Skip to main content

Indigenous Weapons: ఆర్మీ డ్రోన్‌లను తయారు చేసింది ఈ కంపెనీల్లోనే..

భారత ఆర్మీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ఉపయోగించిన ఆత్మాహుతి డ్రోన్‌లను బెంగళూరులో తయారు చేశారు.
Suicide drones used in Operation Sindoor, jointly manufactured by Alpha Design and Elbit Security Systems  This Bengaluru-based Company Manufactured the Suicide Drones Used in Operation Sindoor to Attack Pakistan

స్వయం చాలితమైన ఈ డ్రోన్లు పాక్‌ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్‌లలోని 9 ఉగ్రవాద స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో నేలమట్టం చేశాయి. బాలాకోట్‌ దాడి తర్వాత వీటిని ఆర్మీలో చేర్చారు.
 
డ్రోన్లను తయారు చేసింది ఈ కంపెనీల్లోనే.. 
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆల్ఫా డిజైన్, ఇజ్రాయెల్‌ ఎల్బిట్‌ సెక్యురిటీ సిస్టమ్స్‌ సంయుక్తంగా ఈ డ్రోన్లను తయారు చేసినట్లు తెలిసింది. ఈ కంపెనీల ప్రధాన కార్యాలయాలు బెంగళూరులోనే ఉండడం గమనార్హం. భారత ఆర్మీ ప్రత్యేకంగా 100 డ్రోన్ల కొనుగోలుకు ఆర్డర్‌ చేసింది. ఎలాంటి శబ్దం లేకుండా, తక్కువ ఎత్తులో ఎగురుతూ 5–10 కిలోల బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల ఈ డ్రోన్లకు 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల సత్తా ఉంది.

S-400 Missile System: భారత వాయుసేనలో.. పవర్‌ఫుల్ ఆయుధం ఇదే..

Published date : 09 May 2025 11:34AM

Photo Stories