ఏప్రిల్ 2020 జాతీయం

రోజుకు వెయ్యి పరీక్షల సామర్థ్యం
మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్స్ లేబరేటరీ అభివద్ధిలో ఈఎస్ఐసీతో కలిసి డీఆర్డీవో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) కీలకపాత్ర పోషించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారైన ఈ వ్యాన్లలో బయోసేఫ్టీ లెవెల్ (బీఎస్ఎల్) -2, లెవెల్ -3 కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఇందులో అన్ని ఎలక్టాన్రిక్ కంట్రోలర్లతోపాటు కంప్యూటర్ నెట్వర్క్కు అవసరమైన ల్యాన్, టెలిఫోన్, సీసీటీవీలు ఉన్నాయి. దేశంలోనే తొలిదైన ఈ మొబైల్ ల్యాబ్లో వైరస్ను, దానికి మందులను గుర్తించేందుకు, అందుకు వీలుగా వైరస్ను పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది.
ఎక్కడైనా ఏర్పాటు..
రోగ నిరోధక వ్యవస్థ స్వరూప స్వభావాలను అర్థం చేసుకునేందుకు కావాల్సిన పరీక్షలూ నిర్వహించవచ్చు. కరోనా టీకా అభివృద్ధి, వైరస్ కల్చర్, డ్రగ్ స్కీన్రింగ్, వ్యాక్సిన్ డెవలప్మెంట్, ప్లాస్మా థెరపీ, ఇమ్యూన్ ప్రొఫైలింగ్ పరీక్షలతో పాటు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంది. అవసరాన్ని బట్టి దీన్ని దేశంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. రోజుకు సగటున వెయి్య పరీక్షలు చేయవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్స్ లేబొరేటరీ (ఎంవీఆర్డీఎల్) ప్రారంభం
ఎప్పుడు: ఏప్రిల్ 23
ఎవరు: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్
ఎందుకు: కరోనా పరీక్షల నిర్వహణకు
ఢిల్లీ ఐఐటీ కరోనా కిట్కు ఐసీఎంఆర్ ఆమోదం
కేవలం వందల రూపాయల ఖర్చుతో తయారయ్యే ‘కోవిడ్-19 డిటెక్షన్ కిట్’ను దేశీయ టెక్నాలజీతో ఢిల్లీ ఐఐటీ రూపొందించింది. దీనిని వైద్య పరిశోధనలో అత్యున్నత పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదించింది. కోవిడ్ను గుర్తించడంలో ఈ కిట్ వంద శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) ఆధారితంగా ఈ పరికరం పనిచేస్తుంది. సరైన పారిశ్రామిక భాగస్వామి దొరికితే వారం పది రోజుల్లో ఈ కిట్ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఢిల్లీ ఐఐటీ సన్నాహాలు చేస్తోంది.
తక్కువ ధరలో అందుబాటులోకి..
కరోనా జన్యుక్రమంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో బలహీనమైన ఆర్ఎన్ఏ క్రమాలను గుర్తించారు. ఈ అంశం కోవిడ్-19ను గుర్తుపట్టడంలో కీలకంగా మారడంతో పీసీఆర్ ఆధారంగా కిట్ను రూపొందించారు. 2020, జనవరి నుంచి తక్కువ ఖర్చుతో తయారయ్యే పరికరాన్ని రూపొందించడంపై ఢిల్లీ ఐఐటీ బందం దృష్టి సారించింది. ఈ పరికరాన్ని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే ధర కూడా తగ్గే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఐఐటీ నిధులతో రూపొందించిన ఈ పరికరంపై పేటెంట్ కోసం పరిశోధక బృందం దరఖాస్తు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఢిల్లీ ఐఐటీ కోవిడ్-19 డిటెక్షన్ కిట్కు ఆమోదం
ఎప్పుడు: ఏప్రిల్ 24
ఎవరు: ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)
తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బందాలను(ఐఎంసీటీ) పంపుతున్నట్టు కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 24న ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘విపత్తు నిర్వహణ చట్టం-2005’ నిబంధనలను అనుసరించి ఈ బృందాలను ఏర్పాటు చేశారు. గుజరాత్కు రెండు, తెలంగాణకు ఒకటి, తమిళనాడుకు ఒకటి, మహారాష్ట్రకు ఒకటి చొప్పున ఈ బందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. దేశంలో అతిపెద్ద కరోనా హాట్స్పాట్ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బృందాలు(ఐఎంసీటీ)
ఎప్పుడు: ఏప్రిల్ 24
ఎవరు: కేంద్ర హోం శాఖ
ఎక్కడ: తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర
ఎందుకు: కరోనా వైరస్పై పరిస్థితిని అంచనా వేసేందుకు
ఈ- గ్రామ స్వరాజ్ పోర్టల్ ప్రారంభం
స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించాలనే పెద్ద పాఠాన్ని కరోనా మహమ్మారి మనకు నేర్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం లేదని తెలియజేసిందన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో గ్రామీణ భారతం చూపిన పట్టుదల, తెగువ ప్రశంసనీయమన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24న దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు తమ అవసరాలను తామే సమకూర్చుకునే దిశగా స్వయం సమద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ- గ్రామ స్వరాజ్..
పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ఏకీకృత ‘ఈ- గ్రామ స్వరాజ్’ పోర్టల్ను, మొబైల్ అప్లికేషన్ను, స్వమిత్వ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ- ‘గ్రామ స్వరాజ్’పోర్టల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేసేందుకు సహాయపడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఈ- గ్రామ స్వరాజ్ పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు: ఏప్రిల్ 24
ఎవరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేసేందుకు
మే 15 నాటికి 38,220 మరణాలు?
