను ప్రస్తావించారు.  
 
స్థూలకాయ సమస్యపై చర్చ: దేశంలో స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తంచేశారు. పలు పరిశోధనల ప్రకారం, ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారని తెలిపారు. చిన్నారుల్లో ఈ సమస్య పెరిగిపోవడం ఆందోళనకరమని చెప్పారు. ఈ నేపథ్యంలో, వంటనూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని ప్రజలకు సూచించారు.

మహిళల స్ఫూర్తి: భారత్‌లో మహిళలు అనేక రంగాల్లో విజయాలు సాధిస్తున్నారని, ఈ స్ఫూర్తిని గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియా ఖాతాలను మహిళా విజేతలకు అప్పగిస్తానని చెప్పారు.

ఇస్రో సెంచరీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 100వ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా, భారతదేశం అంతరిక్ష పరిశోధనలో ఓ కొత్త మైలురాయిని చేరినట్లైందని చెప్పారు.

జంతుజాలం పరిరక్షణ: జింక మహిళ అనూరాధ రావు గురించి మాట్లాడుతూ, ఆమె జంతువుల సంరక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావించారు. వచ్చే నెలలో 'వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే' సందర్భంగా, జంతుజాల పరిరక్షణకు అంకితమైన వారిని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

PM Modi: దేశానికి ప్రపంచస్థాయి నాయకులు అవసరం.. ‘సోల్‌’ సదస్సులో ప్రధాని మోదీ

Published date : 25 Feb 2025 10:37AM

Photo Stories