PM Modi: ఉద్యోగాలు పొందిన యువతకు నియామక పత్రాలు అందజేత

ఏప్రిల్ 26వ తేదీ జరిగిన 15వ విడత రోజ్గార్ మేళాలో భాగంగా, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా నియమితులైన 51,000 ఉద్యోగార్థులకు ప్రధాని వర్చువల్గా నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, యువతకు ప్రతి రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
ప్రధానమంత్రి పేర్కొన్నట్లుగా, భారత్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా గుర్తించిందని చెప్పారు. ముఖ్యంగా ఆటోమొబైల్, ఫుట్వేర్ పరిశ్రమలు ఉత్పత్తిలోనూ, ఎగుమతుల పరంగా కూడా నూతన రికార్డులను నెలకొల్పాయని, ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగాయని మోదీ వివరించారు.
PM Modi: పాత విధానాలకు గుడ్బై.. సివిల్ సర్విసెస్ డే కార్యక్రమంలో ప్రధాని మోదీ
గత ప్రభుత్వాల కాలంతో పోలిస్తే, ఎన్నో రంగాల్లో మౌలిక మార్పులు జరిగాయని ఆయన చెప్పారు. ఉదాహరణకు, నదీజలాల ద్వారా సరకు రవాణా 2014కి ముందు సంవత్సరానికి కేవలం 1.8 కోట్ల టన్నులు మాత్రమే కాగా, ఇప్పుడు అది 15.5 కోట్ల టన్నులకు పెరిగిందని తెలిపారు. నదీ మార్గాల సంఖ్య కూడా 5 నుంచి 110కి పెరిగిందని, రాకపోకలు జరిగే మార్గాల పొడవు 2,700 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్లకు విస్తరించిందని వివరించారు.
మహిళల పాత్ర ప్రతీ రంగంలోనూ పెరుగుతున్నదని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాజా యూపీఎస్సీ తుది ఫలితాల్లో టాప్ 5 ర్యాంకర్లలో ముగ్గురు మహిళలే కావడం గర్వకారణమన్నారు. త్వరలో ముంబైలో జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) భారత యువతకు తమ డిజిటల్ నైపుణ్యాలు ప్రపంచ వేదికపై చూపించేందుకు గొప్ప అవకాశమని పేర్కొన్నారు.
PM Modi: హరియాణాలో ప్రధాని మోదీ ఏప్రిల్ 14న శంకుస్థాపన చేసినవివే..