దేశంలో కరోనా బాధితుల మరణాలు, కేసులు భారీగా పెరగనున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నాయి ప్రముఖ సంస్థలు. మే 15వ తేదీ నాటి కల్లా కరోనా వైరస్తో మరణించే వారి సంఖ్య 38,220కు చేరుకుంటుందని, మొత్తం కేసులు 30 లక్షలకు చేరుకోనుందని ఇవి అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు 76 వేల ఐసీయూ బెడ్లు అవసరం ఉంటాయని లెక్కలు తేల్చాయి. ఇప్పటి వరకు ఇటలీ, న్యూయార్క్ల్లో కరోనా మరణాలు, కేసులపై వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయని తెలిపాయి. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రీసెర్చి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు), ఐఐటీ బోంబే, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ(పుణె)ఈ మేరకు ‘కోవిడ్-19 మెడ్ ఇన్వెంటరీ’ పేరుతో ఈ అంచనాలు రూపొందించాయి.
ప్లాస్మా థెరపీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి
రాష్ట్రంలో ప్లాస్మాథెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించేం దుకు కేంద్రం అనుమతిచ్చిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఏప్రిల్ 24న వెల్లడించారు. 4రోజుల కింద ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అను మతినివ్వాలని కేంద్రాన్ని కోరగా, తాజాగా అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రోగుల్లో బాగా సీరియస్గా ఉన్నవారికి ఈ విధానం ద్వారా చికిత్స చేస్తామన్నారు.
అనంతపురంలో రెండు భారీ పరిశ్రమలు
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో మరో రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. గత కొన్నేళ్లుగా వీటికి అడ్డంకిగా ఉన్న జీవోను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఇది సాధ్యపడింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్టిక్రల్ బస్ యూనిట్తో పాటు ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కు నిర్మాణాలు ప్రారంభం అయ్యేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా ఉత్తర్వులతో వీర్వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో 120 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. అలాగే ఏపీఐఐసీ భాగస్వామ్యంతో 246.06 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్టాన్రిక్స్ పార్క్కు కూడా అడ్డంకులు తొలిగాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్, ఏపీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కు సంస్థలు ఏర్పాటు
ఎప్పుడు: ఏప్రిల్ 25
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్
భారత్లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి
కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ను వచ్చే రెండు మూడు వారాల్లో అభివద్ధి చేస్తామని, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ను భారత్లో తాము ఉత్పత్తి చేస్తామని మహారాష్ట్రలోని పుణేకు చెందిన ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ఏప్రిల్ 26న ప్రకటించింది. ఈ సంస్థ ఆక్స్ఫర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం కలిగి ఉంది. తమ పరిశోధకుల బృందం ఆక్స్ఫర్డ్ వర్సిటీతో కలిసి పనిచేస్తోందని, కరోనా వ్యాక్సిన్ను ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామన్న నమ్మకం ఉందని, మొదటి ఆరు నెలలపాటు నెలకు 50 లక్షల చొప్పున డోసులను తయారు చేస్తామని ‘సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సీఈవో అడార్ పూనావాలా వెల్లడించారు. అనంతరం నెలకు కోటి డోసుల చొప్పున ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు.
వూహాన్లో కోవిడ్ రోగులు జీరో
కరోనా వైరస్ పుట్టిన చైనాలో వూహాన్ మరో విజయాన్ని సాధించింది. కోవిడ్-19తో చికిత్స పొందుతున్న రోగులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆస్పతుల్లో లేరు. వ్యాధి నుంచి కోలుకొన్న 11 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో రోగుల సంఖ్య జీరోకి వచ్చింది. 2019 డిసెంబర్ చివరి వారంలో వైరస్ బయటపడిన తర్వాత తొలిసారిగా కరోనా రోగుల విషయంలో జీరో అన్నది సాధించామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. 76 రోజుల పాటు లాక్డౌన్లో ఉన్న వూహాన్లో ఏప్రిల్ 8న లాక్డౌన్ ఎత్తేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి
ఎప్పుడు: ఏప్రిల్ 26
ఎవరు: సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
ఎక్కడ: భారత్
ముఖ్యమంత్రులతో పీఎం వీడియో కాన్ఫరెన్స్
రెండో విడత దేశవ్యాప్త లాక్డౌన్ మే 3న ముగుస్తుండటంతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 27 వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ నిబంధనల అమలు, ఆంక్షలపై మినహాయింపులు తదితర అంశాలపై వారు చర్చించారు. ‘ఇప్పటివరకు రెండు లాక్డౌన్లను ప్రకటించాం. రెండూ వేర్వేరు తరహా నిబంధనలున్నవి. ఆ దిశగా ఆలోచించాలి. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు’అని సీఎంలతో మోదీ పేర్కొన్నారు. లాక్డౌన్ నుంచి దశలవారీగా బయటకు వచ్చే వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. కాన్ఫరెన్స్ లో హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ప్రధాని కార్యాలయంలోని, ఆరోగ్య శాఖలోని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి(ఆంధ్రప్రదేశ్), కేసీఆర్(తెలంగాణ), కేజ్రీవాల్(ఢిల్లీ), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర), పళనిస్వామి(తమిళనాడు), కన్రాడ్ సంగ్మా(మేఘాలయ), యోగి ఆదిత్యనాథ్(యూపీ) తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్లో ప్లాస్మాథెరపీ
మంగళగిరి ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)లో ప్లాస్మా థెరపీకి కేంద్రప్రభుత్వం అనుమతించింది. కొద్ది రోజుల క్రితమే ఎయిమ్స్లో ఇమ్యునోథెరపీ, ఫార్మకోథెరపీకి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. మంగళగిరిలో ఎయిమ్స్లో ప్లాస్మా థెరపీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్
ఎప్పుడు: ఏప్రిల్ 27
ఎవరు: ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు: కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ నిబంధనల అమలు, ఆంక్షలపై మినహాయింపులు తదితర అంశాలపై చర్చించేందుకు
మైనారిటీ విద్యా సంస్థలకూ నీట్: సుప్రీంకోర్టు
వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) మైనారిటీ, ప్రై వేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ మైనారిటీ వైద్య విద్యాసంస్థలు, ప్రై వేటు వైద్య విద్యాసంస్థల్లో నీట్ ద్వారా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరపాలని ఏప్రిల్ 29న తీర్పు వెలువరించింది. కేంద్రం విడుదల చేసిన నీట్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ వెల్లూర్లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, మణిపాల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ తదితర మైనారిటీ, ప్రై వేటు వైద్య విద్యా సంస్థలు దాఖలు చేసిన 76 పిటిషన్లను విచారించిన ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జరుగుతున్న అనేక అవకతవకలను అడ్డుకునే దిశగా ‘నీట్’ను ప్రారంభించినట్లు జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎం.ఆర్ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
జూమ్ సురక్షితమైనది కాదు: కేంద్రం

కరోనా బాధితులకు ప్లాస్మా చికిత్స: ఢిల్లీ సీఎం
కరోనా సోకిన వారికి త్వరలోనే ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్మెంట్ అందించేందుకు ట్రయల్స్ ప్రారంభించామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 16న ప్రకటించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి లభించిందని తెలిపారు. రాబోయే 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన ట్రయల్స్ ప్రారంభమవుతుందని, ఇది విజయవంతమైతే త్వరలోనే కరోనా రోగులకు ఈ విధమైన చికిత్స అందిస్తామని వెల్లడించారు.
