Skip to main content

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌కు భారత్ ఎంచుకున్న‌ 9 ఉగ్రవాద శిబిరాలు ఇవే..

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
Indian Army, Air Force, and Navy in joint operation   Operation Sindoor: Full List of 9 Terror Camps Targeted by Indian Army in Pakistan and PoK

ఈ దారుణ ఘటనకు ప్రతీకారంగా మే 7వ తేదీ తెల్లవారుజామున భారత్‌ “ఆపరేషన్ సిందూర్” పేరుతో ఒక కీలక దాడి చేపట్టింది. ఈ దాడుల్లో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా పాల్గొన్నాయి.

ఈ దాడుల్లో ముఖ్యంగా భారత్‌పై దాడులు నిర్వహిస్తున్న లష్కరే తోయిబా (LeT), జైషే మహ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ (HM)లకు చెందిన శిక్షణా కేంద్రాలే లక్ష్యంగా మారాయి. మొత్తం 9 ఉగ్ర శిబిరాలు ఖచ్చితంగా ధ్వంసం చేయబడ్డాయి.

లక్ష్యంగా ఎంచుకున్న 9 ఉగ్ర స్థావరాలు ఇవే..

స్థలం వివరణ
1. బహావల్పూర్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో. జైషే మొహమ్మద్ ప్రధాన కేంద్రం.
2. మురిద్కే సాంబా ఎదురుగా, సరిహద్దుకు 30 కిమీ దూరంలో. లష్కరే తోయిబా శిక్షణా శిబిరం.
3. గుల్పూర్ పూంచ్-రాజౌరి ప్రాంతంలో LOCకు 35 కిమీ దూరంలో. ఉగ్రవాదుల అడ్డాగా మారిన ప్రదేశం.
4. సవాయ్ తంగ్‌ధార్ సెక్టార్‌లో POKలోకి 30 కిమీ లోపల. లష్కరే తోయిబా ప్రారంభ దాడుల కేంద్రం.
5. బిలాల్ క్యాంప్ జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాచరణ స్థావరం.
6. కోట్లీ క్యాంప్ రాజౌరి ఎదురుగా LOCకు 15 కిమీ దూరంలో. లష్కరే తోయిబా శిబిరం.
7. బర్నాలా క్యాంప్ రాజౌరి ఎదురుగా LOCకు 10 కిమీ దూరంలో. వ్యూహాత్మక ఉగ్రవాద స్థావరం.
8. సర్జాల్ క్యాంప్ సాంబా-కథువా ప్రాంతం ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8 కిమీ దూరంలో. జైషే మోహమ్మద్ కార్యకలాపాల స్థావరం.
9. మేమూనా క్యాంప్ సియాల్‌కోట్ సమీపంలో IBకి 15 కిమీ దూరంలో. హిజ్‌బుల్ ముజాహిద్దీన్ శిక్షణా కేంద్రం.

 

Published date : 08 May 2025 09:00AM

Photo Stories