5G services: 5జీ సేవలను ప్రారంభించిన మోదీ
Sakshi Education

దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. దేశంలో 5జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా ప్రారంభించారు. 5జీ సేవలు తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో ప్రారంభమై.. వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో భాగంగా అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్నగర్, కోల్కతా, లఖ్నవూ, ముంబయి, పుణె నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 14 Oct 2022 04:46PM