కరోనా నివారణకు మందు ఇంతవరకు ఎవరు కనుక్కొలేదు. ప్లాస్మా థెరపీలో కరోనా సోకి కోలుకున్న వ్యక్తి శరీరం నుంచి రక్తాన్ని సేకరించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగి రక్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధారణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్రమంలో కరోనా వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఈ విధానం ద్వారా రోగులను బతికించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అగ్ర రాజ్యం అమెరికాతో పాటు చైనాలో సక్సెస్ కావడంతో కరోనా అధికంగా ఉన్న ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ లలో కూడా ప్లాస్మా ధెరపికి వైద్యులు మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో కూడా ప్లాస్మా థెరిపికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేరళకు అనుమతిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా సోకిన వారికి త్వరలోనే ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్మెంట్
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
టైమ్స్ ర్యాంకింగ్స్ లో పాల్గొనం: ఐఐటీలు
ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలకు ఇచ్చే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) ర్యాంకింగ్స్ ను ఈ సంవత్సరం(2020) బహిష్కరిస్తున్నట్లు భారత్లోని ఏడు ప్రఖ్యాత ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు ప్రకటించాయి. ఉత్తమ విద్యా సంస్థలుగా ప్రకటించేందుకు టీహెచ్ఈ అనుసరిస్తున్న ప్రక్రియ పారదర్శకంగా లేదని విమర్శించాయి. బాంబే, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాస్, రూర్కీ ఐఐటీలు ఏప్రిల్ 16న ఉమ్మడిగా ఈ ప్రకటన చేశాయి. ‘ఈ సంవత్సరం ర్యాంకింగ్సలో ఈ ఏడు ఐఐటీలు పాల్గొనడం లేదు. ర్యాంకింగ్ ప్రక్రియ విధి, విధానాలు, పారదర్శకతపై టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారు సంతృప్తికర వివరణ ఇస్తే 2021 సంవత్సర ర్యాంకింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తాం’అని స్పష్టం చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020 టైమ్స్ ర్యాంకింగ్స్ లో పాల్గొనం
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : భారత్లోని ఏడు ప్రఖ్యాత ఐఐటీలు
ఎందుకు: ఉత్తమ విద్యా సంస్థలుగా ప్రకటించేందుకు టీహెచ్ఈ అనుసరిస్తున్న ప్రక్రియ పారదర్శకంగా లేదని
ఆర్థిక మంత్రితో ప్రధాని మోదీ సమావేశం
కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 16న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎకానమీ పరిస్థితులను సమీక్షించడంతో పాటు దెబ్బతిన్న రంగాలకు మరో ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చే అంశంపై చర్చించారు. అలాగే భవిష్యత్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరుల సమీకరణ అంశం కూడా చర్చలు జరిపారు.
2020-21లో భారత్ వృద్ధి 1.1 శాతం: ఎస్బీఐ
కరోనా నేపథ్యంలో ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 1.1 శాతానికి పడిపోయే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏప్రిల్ 16న వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు: కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు
ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 29 కోట్ల టన్నులు
2020-21 పంట ఏడాదిలో (జులై-జూన్) ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 29.83 కోట్ల టన్నులుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్దేశించుకుంది. జూన్-సెప్టెంబరు మధ్య సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) అంచనా వేసిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2020-21 పంట ఏడాది ఖరీఫ్లో 14.99 కోట్ల టన్నులు, రబీలో 14.84 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యం విధించుకున్నట్లు వ్యవసాయ కమిషనర్ ఎస్కే మల్హోత్రా వెల్లడించారు.
