Indian President: దేశ చరిత్రలో తొలిసారిగా శబరిమలకు రాష్ట్రపతి
Sakshi Education
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 19న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.

ఆలయాన్ని దర్శించనున్న తొలి రాష్ట్రపతిగా ఆమె చరిత్రకెక్కనున్నారు. ఈ విషయాన్ని ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్కోర్దేవస్వం బోర్డు (TDB) అధికారికంగా ప్రకటించింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా.. మే 18వ తేదీ కేరళలోని కొట్టాయం జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. మే 19వ తేదీ ఉదయం నిలక్కల్ హెలిపాడ్కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడి నుంచి పంపా బేస్ క్యాంప్కు వెళతారు.
- అక్కడి నుంచి ఆలయం వరకు దాదాపు 4.25 కిలోమీటర్ల ఎత్తైన మార్గాన్ని పాదయాత్రగా నడిచి వెళ్లే అవకాశం ఉంది.
- లేకపోతే అత్యవసర రహదారిలో వాహనంలో పయనం చేసే అవకాశమూ ఉంది.
- ఈ అంశంపై తుది నిర్ణయం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) తీసుకోనుంది.
Published date : 07 May 2025 11:30AM