మోదీ ప్రసంగానికి వీక్షకులు 20 కోట్లు
లాక్డౌన్ను పొడిగిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా టీవీల్లో 20.3 కోట్ల మంది వీక్షించారని బార్క్(బ్రాడ్కాస్ట్ ఆడిఝెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) వెల్లడించింది. మొదటి లాక్డౌన్ ప్రకటన సమయంలో దేశవ్యాప్తంగా 19.3 కోట్ల మంది టీవీల్లో ప్రధాని ప్రకటనను వీక్షించినట్లు బార్క్ తెలిపింది. దీంతో తన రికార్డును తానే అధిగమించారని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020-21 పంట ఏడాదిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 29 కోట్ల టన్నులు
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
పారాసిటమాల్ మాత్రల ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కరోనా బాధితుల చికిత్సలో ఈ మాత్రలు కీలకంగా పనిచేస్తున్నాయని భావించిన ప్రభుత్వం ఈ మందులను విదేశాలకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తగినన్ని నిల్వలు ఉన్నందున ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఏప్రిల్ 17న కేంద్ర విదేశీ ఎగుమతుల డెరైక్టర్ జనరల్ అమిత్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పారాసిటమాల్లో వినియోగించే ముడి సరుకు ఎగుమతులపై మాత్రం ఆంక్షలు యథావిధిగా అమలులో ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు:ఏప్రిల్ 17
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు: ప్రస్తుతం దేశంలో తగినన్ని నిల్వలు ఉన్నందున
వ్యవసాయోత్పత్తుల రవాణాకు కిసాన్ రథ్ యాప్
వ్యవసాయోత్పత్తుల రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ పోర్ట్ అగ్రిగేటర్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ‘కిసాన్ రథ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ యాప్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఏప్రిల్ 17న ఆవిష్కరించారు. వ్యవసాయ క్షేత్రాల నుంచి ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు 5 లక్షల ట్రక్కులు, 20 వేల ట్రాక్టర్లు ఈ మొబైల్ ప్లాట్పామ్లో అందుబాటులో ఉన్నాయి. ‘లాక్డౌన్ సమయంలో రైతుల తమ ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన ట్రాక్టర్లు, ట్రక్కులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను మండీలు, ఇతర మార్కెట్లకు తరలించడానికి కిసాన్ రథ్ యాప్ ఉపయోగపడుతుంద’ని అధికారులు తెలిపారు. రైతుల ఇబ్బందులను తొలగించడానికి కొద్దిరోజుల క్రితం ఇండియా అగ్రి ట్రాన్స్ పోర్ట్ కాల్ సెంటర్ను మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వ్యవసాయోత్పత్తుల రవాణాపై కాల్ సెంటర్
దేశంలో రాష్ట్రాల మధ్య పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు ఇతర వ్యవసాయోత్పత్తుల రవాణా సులభతరం చేయడానికి కేంద్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. 14488 నంబర్లోగానీ, 18001804200 నంబర్లో గానీ కాల్ సెంటర్ను సంప్రదించవచ్చన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కిసాన్ రథ్ యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు:ఏప్రిల్ 17
ఎవరు : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
ఎందుకు: వ్యవసాయోత్పత్తుల రవాణాకు
కరోనా మహమ్మారిపై పోరుకు కోవిడ్ వారియర్స్
కరోనాపై పోరాటంలో రాష్టాలకు సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డేటాబేస్ను ఏర్పాటు చేసింది. ఆయుష్ వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు, నెహ్రూ యువకేంద్ర సభ్యులు, మాజీ సైనికులు, ఎన్సీసీ సభ్యులు, ప్రధానమంత్రి కౌషల్ వికాస్ యోజన సభ్యుల, వాలంటీర్ల పేర్లు, వివరాలతో ఈ డేటాబేస్ సిద్ధమైంది. కోవిడ్ వారియర్స్ అని పిలిచే వీరి సేవలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు, రేషన్ దుకాణాలు, కూరగాయల మార్కెట్లలో భౌతిక దూరాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, అనాథలకు సేవలందించేందుకు వాడుకోవచ్చు. https://covidwarriors.gov.in వెబ్సైట్లో కొవిడ్ యోధుల సమాచారం అందుబాటులో ఉంటుందని కేంద్ర సర్కారు వెల్లడించింది. అలాగే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సాంకేతిక సిబ్బంది, స్వచ్ఛంద సేవలకు శిక్షణ ఇచ్చేందుకు https://igot.gov.in/igot అనే డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు
ఎప్పుడు:ఏప్రిల్ 19
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు: కరోనాపై పోరాటంలో రాష్టాలకు సహకరించేందుకు
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి మూడు సంస్థలకు నిధులు
కరోనా వైరస్కు వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ(డీబీటీ) మూడు కంపెనీలను నిధులు అందజేయనుంది. ఇందుకోసం క్యాడిలా హెల్త్కేర్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలను ఎంపిక చేసింది. భారత్ బయోటెక్ ‘ఇన్యాక్టివేటెడ్ రేబీస్ వెక్టార్ ప్లాట్ఫామ్’ను ఉపయోగించి టీకాను అభివృద్ధి చేయనుంది. వైద్య పరికరాల తయారీకి మరో 13 కంపెనీలను కూడా డీబీటీ ఎంపిక చేసింది. ఈ 13 సంస్థలకు కూడా డీబీటీ ఆర్థిక సాయం చేయనుంది. నేషనల్ బయోఫార్మా మిషన్ నుంచి నిధులను అందించి, ఒక పరిశోధనా కన్సార్షియం ద్వారా వివిధ దశల్లో వీటి అభివృద్ధిని పరిశీలించనున్నట్లు డీబీటీ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి మూడు సంస్థలకు నిధులు
ఎప్పుడు:ఏప్రిల్ 20
ఎవరు : డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ(డీబీటీ)
చైనా రాపిడ్ టెస్టింగ్ కిట్స్ వాడొద్దు: ఐసీఎంఆర్
కరోనా వైరస్ సోకిందో, లేదో వేగంగా నిర్ధారించే ‘రాపిడ్ టెస్టింగ్ కిట్స్’ను రెండు రోజుల పాటు వాడవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఏప్రిల్ 21న రాష్ట్రాలను కోరింది. చైనా నుంచి కొనుగోలు చేసిన ఆ కిట్స్ ద్వారా జరిపిన నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్షేత్రస్థాయిలో ఆ కిట్స్ పనితీరును పరీక్షించి, అనంతరం రాష్ట్రాలకు వాటి వినియోగంపై సూచనలు చేస్తామంది. నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని తేలితే, ఆ కిట్స్కు బదులుగా, సంబంధిత సంస్థను వేరే కిట్స్ను సరఫరా చేయాలని కోరుతామన్నారు.
5.4 శాతం మాత్రమే..
చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు రాజస్తాన్ ప్రకటించింది. ఆ కిట్స్ ద్వారా జరిపిన పరీక్షల్లో 90 శాతం సరైన ఫలితాలు రావాల్సి ఉండగా.. 5.4 శాతం మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు తెలిపింది.
రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కు ఆమోదం
ఇప్పటివరకు చేస్తున్న పాలిమెరేజ్ చైన్ రియాక్షన్(పీసీఆర్) పరీక్షల్లో గొంతు, ముక్కులో నుంచి తీసిన శాంపిల్ను పరీక్షించి, కరోనా సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. అయితే, ఈ విధానంలో ఫలితాలు వచ్చేందుకు 5- 6 గంటల సమయం పడుతుంది. కానీ రక్త పరీక్ష ద్వారా జరిపే రాపిడ్ యాంటీబాడీ టెస్ట్లో ఫలితం అరగంటలోపే వచ్చేస్తుంది. హాట్స్పాట్స్లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చైనా రాపిడ్ టెస్టింగ్ కిట్స్ వాడొద్దు
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)
ఎందుకు: ఆ కిట్స్ ద్వారా జరిపిన నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో
యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ తగ్గింపు
యూరియాయేతర ఎరువులపై సబ్సిడీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కరోనా సంక్షోభ సమయంలో ఈ నిర్ణయం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఖజానాపై ఎరువుల సబ్సిడీ భారం రూ. 22,186.55 కోట్లకు తగ్గనుంది. ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులపై సబ్సిడీ రేట్లను నిర్ణయించేందుకు ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు. నైట్రోజన్పై సబ్సిడీని కేజీకి రూ. 18.78కి, పొటాష్పై సబ్సిడీని కేజీకి రూ. 10.11కి, పాస్ఫరస్పై సబ్సిడీని కేజీకి రూ. 14.88కి, సల్ఫర్పై సబ్సిడీని కేజీకి రూ. 2.37కి తగ్గించినట్లు ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇది నైట్రోజన్పై రూ. 18.90గా, పొటాష్పై రూ. 11.12గా, ఫాస్ఫరస్పై రూ. 15.21గా, సల్ఫర్పై రూ. 3.56గా ఉంది. అలాగే, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ(ఎన్బీఎస్) ఎరువుల జాబితాలోకి అమ్మోనియం ఫాస్ఫేట్ను చేర్చాలన్న ప్రతిపాదనకు సీసీఈఏ ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ తగ్గింపు
ఎప్పుడు:ఏప్రిల్ 22
ఎవరు : ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ
వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల జైలు
వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ కు ఏప్రిల్ 22న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై హింసకు, వేధింపులకు పాల్పడితే అది శిక్షార్హమైన, బెయిల్కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.
కొత్త చట్టం ప్రకారం..
మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని, ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని మంత్రి జవదేకర్ వివరించారు. ఆస్తి నష్టం జరిగితే, ఆ ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు వసూలు చేస్తామన్నారు. కోవిడ్-19కు చికిత్స అందించే లేదా కరోనా వ్యాప్తిని నిర్ధారించే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది తమతో పాటు కరోనా వైరస్ను తీసుకువస్తున్నారనే అనుమానంతో వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమానులు, స్థానికులు ఆయా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా ఈ చట్టం కింద కఠిన చర్యలుంటాయన్నారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎపిడమిక్ డిసీజెస్ చట్టం, 1897కు సవరణలు చేస్తామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ కు ఆమోదం
ఎప్పుడు: ఏప్రిల్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు: కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కోవిడ్-19 అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో
కరోనా వైరస్ వ్యాప్తిపై జీఓఎం సమావేశం

క్విక్ రివ్యూ:
ఏమిటి: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్హవర్ధన్ అధ్యక్షతన జీఓఎం సమావేశం
ఎప్పుడు: ఏప్రిల్ 9
ఎక్కడ: న్యూఢిల్లీ
ఎందుకు: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు
కోవిడ్-19 అత్యవసర ప్యాకేజీకి కేంద్రం ఆమోదం
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘భారత్ కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి ఏప్రిల్ 9న ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దశల వారీగా మొత్తం రూ.15,000 కోట్లు అందజేయనుంది. వచ్చే నాలుగేళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మొదటి దశ కింద రూ.7,774 కోట్లు..
2020 జనవరి నుంచి జూన్ వరకు మొదటి దశ, 2021 జూలై నుంచి మార్చి వరకు రెండో దశ, 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మూడో దశ అమలవుతుంది. మొదటి దశ అమలు కోసం కేంద్రం అతి త్వరలో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.7,774 కోట్లు విడుదల చేయనుంది. తొలి దశ కింద ఇచ్చే నిధులను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఖర్చు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్ కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజీకి ఆమోదం
ఎప్పుడు: ఏప్రిల్ 9
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎందుకు: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా
దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదు: కేంద్రం
కరోనా వైరస్కు సంబంధించి భారత్లో ఇప్పటివరకు సమూహ వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) దశ రాలేదని కేంద్రం ప్రకటించింది. అలాంటిదేమైనా ఉంటే, ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు ముందు మీడియాకే చెప్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఏప్రిల్ 10న వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ బారిన పడిన 104 మందిలో 40 మందికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ కానీ, పాజిటివ్గా తేలిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న చరిత్ర కానీ లేదని తేలిందని ఐసీఎంఆర్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించగా, లవ్ అగర్వాల్ పై సమాధానం ఇచ్చారు. మరోవైపు, కోవిడ్-9పై సమర్ధవంతంగా పనిచేస్తుందని తేలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ను ఎగుమతి చేయాలంటూ పలు దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, భారత్కు అవసరమైన స్టాక్ ఉన్న తరువాత, మిగతా స్టాక్ను ఎగుమతి చేయాలని నిర్ణయించామని తెలిపింది.
ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ ప్రారంభం
విరాళాల ప్లాట్ఫార్మ్ ‘గివ్ ఇండియా’ రూ.75 కోట్ల ఆరంభ విరాళంతో ‘ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్’ను (ఐసీఆర్ఎఫ్) ప్రారంభించింది. కరోనా కల్లోలానికి కుదేలవుతున్న వారిని ఆదుకోవడానికి ఐసీఆర్ఎఫ్ను ప్రారంభించామని గివ్ ఇండియా ఏప్రిల్ 14న తెలిపింది. కనీసం కోటిమందికై నా సాయమందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బిల్గేట్స్కు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, గూగుల్.ఓఆర్జీ, హెచ్ఎస్బీసీ ఇండియా, మ్యారికో, ఉబెర్ ఇండియా తదితర సంస్థలు విరాళాలు అందజేశాయని గివ్ ఇండియా డెరైక్టర్ గోవింద్ అయ్యర్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ ప్రారంభం
ఎప్పుడు: ఏప్రిల్ 14
ఎవరు: గివ్ ఇండియా
ఎందుకు: కరోనా కల్లోలానికి కుదేలవుతున్న వారిని ఆదుకోవడానికి
దేశవ్యాప్తంగా రెడ్జోన్లో 170 జిల్లాలు
దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్స్పాట్(రెడ్జోన్) జిల్లాలుగా గుర్తిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏప్రిల్ 15న రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటివరకు నమోదైన కేసుల ఆధారంగా జిల్లాలను హాట్స్పాట్ (రెడ్ జోన్), నాన్ హాట్స్పాట్ (ఆరెంజ్), నాన్ ఇన్ఫెక్టెడ్ (గ్రీన్ జోన్) జిల్లాలుగా వర్గీకరించింది. రెడ్జోన్లో 170 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 207, మిగతావి గ్రీన్ జోన్లో ఉన్నట్టు తెలిపింది. రెడ్ జోన్ను రెండు రకాలుగా ఉపవర్గీకరణ చేసింది. విస్రృతి ఎక్కువగా ఉన్నవి 143 (లార్జ్ ఔట్బ్రేక్) జిల్లాలు, క్లస్టర్లలో విస్రృతి ఉన్నవి 47 జిల్లాలుగా గుర్తించింది. రాష్ట్రాలు ఆయా జోన్లవారీగా నిర్దేశిత కార్యాచరణ ద్వారా వైరస్ను అదుపులోకి తీసుకురావాలని సూచించింది. ఇకపై కూడా కేసుల సంఖ్య రెట్టింపయ్యే ప్రాతిపదికన రెడ్ జోన్లను గుర్తించాలని కోరింది. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్జోన్ నుంచి ఆరెంజ్ జోన్కు, 28 రోజుల్లో కొత్త కేసులు లేనిపక్షంలో గ్రీన్ జోన్కు మార్చాలని సూచించింది. కేస్ లోడ్, నాలుగు రోజుల్లో రెట్టింపు సంఖ్య నమోదైన జిల్లాలు తదితర అంశాల ప్రాతిపదికన జోన్లుగా వర్గీకరించినట్టు తెలిపింది. ఏపీలో 11 జిల్లాలు, తెలంగాణలో 9 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి.
కరోనాపై అవగాహనకు ఆరోగ్య సేతు యాప్

ఆరోగ్య సేతు ప్రయోజనాలు..
- దేశంలో కరోనా కేసుల అప్డేట్ తెలుసుకోవచ్చు.
- కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది
- కరోనావైరస్ ఉన్న వ్యక్తికి దగ్గరగా వెళ్తే యాప్ మీ లొకేషన్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్రభుత్వానికి చేరవేస్తుంది.
- కోవిడ్ -19 లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నిర్థారించడానికి అనేక ప్రశ్నలను అడిగే ప్రత్యేకమైన చాట్బోట్ ఉంటుంది.
- కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే ప్రకటనలు, తీసుకునే చర్యలను తెలియజేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆరోగ్య సేతు యాప్ రూపకల్పన
ఎప్పుడు: ఏప్రిల్ 2
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎందుకు: కరోనాపై అవగాహనకు
నగరాలు, పట్టణాల్లో మెరుగైన వాయు నాణ్యత: సీపీసీబీ
దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యత క్రమంగా పెరుగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వెల్లడించింది. లాక్డౌన్తో వాహనాలు, ఇతరత్రా రూపాల్లోని కాలుష్యం గణనీయంగా తగ్గిపోవడంతో గాలి నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంది. 2019, మార్చి 29న వివిధ నగరాల్లోని వాయునాణ్యతతో.. 2020 ఏడాది మార్చి 29న అవే నగరాల్లోని గాలి నాణ్యతను పోల్చి చూడగా పలు అంశాలు వెల్లడయ్యాయి.
సమీర్యాప్ ద్వారా...
దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యతను (ఎయిర్క్వాలిటీ ఇండెక్స్) సీపీసీబీ వాస్తవ సమయం (రియల్టైం)లో పరిశీలించి ‘సమీర్యాప్’ద్వారా ఆ వివరాలను ఒక సూచీ ద్వారా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. 2019 వేసవి సందర్భంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో హైదరాబాద్ మహానగరం వంద పాయింట్లకు పైబడి ఉండగా, ప్రస్తుతం వాయునాణ్యత 68 పాయింట్లుగా ఉంది.
వాయునాణ్యత తీరు...
ఏక్యూఐలో 50 పాయింట్ల లోపు ఉంటే స్వచ్ఛ మైన వాతావరణంతో పాటు అతినాణ్యమైన వాయువు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు లెక్కిస్తారు. 50 నుంచి 100 పాయింట్ల వరకు మంచి వాయు నాణ్యత ఉన్నట్లు అంచనా వేస్తారు.
వ్యాధి నిర్ధారణ కిట్ల ఎగుమతులపై నిషేధం
కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధి నిర్ధారణ కిట్ల (డయాగ్నొస్టిక్ కిట్ల) ఎగుమతులపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏప్రిల్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోఈ కిట్ల అవసరం చాలా వుందని పేర్కొంది. డయాగ్నొస్టిక్ కిట్ల ఎగుమతులను (డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్ బ్యాకింగ్, ప్రిపరేషన్ డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్) నిలిపివేస్తున్నామని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. మరోవైపు కరోనావైరస్ నిరోధంలో అవసరమైన రక్షణ పరికరాలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వ్యాధి నిర్ధారణ కిట్ల ఎగుమతులపై నిషేధం
ఎప్పుడు: ఏప్రిల్ 4
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎందుకు: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో
ఔషధాల ఎగుమతులపై పాక్షికంగా నిషేధం ఎత్తివేత
ప్రాణాంతక కరోనా వైరస్తో అల్లాడుతున్న దేశాలకు అత్యవసరమైన మందులను సరఫరా చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మహమ్మారిని కట్టడి చేయడంలో సత్ఫలితాలు అందిస్తున్న పారాసిటమోల్, హైడ్రాక్సీక్లోరోక్విన్ను ఎగుమతి చేస్తామని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఏప్రిల్ 7న ప్రకటన విడుదల చేశారు. కరోనాను కట్టడి చేయడం కోసం ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీని ఎగుమతులపై భారత్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో క్లోరోక్విన్ సహా అవసరమైన ఇతర ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఔషధాల ఎగుమతులపై పాక్షికంగా నిషేధం ఎత్తివేత
ఎప్పుడు: ఏప్రిల్ 7
ఎవరు: భారత ప్రభుత్వం
ఎంపీల వేతనాల కోత ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం
కరోనా వైరస్పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా పార్లమెంటు సభ్యులందరి వేతనంలో సంవత్సరం పాటు 30 శాతం కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ కు ఏప్రిల్ 6న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సంఘటిత నిధిలో చేరే ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటంలో వినియోగించనున్నారు. ఈ మేరకు ‘శాలరీ, అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్-1954’కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ రూపొందించామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఎంపీల వేతనానికి, ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల వేతనాలకు తేడా ఉంటుంది. ఎంపీలు నెలకు సుమారు రూ. లక్ష వేతనంతో పాటు, రూ. 70 వేలను నియోజకవర్గ అలవెన్స్ గా పొందుతారు. మంత్రుల వేతనం కూడా దాదాపు అంతే ఉంటుంది కానీ వారికి వేరే అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపీల్యాడ్ పథకం నిలిపివేత..
ఎంపీల్యాడ్(ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్) ఫండ్ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని రెండు ఆర్థిక సంవత్సరాల(2020-21, 2021-22) పాటు నిలిపివేయనున్నారు. ఈ మొత్తాన్ని కూడా కోవిడ్-19పై పోరుకు వినియోగిస్తారు. లోక్సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. ఈ మొత్తం 788 మంది ఎంపీలకు ఎంపీల్యాడ్స కింద ఒక్కొక్కరికి ఏటా రూ. 5 కోట్ల చొప్పున ఇస్తారు. రెండేళ్లకు గానూ ఈ మొత్తం దాదాపు రూ. 7,880 కోట్లు అవుతుంది. అలాగే, ఎంపీల వేతనాల్లో కోత ద్వారా ఏటా రూ. 29 కోట్లు కరోనాపై పోరాటానికి జమ అవుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎంపీల వేతనాల కోత ఆర్డినెన్స్ కు ఆమోదం
ఎప్పుడు: ఏప్రిల్ 6
ఎవరు: కేంద్ర కేబినెట్
ఎందుకు: కరోనా వైరస్పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా
కరోనా మరణాలకూ బీమా పరిహారం
జీవిత బీమా పరిహార ప్రయోజనాలను కోవిడ్-19(కరోనా వైరస్) బారిన పడిన పాలసీదారుల కుటుంబాలకు కూడా అందించనున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడించింది. కరోనాతో మరణించిన పాలసీదారుల క్లెయిమ్స్కు సైతం బీమా సంస్థలు చెల్లింపులు జరుపుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బీమా సంస్థలు ఇందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే కస్టమర్లకు తెలియజేశాయని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వివరించింది. కరోనా క్లెయిమ్స్కు ఫోర్స్ మెజూర్ నిబంధన వర్తింపచేయడం లేదని తెలిపింది. సాధారణంగా ఊహించని, నియంత్రించలేని కారణాలతో తలెత్తే క్లెయిమ్లను ఈ నిబంధన కింద బీమా సంస్థలు తిరస్కరించవచ్చు. కరోనా వ్యాధికి కూడా ఇది వర్తిస్తుందేమోనని పాలసీదారుల్లో సందేహాలు నెలకొన్న నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్గా ఎస్ఎన్ భట్టాచార్య ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా మరణాలకూ బీమా పరిహారం
ఎప్పుడు: ఏప్రిల్ 6
ఎవరు: లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ
కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో అత్యవసరమైతే తప్ప కోర్టులకు రావాల్సిన అవసరం లేదనీ, అన్ని కోర్టులు భౌతిక దూరం పాటిస్తూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. టెక్నాలజీని ఉపయోగించుకుని కోర్టుల్లో విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 6న ఆదేశాలను జారీచేసింది. న్యాయప్రక్రియ సజావుగా సాకేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ చేపట్టేందుకు దేశంలోని హైకోర్టులన్నింటికీ అనుమతినిస్తూ అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఐసోలేషన్ కేంద్రాలుగా రైల్వే కోచ్లు
కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ 2,500 కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. మొత్తం 5 వేల కోచ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా మొదటి దశలో భాగంగా 2,500 కోచ్ లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటితో కొత్తగా 50 వేల ఐసోలేషన్ బెడ్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ
ఎప్పుడు: ఏప్రిల్ 6
ఎవరు: సుప్రీంకోర్టు
ఎక్కడ : సుప్రీంకోర్టు, హైకోర్టులు
ఎందుకు: కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభిస్తోన్నందున
18 నెలలకు సరిపడా ఆహార నిల్వలు
దక్షిణాది రాష్ట్రాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద పంపిణీ చేసేందుకు 18 నెలలకు సరిపడే ఆహార ధాన్యాల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ప్రకటించింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అవసరమైన ఆహార ధాన్యాలను సిద్ధం చేశామని తెలిపింది. ఈ మేరకు ఎఫ్సీఐ తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ రీజియన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విక్టర్ అమల్రాజ్ ఏప్రిల్ 7న ప్రకటన విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 18 నెలలకు సరిపడా ఆహార నిల్వలు
ఎప్పుడు: ఏప్రిల్ 7
ఎవరు: కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్సీఐ)
ఎక్కడ : దక్షిణాది రాష్ట్రాలకు
ఎందుకు: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద పంపిణీ చేసేందుకు
అత్యంత విలువైన మూడవ కంపెనీగా హెచ్యూఎల్
ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స (ఎఫ్ఎంసీజీ) దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ ఏప్రిల్ 7న దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. హిందూస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ విలువ మొదటిసారి రూ .5 లక్షల కోట్లను అధిగమించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత మూడవ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా హెచ్యూఎల్ అవతరించింది. గ్లాక్సోస్మిత్ కై ్లన్ (జీఎస్కే) పీఎల్సీకి చెందిన ఆసియా హెల్త్ ఫుడ్ డ్రింక్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు హెచ్యూఎల్ ప్రకటించింది. దీంతో భారతదేశంలో అతిపెద్ద ఆహార సంస్థగా అవతరించనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరణ
ఎప్పుడు: ఏప్రిల్ 7
ఎవరు: హిందూస్తాన్ యూనిలీవర్
ఎక్కడ : భారత్
వైద్య సిబ్బంది కోసం పీఎం కల్యాణ్ బీమా పథకం
కోవిడ్-19(కరోనా వైరస్) బాధితులకు చికిత్స అందిస్తూ, లేదా అదే వైరస్ బారినపడి మృతిచెందే వైద్య సిబ్బందికి రూ.50 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్’ ద్వారా ఈ బీమాను అందించనున్నట్లు తెలిపింది. 2020, మార్చి 30 నుంచి 90 రోజులపాటు ఇది అమల్లో ఉంటుందని ఏప్రిల్ 7న పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది, విశ్రాంత సిబ్బంది, వలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆరోగ్య సేవలు అందించే అవుట్సోర్స్, దినసరి సిబ్బందికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఈ పథకంలో చేరేందుకు వీరెవరూ ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్
ఎప్పుడు: ఏప్రిల్ 7
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎందుకు: కోవిడ్-19(కరోనా వైరస్) బాధితులకు చికిత్స అందిస్తూ, లేదా అదే వైరస్ బారినపడి మృతిచెందే వైద్య సిబ్బందికి రూ.50 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించేందుకు
ఉచితంగా కరోనా పరీక్షలు: సుప్రీంకోర్టు
అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ లేబోరేటరీల్లో ప్రజలకు కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ విషయంలో వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని ఏప్రిల్ 8న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటళ్లు, ల్యాబ్ల పాత్ర అత్యంత కీలకమని, ప్రజలకు సేవలందించడంలో దాతత్వం చూపాలని వ్యాఖ్యానించింది. కరోనా పరీక్షలను ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్లు, డబ్ల్యూహెచ్వో/ఐసీఎం ఆర్ అనుమతి పొందిన ల్యాబ్ల్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
ప్రైవేట్ ల్యాబ్ల్లో కరోనా పరీక్షల పేరిట విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, దీన్ని అరికట్టాలని కోరుతూ అడ్వొకేట్ శశాంక్దేవ్ సుధీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ప్రైవేట్ ల్యాబ్ల్లో కరోనా పరీక్షలకు ప్రజల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుండడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రజలకు కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలి
ఎప్పుడు: ఏప్రిల్ 8
ఎవరు: సుప్రీంకోర్టు
ఎక్కడ : అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ లేబోరేటరీల్లో
ఎందుకు: ప్రైవేట్ ల్యాబ్ల్లో కరోనా పరీక్షల పేరిట విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని
దేశంలో సామాజిక అత్యవసర పరిస్థితి
దేశంలో ప్రస్తుతం ‘సామాజిక అత్యవసర పరిస్థితి(సోషల్ ఎమర్జెన్సీ)’ తరహా అసాధారణ స్థితి నెలకొని ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా నెలకొన్న ఈ స్థితి వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. ప్రతీ ప్రాణాన్ని కాపాడటమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేలా అప్రమత్తతను కొనసాగించాలని కోరారు. పార్లమెంట్లోని విపక్ష, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఏప్రిల్ 8న ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నేతల సూచనలను స్వీకరించారు.
2020-21లో వృద్ధి 1.6 శాతమే.గోల్డ్మాన్ శాక్స్
కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు పలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోనుందని అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్మన్ శాక్స్ తెలిపింది. 2020-21లో భారత్ వృద్ధి రేటు 1.6 శాతమే ఉండవచ్చని అంచనా వేసింది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత విధానకర్తలు అవసరమైనంత దూకుడుగా వ్యవహరించడం లేదని అభిప్రాయపడింది. గతంలో వచ్చిన మాంద్యాలతో పోలిస్తే ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొందని, అప్పట్లో లేనంతగా ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే పలు రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాలను సుమారు 2 శాతం స్థాయికి కుదించిన సంగతి తెలిసిందే.
ప్యాకేజీ సరిపోదు..
కరోనా సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ, ముప్పావు శాతం మేర రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోత సరిపోదని.. అంతకు మించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గోల్డ్మన్ శాక్స్ తెలిపింది. స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 60 శాతం ఉండే వినియోగం.. లాక్డౌన్ కారణంగా గణనీయంగా పడిపోవచ్చని పేర్కొంది.